Mahbubnagar

News June 11, 2024

బ్యాంక్ మేనేజర్‌కే స్కెచ్.. డీపీని న్యూడ్‌ ఫొటోగా చేసి బ్లాక్‌మెయిల్

image

ఓ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఘటన నాగర్‌కర్నూల్‌లో జరిగింది. సదరు మేనేజర్‌ ఫోన్‌కు వారం కింద ఓ లింక్ రాగా.. దానిపై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీని న్యూడ్ ఫొటోగా మార్చి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు. భయపడిన ఆయన ముందుగా రూ.1.56 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసేశాడు. అయినా వేధింపులు ఆగలేదు. దాదాపు 300 మందికి న్యూడ్ ఫొటో పంపినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.

News June 11, 2024

కొడంగల్: గుండెపోటుతో మాజీ జెడ్పీటీసీ మృతి

image

కొడంగల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి అరకు యాత్రకు వెళ్లిన ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు. మోహన్ రెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామం దౌల్తాబాద్‌కు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు. బుధవారం అంతక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 11, 2024

MBNR: ప్రారంభమైన మిషన్ భగీరథ ఇంటింటి సర్వే

image

జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే సోమవారం ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 661 ఆవాస గ్రామాలు ఉన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మిషన్ భగీరథపై దృష్టిసారించారు.

News June 11, 2024

బడిబాట నిర్వహణకు రూ.29.75 లక్షల నిధులు విడుదల

image

ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు బడి ఈడు పిల్లలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2,975 పాఠశాలలకు రూ.29.75 లక్షల నిధులు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బడి బాట ఈ నెల 19 వరకు కొనసాగనుంది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

News June 11, 2024

MBNR: బాలికపై లైంగిక దాడి

image

బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబీకుల ప్రకారం.. కేటీదొడ్డి మం.లోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన కొండన్న ప్రేమ పేరుతో వేధించంగా బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాకపోగా.. గత మే నెలలో బాలికపై సదరు వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బాలిక DSPకి ఫిర్యాదు చేసింది.

News June 11, 2024

బల్మూరు: RTC డ్రైవర్‌పై యువకుల దాడి

image

గుర్తు తెలియని వ్యక్తులు RTC తాత్కాలిక డ్రైవర్‌పై దాడి చేశారు. స్థానికుల ప్రకారం.. అమిస్తాపూర్‌కు చెందిన శ్రీనివాసులు నాగర్ కర్నూల్ RTC డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమిస్తాపూర్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద గుర్తు తెలియని నలుగురు యువకులు కారులో వచ్చి బస్సు కారుకు దారి ఇవ్వలేదంటూ డ్రైవర్‌పై దాడి చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు.

News June 11, 2024

NGKL: నామినేటెడ్ పోస్టులపై నేతల్లో ఆశలు !

image

ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టులపై జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టులు మొదలుకొని ఇక్కడి ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీలు ఎక్కడ అవకాశం ఉన్నా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇటీవల కొల్లాపూర్ జగదీశ్వర్ రావుకు మైనర్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, ZP వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్‌కు PCB మెంబర్‌గా అవకాశం వచ్చింది.

News June 11, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వారంలో ఫిర్యాదుదారునికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. MBNR కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయా MROలను ఆదేశించారు.

News June 10, 2024

పాలమూరు జిల్లా “TODAY TOP NEWS”

image

✓అలంపూర్: వైభవంగా బాల బ్రహ్మేశ్వర స్వామి రథోత్సవం.
✓ వికారాబాద్ -రాయచూర్ రైల్వే సర్వే పనులు ప్రారంభం.
✓ ఉమ్మడి పాలమూరు జిల్లా మూడు రోజుల వర్ష సూచన.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లో కొనసాగిన ప్రజావాణి.
✓ కేంద్ర మంత్రులను కలిసిన బిజెపి నేత పోతుగంటి భరత్.
✓బొంరాస్ పేట: మహిళా సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు.
✓ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బడిబాట.

News June 10, 2024

ప్రభుత్వ బడుల బలోపేతానికి సహకారం అందించండి.. NRIలకు వినతి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్నారైలు సహకారం అందించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహారెడ్డి కోరారు. అమెరికాలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆట మహాసభలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పాఠశాలలలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా పథకం ఫలితాలు ఇస్తుందని చెప్పారు.