India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ఏఎస్ఐ మాట్లాడుతున్నానని తనకు డబ్బు కావాలని ఈనెల 4న పెట్రోల్ బంకు యజమానికి ఫోన్ చేశాడు. తాను అందుబాటులో లేనని మేనేజర్ గోపి నెంబర్ ఇచ్చాడు. గోపి ఆ వ్యక్తికి రూ.80 వేలు బదిలీ చేశాడు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
✓ నేడు పాఠశాలల పునః ప్రారంభం, విద్యార్థులకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు.
✓ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు మొదటి ర్యాంకు.
✓ దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ కు నేడు తుది గడువు.
✓ జోరందుకున్న వర్షం.. పొలం పనుల్లో నిమగ్నమైన కర్షకులు.
✓ ప్లాస్టిక్ రహితంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు చర్యలు.
✓ అద్వానంగా చెరువుల తూములు, కాలువలు, మరమ్మతులు చేపట్టకపోతే ప్రమాదమే.
కృష్ణ, జూరాల, తుంగభద్ర నదులకు వరద వస్తోంది. కర్ణాటకలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 4. 94 టీఎంసీల నీళ్లున్నాయి. 7211 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తున్నది. వరద నీరు ఆర్డీఎస్ మీదుగా మండలంలోని పులికల్ సమీపంలో ఉన్న నాగల దిన్నె బ్రిడ్జి వద్దకు చేరుకుంది. 2 నెలలుగా ఎండిన తుంగభద్రకు వరద రావడంతో నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులు ఊరట చెందారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 992 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. అందులో 410 బస్సులే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. MBNR జిల్లాలో 280, వనపర్తిలో 61, నారాయణపేటలో 32, గద్వాలలో 37 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంకా 582 బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త మరీ.. మీ పిల్లల బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా..? బస్ డ్రైవర్ను అడగండి.!
వనపర్తి జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువులు, విత్తనాల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
✒గద్వాల్: విద్యుత్ షాక్తో బాలుడు మృతి
✒NGKL:వట్టెం వెంకటేశ్వర స్వామి సేవలో త్రిపుర గవర్నర్
✒బడి బాటపై ప్రత్యేక నిఘా.. నివేదిక పంపండి:DEOలు
✒NRPT:నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ధర్నా
✒వనపర్తి:విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి జూపల్లి వార్నింగ్
✒ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షం
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న భగీరథ నల్లల సర్వే
✒ఆయా మండలాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
బిజినెపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్సెట్లో సత్తా చాటాడు. ఈ ప్రవేశ పరీక్షలో 150 మార్కులకు గాను 118 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ గ్రూప్-1,2కు ప్రిపేర్ అవుతున్నారు. చదువుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన నవీన్ కుమార్ను గ్రామస్థులు, పలువురు అభినందించారు.
మానవపాడు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కళ్ళముందు ఆడుకుంటూ కనిపించిన ఓ బాలుడు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు, మద్దమ్మలకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు వీరేశ్ (7)ఉన్నారు. ఎద్దులు పోట్లాడుతూ స్తంభానికి తగలడంతో సర్వీస్ వైర్ కిందపడి ఆ బాలుడికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న కృష్ణానదికి వరద జలాలు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి నీరు చేరడంతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వరుసగా పడుతున్న వానలకు కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతోంది. దీనితో ఈ ఏడాది నదికి ఆశించిన మేర వరద జలాలు చేరుతాయని ఆశిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 32.5 మి.మీ, గద్వాల జిల్లా తోతినొనిద్దోడి 32.1 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట 32.1 మి.మీ, వనపర్తి జిల్లా మదనపూర్ 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Sorry, no posts matched your criteria.