Mahbubnagar

News October 11, 2024

వనపర్తి: అత్యాచారం.. ఆపై హత్య

image

గోపాల్‌పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్‌లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

News October 11, 2024

MBNR : ప్రారంభంలో పత్తి ధర అదుర్స్.. తర్వాత డమాల్ !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.

News October 11, 2024

ఈనెల 13న కొడంగల్ రానున్న CM రేవంత్ రెడ్డి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13న కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే దసరా తర్వాత కార్యకర్తలను కలవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 12న వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మరుసటి రోజు కొడంగల్ రానున్నారు.

News October 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు!!

image

✔DSC-2024 ఉద్యోగాలు సాధించిన పలువురికి ఘన సన్మానం
✔IMEX అమెరికా 2024 ట్రేడ్ షోలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి
✔GDWL:పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
✔NRPT: చెట్టుకు ఢీకొని కారు దగ్ధం
✔MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
✔సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కలెక్టర్లు
✔ఘనంగా బతుకమ్మ సంబరాలు
✔మక్తల్:రోడ్డు ప్రమాదం..మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీహరి

News October 10, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

News October 10, 2024

కొడంగల్: నాన్నకు ప్రేమతో..!

image

కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.

News October 10, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 10, 2024

గద్వాల: పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి

image

గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం నెలకొంది. మేడికొండకు చెందిన బోయ లక్ష్మన్న(24) పాముకాటుతో మృతి చెందాడు. లక్ష్మన్న నిన్న పొలంలో పని చేస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన గద్వాల వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

News October 10, 2024

MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక

image

ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలమైన హాజ్‌కు జిల్లా నుంచి 170 మంది యాత్రికులు ఎంపికయ్యారు. యాత్రకు సంబంధించి బుధవారం బాక్స్ కాంప్లెక్స్‌లోని హాజ్ సొసైటీ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో దరఖాస్తులను ఎంపిక చేశారు. ఎంపికైన వారికి హాజ్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి మొరాజుద్దీన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 9, 2024

MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.