India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా అలంపూర్ లో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 33.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 21.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 19.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
త్వరలోనే రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో తుది ఓటరు జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. ఎన్నికల సంఘం tsec.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేయగానే మరో పేజీ కనిపిస్తుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత పంచాయతీకి సంబంధించిన ఓటరు జాబితా కనిపిస్తుంది. వార్డుల వారీగా అందులో పేరు చూసుకోవచ్చు. #SHARE IT
ఉమ్మడి జిల్లాలోని బి.ఆర్ అంబేడ్కర్ కళాశాలలో డిగ్రీ, పీజీల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబరు 30 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ రుసుం చెల్లించాలని, అంతకుముందు చేరిన విద్యార్థులు సైతం అక్టోబరు 30 లోపు ఆన్లైన్లో చెల్లించాలని, మిగతా వివరాల కొరకు www.braou.ac.inలో పరిశీలించాలన్నారు.
అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఈనెల 18,19 తేదీల్లో పీయూలో నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 18న పురుషుల విభాగంలో బ్యాడ్మింటన్, 19న తైక్వాండో పురుషులకు, కబడ్డీలో స్త్రీ, పురుషులకు ఎంపికలు ఉంటాయని, 17-25 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు అర్హులని, ఎంపికైన క్రీడాకారులు తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాలలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. SSC మెమో, బోనఫైడ్తో హాజరు కావాలన్నారు.
గోవా టూర్ వెళ్లాలనుకుంటున్న వారికి దక్షిణ రైల్వే అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి జడ్చర్ల, MBNR,GDWL మీదుగా గోవాలోని వాస్కోడిగామా మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉ.10:05కు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 17039 ట్రైన్ అందుబాటులో ఉంది. ఇందులో 21 LHB కొచేస్, ఫస్ట్ ACక్లాస్-1, AC-2,టైర్-2, స్లీపర్ క్లాస్-7, జనరల్ క్లాస్- 4 అందుబాటులో ఉన్నాయి. SHARE IT
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలకు టీజీ. ఐ పాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి నిర్ణిత గడువులోగా జారీ చేయాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.
డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24 డిగ్రీలో చేరిన 2వ, 3వ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30లోపు చెల్లించాలని తెలిపారు. braouonline వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.
అడ్డాకుల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులపై మంచి పట్టు సాధించాలన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా వీపనగండ్ల 29.5 మి.మీ వర్షపాతం నమోదయింది. నాగర్కర్నూల్ జిల్లా ఎళ్లికల్లో 27.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 26.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కోదండపూర్లో 23.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్లో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Sorry, no posts matched your criteria.