Mahbubnagar

News November 4, 2024

ఉండవెల్లి: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

image

పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులందరు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిలో ఉండవెల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురవరం లోకేశ్వర రెడ్డి, మాజీ సర్పంచులు శేషన్ గౌడ్, శివరాముడు, పవిత్ర జనార్దన్ రెడ్డి, భాస్కర్, ఈదన్న, పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఉండవెల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News November 4, 2024

MBNR: సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.

News November 4, 2024

MBNR: నేటి నుంచి ప్రారంభం.. ఈ జిల్లాలో పత్తి అత్యధికం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. MBNR-2, NGKL-15, GDWL-1, WNPT-1, NRPT-5 జిల్లాలో పత్తి కేంద్రాలను అధికారులు అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే పత్తిని అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో పండిస్తారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తప్పవని ఆయా జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.

News November 4, 2024

MBNR: సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.

News November 4, 2024

MBNR: మూడేళ్ల బాలికపై హత్యాచారయత్నం

image

మూడేళ్ల బాలికపై ఓవ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో జరిగింది. రూరల్ CI గాంధీనాయక్ కథనం.. MBNRలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు(3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్‌లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. స్థానికులు, తల్లిదండ్రులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

News November 4, 2024

పాలమూరు జిల్లాలో మీ సేవలు బంద్..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.

News November 4, 2024

ఉమ్మడి జిల్లాకు నేడు వర్ష సూచన

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది.

News November 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✔Get Ready..75 ప్రశ్నలపై ఫోకస్✔NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి✔ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక✔NGKL:నీటి సంపులో పడి బాలుడి మృతి✔MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు✔నూతన ఉపాధ్యాయులకు సన్మానం✔Way2News క్లిక్.. పలుచోట్ల పొద్దున్నే కమ్ముకున్న పొగ మంచు✔కొత్తకోట:కారు,బైక్ ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు✔సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి:కాంగ్రెస్

News November 3, 2024

MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల తైక్వాండో జట్టు ఆల్ ఇండియా లెవెల్లో పాల్గొనడానికి ఆదివారం పంజాబ్‌కు బయలుదేరింది. ఈ పోటీలు పంజాబ్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన క్రీడాకారులు గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌లలో నిర్వహించే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని PU PD డా.శ్రీనివాసులు తెలిపారు. 

News November 3, 2024

దేవరకద్ర: ఎట్టకేలకు 27వ దొంగతనానికి దొరికిపోయారు

image

ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో 26 సార్లు పశువుల దొంగతనానికి పాల్పడిన దొంగలు 27వ సారి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు దొంగలు గత కొంతకాలంగా కల్వకుర్తి, దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.