India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతికగా చిత్రకారులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, తదితరులు ఉన్నారు.

✔ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ✔పాలమూరులో పెరిగిన కోడి గుడ్ల ధరలు ✔తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే ✔సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి:STU ✔గద్వాల: 13న ఐటీఐ అప్రెంటిస్ జాబ్ మేళా ✔Way2Newsతో JL సాధించిన అనిల్ కుమార్ ✔గ్రూప్-2 పరీక్ష.. ఏర్పాట్ల పై ఫోకస్ ✔NGKL: స్కూల్ అమ్మాయిలపై వేధింపులు.. ఇద్దరికి జైలు శిక్ష ✔విలేఖరులకు అండ TUWJ: మధు ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్

అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.1,06,04,436 సమకూరింది. ఈ ఆదాయం ఐదు నెలలు తర్వాత లెక్కింపులో ఇంత భారీ ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కొడంగల్ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్లో రూ. 2కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లయిడ్ సైంటిస్ట్గా బొంరాస్పేట మం. తుంకిమెట్ల యువకుడు సయ్యద్ అర్బజ్ ఖురేషి(26) సెలక్ట్ అయ్యారు. పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు USAలోని UMASS యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్లో MS పట్టా పొందారు.

రాహుల్ గాంధీ జోడోయాత్ర 2022 OCT 23న తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక సరిహద్దు టై రోడ్డులో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాత్ర 3 రోజుల విరామం తర్వాత OCT 27న నారాయణపేట జిల్లాలో పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో MBNR జిల్లా సరిహద్దు సీసీకుంట మం. లాల్ కోట ఎక్స్ రోడ్లో మరో విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. రూ.50 ఫైన్తో ఈనెల 10లోగా చెల్లించాలని, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

✔మా జీతాలు పెంచండి సీఎం సారు:TUCI✔గట్టు: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి✔మా హయంలో భీమా సౌకర్యం కల్పించాం: శ్రీనివాస్ గౌడ్✔రాజోలి: సుంకేసుల బ్యారేజీ గేట్లు క్లోజ్✔ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు✔PUలో సౌత్ జోన్ ఎంపికలు✔NGKL:రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు✔పలు మండలాలలో సర్వే పూర్తి✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔మహా పడిపూజలో ఎంపీ డీకే అరుణ, ఉమ్మడి జిల్లా నేతలు✔సీఎంను కలిసిన జిల్లా నేతలు

మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం అని ప్రముఖ కవులు జనజ్వాల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త కే లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు ఈనెల 14న MBNRలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం కంటే ముందు మనుషులని, మానవత్వమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు.

హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్ధరిస్తారని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారనుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నిన్న రూ. 79 పెంచి రూ. 1000 జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగాNRPT జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో 12డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.0నుంచి 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
Sorry, no posts matched your criteria.