Mahbubnagar

News June 13, 2024

PU: ‘ఈ ఏడాది నుంచి నూతన కోర్సులు ప్రారంభించాలి’

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఓఎస్డి మధుసూదన్ రెడ్డికి గురువారం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ విద్యాసంవత్సరం నుండే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఏం, ఇంజనీరింగ్ బీటెక్, ఎంటెక్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సందే కార్తిక్ మాదిగ, పవన్ కుమార్ రెడ్డి, రూప్ సింగ్ నాయక్, మీసాల గణేష్ మాదిగ, బత్తిని రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

కొడంగల్‌కు రూ.73.45 కోట్లు మంజూరు

image

సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి భారీగా నిధులు మంజూరు చేశారు. బీసీ గురుకుల విద్యాలయాల నిర్మాణానికి రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీకి రూ.25 కోట్లు, పాఠశాలకు రూ.23.45 కోట్లు, బూరాన్‌పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేశారు.

News June 13, 2024

ఫోన్ ట్యాపింగ్ బాధ్యులకు కటకటాలే: మంత్రి జూపల్లి

image

ఫోన్ ట్యాపింగ్‌కు కారణమైన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలు కటకటాల్లోకి వెళ్లక తప్పదని పర్యాటక, ఆబ్కారీ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డా.మల్లురవి విజయం సాధించడంతో బుధవారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే ప్రజా భవన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడారు.

News June 13, 2024

NRPT: పట్టపగలు కారు అద్దాలు పగలగొట్టి చోరీ

image

నారాయణపేటలో గురువారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానిక సరాఫ్ బజార్‌లో నిలిపి ఉంచిన కారు అద్దాలు పగల గొట్టి దుండగులు చోరికి పాల్పడ్డారు. కారులో రూ.3 లక్షల 70 వేలు ఉన్నాయని, వాటిని దుండగులు ఎత్తుకెళ్లారని కోస్గికి చెందిన బాధితుడు చెప్పాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుకాణాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

News June 13, 2024

MBNR: సాగు లేక.. ధరలు మండిపోతున్నాయి

image

ఉమ్మడి జిల్లాలో స్థానికంగా సాగు లేక.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కూరగాయల ధరలు మండి పోతున్నాయి. వారం క్రితం ఉన్న వాటికి ప్రస్తుతానికి ధరల్లో చాలా తేడా ఉంటోంది. కొనుగోలు చేసేందుకు వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రైతులు ఎక్కువగా వరి సాగు వైపు మొగ్గు చూపడంతో కూరగాయలు అరకొర సాగవుతున్నాయి. దశాబ్దకాలం నుంచి వీటికి ప్రభుత్వం రాయితీ నిలిచిపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు.

News June 13, 2024

MBNR: ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుప్తా సుఖేందర్రెడ్డి నవీన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ ఆలీ తదితరులు ఉన్నారు.

News June 13, 2024

NGKL: బట్టల షాపులో యువకుడు సూసైడ్

image

నాగర్ కర్నూల్‌లోని ఓ బట్టల దుకాణంలో బుధవారం అర్ధరాత్రి ఓ యువకుడు ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల.. బొందలపల్లి గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి (25) 4 నెలల క్రితం జిల్లాకేంద్రంలోని నాగనూల్ చౌరస్తాలో బట్టల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాగా అదే దుకాణంలో ఉరి వేసుకుని మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

MBNR: 10.58 లక్షల మంది రైతులు.. 19.44 లక్షల ఎకరాల్లో సాగు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖరీఫ్‌లో దాదాపు 10,58,774 మంది రైతులు 19.44,642 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా. ఈ సీజన్లో ప్రతి ఏటా అంచనాకు మించి పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 2,12,644 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. అధిక మొత్తంలో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పంటల సాగు ఊపందుకోనుంది.

News June 13, 2024

MBNR: పెట్టు బడి సాయం కోసం రైతుల ఎదురు చూపులు

image

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇవ్వడంతో కౌలు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటా మహబూబ్ నగర్‌లో 2.10, నాగర్ కర్నూల్ – 3.01, నారాయణపేట- 1.71, వనపర్తి -1.68, జోగుళాంబ గద్వాల-1.63 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. కౌలు రైతులకు సాయం అందిస్తే ఈ సంఖ్య పెరగనుంది.

News June 13, 2024

NGKL: ఇంటికి రూ. 21 కోట్ల కరెంట్ బిల్లు

image

విద్యుత్ సిబ్బంది తప్పిదంతో ఓ ఇంటికి ఏకంగా రూ.21 కోట్ల బిల్లు వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కి చెందిన వేమారెడ్డి ఇంటికి ఈ నెల 5న విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీశారు. రూ.21.47 కోట్ల బిల్లు రాగా షాకవడం వేమారెడ్డి వంతైంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రీడింగ్ తీసే వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల తప్పిదం జరగిందని సరిచేస్తామని చెప్పారని వేమారెడ్డి తెలిపారు.