India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా వేళ మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు కాలినడకగా వెళ్లారు. ఎంపీ మల్లు రవి, MLAలు, తన మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విజయదశమిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. జోగులాంబదేవి కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. గ్రామస్థులు బోనాలు, బతుమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. సీఎం రాకతో కొండారెడ్డిపల్లికో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
దసరా పండుగ సందర్భంగా జమ్మి పత్రాలకు, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. జమ్మి పత్రాలకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు పుచ్చుకొని అలైబలై చేసుకోవడం ద్వారా శత్రుత్వం కోల్పోతుందన్నారు. పాలపిట్టను చూడడం ద్వారా అపజయాలు కోల్పోయి విజయాలు దరిచేరుతాయని, పల్లెల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పొలాల వెంబడి వెళ్లి పాలపిట్టను చూస్తారని పండితులు తెలిపారు.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వస్తుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం సొంత ఇంటి దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిపూజలో పాల్గొంటారు. రాత్రి వరకు సీఎం ఊరిలోనే గడపనున్నట్లు సమాచారం.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 18.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 17.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 17.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 15.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాలపాడులో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు మహబూబ్ నగర్ క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా Way2Newsతో మాట్లాడుతూ.. ఈనెల 14న ఎండీసీఏ మైదానంలో ఎంపికలు నిర్వహిస్తామని,ఆసక్తిగల క్రీడాకారులు జనన ధ్రువీకరణ,ఆధార్ కార్డు,తెల్లటి క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి నేడు వస్తున్నారు. దసరా పండగకు కుటుంబంతో స్వగ్రామానికి వచ్చే ఆనవాయితీ పాటించే రేవంత్రెడ్డి ఈ సారి సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. CM రాక సందర్భంగా MLA వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, కొండారెడ్డిపల్లి నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Sorry, no posts matched your criteria.