Mahbubnagar

News June 9, 2024

MBNR: గొడుగు చేసిన ఘోరం.. పంచాయతీ సెక్రటరి మృతి

image

బొంరాస్‌పేట మండలానికి చెందిన <<13410192>>గ్రూపు-1 అభ్యర్థి<<>> సుమిత్రాబాయి(29) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వికారాబాద్‌లో పరీక్ష రాసి వస్తుండగా వర్షంతో పాటు గాలి వీసింది. దీంతో బైక్ పై వెనుక ఉన్న సుమిత్ర తన వద్ద ఉన్న గొడుగు తీసే ప్రయత్నంలో ధారూర్ మం. గట్టెపల్లి వద్ద కిందపడింది. దీంతో సుమిత్ర తలకు తీవ్ర గాయాలు కావడంతో తాండూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు తెలిపారు.

News June 9, 2024

బొంరాస్‌పేట: రోడ్డు ప్రమాదంలో గ్రూప్-1 అభ్యర్థి మృతి

image

గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి వెళ్తున్న అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన ధరూర్ మండలం దోర్నాల దగ్గర జరిగింది. స్థానికుల సమాచారం.. బొంరాస్‌పేట మండల BRS సోషల్ మీడియా అధ్యక్షుడు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర యాలాల మండలం అచ్యుతాపూర్ కార్యదర్శి. వికారాబాద్‌లో గ్రూప్-1 పరీక్ష రాసి వస్తుండగా దోర్నాల వద్ద ప్రమాదం జరిగింది. సుమిత్ర స్వగ్రామం దేవుల నాయక్ తండాలో విషాదం నెలకొంది.

News June 9, 2024

MBNR: నైరాశ్యంలో డీకే అరుణ అనుచరులు

image

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి విజయం సాధించిన డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆమె అనుచరులు ఎంతగానో ఆశించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుచరులు నైరాశ్యంలో పడ్డారు. మహిళా కోటలో తప్పనిసరి మంత్రి పదవి వస్తుందని ఊహించారు. తెలంగాణ నుంచి ఇద్దరికీ మాత్రమే మంత్రి పదవి లభించింది.

News June 9, 2024

డీకే అరుణకు మంత్రి పదవి లేనట్టే..?

image

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీగా విజయం సాధించిన డీకే అరుణకు మోదీ కేబినెట్‌లో మెుదట బెర్త్ ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా కేంద్రం మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి బీజేపీ తరఫున కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లసంజయ్‌లకే చోటు దక్కింది. ఈ మేరకు వీరిద్దరికి PMO నుంచి ఫోన్ కాల్స్ కాల్స్ వచ్చాయి.

News June 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 36.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 36.1 మి.మీ, గద్వాల జిల్లా కల్లూరు తిమోన్ దొడ్డి 36.0 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 35.5 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింతలో 34.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 9, 2024

NGRL: యువజంట సూసైడ్

image

నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్మూర్ మండలంలోని జినుకుంట శివారులో ఈ తెల్లవారుజామున యువజంట బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేష్ ఇటీవల అదే గ్రామానికి చెందిన భానుమతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తిరగక ముందే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కాని శనివారం రాత్రి వారి వ్యవసాయ పొలంలో ఉన్న చెట్టుకు ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

News June 9, 2024

MBNR: పరీక్ష రాయనున్న 25,263 మంది అభ్యర్థులు

image

ఉమ్మడి MBNR జిల్లాలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 25,263 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 71 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.

News June 9, 2024

DK అరుణకు మంత్రి పదవి దక్కుతుందా..?

image

కేంద్ర మంత్రివర్గంలో DK అరుణకు చోటు దక్కుతుందని పాలమూరు జిల్లా వాసుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రానికి మూడు మంత్రి పదవులు దక్కవచ్చని, మహిళా కోటలో డీకే అరుణకు మోదీ కేబినెట్‌లో మంత్రిగా బెర్త్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే నాయకురాలిగా గుర్తింపు వంటి అంశాలు ఆమెకు కలిసొస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

News June 9, 2024

జూరాలకు పెరిగిన ప్రవాహం

image

మూడురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జూరాల జలాశయంలోకి ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3,300 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. జలాశయంలో నీటినిల్వ 1.637 టీఎంసీలకు పెరిగింది. వరద మరో రెండురోజుల పాటు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు కర్ణాటకలోని నారాయణ్‌పూర్ ప్రాజెక్టులోకి 12,500 క్యూసెక్కులు, ఆల్లమట్టిలకి 2,500 క్కూసెక్కుల ప్రవాహం చేరుతున్నట్లు అధికారులు వివరించారు.

News June 9, 2024

MBNR: 36 కేంద్రాలు.. 15,199 మంది అభ్యర్థులు

image

నేడు జరగనున్న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 15,199 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులను 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 10 గంటలకే గేట్లు మూసి వేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.