India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
మహబూబ్ నగర్ పట్టణంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో ఈనెల 19న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికల కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయ్ తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డు జీరాక్సులతో హాజరు కావాలని సూచించారు.
-SHARE IT..
❤MBNR:19న అండర్-14,17 కరాటే ఎంపికలు❤రేపు ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక❤కొత్త ఉపాధ్యాయులకు ఘన సన్మానం❤PUలో రేపు,ఎల్లుండి సౌత్ జోన్ ఎంపికలు❤దుద్యాల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి❤GDWL: రైలు కిందపడి ప్రభుత్వ టీచర్ మృతి❤రేపు అలంపూర్కు మంత్రుల రాక❤ఈనెల 31 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు❤జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్ల మూసివేత
రైలు కిందపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధికి చెందిన శేఖర్ ప్రభుత్వ టీచర్. కాగా15రోజులుగా మానసికంగా ఇబ్బందిపడున్నాడన్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం రైల్వే పట్టాలపైకి వెళ్లి రైలు కిందపడి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాష్ట్ర మంత్రులు రేపు అలంపూర్ జోగులాంబ దేవిని దర్శించుకోవడానికి వస్తున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. రేపు గద్వాలలో గ్రంధాలయం ఛైర్మెన్గా నీలి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణరావు హాజరవుతారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం వీరంతా ప్రమాణస్వీకారంలో పాల్గొనున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై బెదిరింపులు అధికమవుతున్నాయని, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదగిరి ఉన్నారు.
ఈనెల 31 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకితో కలిసి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.
వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వాల్మీకి సామాన్య వ్యక్తిగా జీవించి బోయవానిగా జీవితం గడిపి సప్తఋషులు బోధనల ద్వారా మహర్షిగా మారి అద్భుతమైన రామాయణాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.
ధన్వాడ మండల కేంద్రానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మాదారం రామ్మోహన్ గౌడ్ 13వ మహిళా ఆసియా నెట్ బాల్ పోటీలకు టెక్నికల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈరోజు నుంచి 21 వరకు బెంగళూరులోని కోరమండల్ ఇండోర్ స్టేడియంలో ఆసియా మహిళా నెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ఫిజికల్ డైరెక్టర్ గా ఎంపికైన రామ్మోహన్ గౌడ్ మండలంలోని కొండాపూర్ గురుకుల పాఠశాలలో పీడిగా పనిచేస్తూ నెట్ బాల్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.