India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఫలితాలు రెఫరెండమని, తమకు 14 ఎంపీ సీట్లు వస్తాయని రేవంత్ అన్నారని గుర్తుచేశారు. మహబూబ్నగర్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఫైజాబాద్లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు ఉండొచ్చన్న ఆమె.. అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో బీజేపీ అమాంతం తమ ఓటు బ్యాంకును పెంచుకుంది. MBNR లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఒక్కటే ఎక్కువ ఓట్లు సాధించండి. BRS, కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి.NGKL లోక్ సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపి ఓటు బ్యాంకును పెంచుకోగా.. BRS తన ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఓ మోస్తరుగా తగ్గింది.
సీసీకుంట మండలంలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల కురుమన్న కూతురు అనుషిత(11) ఇంటి బయట బాల్ కానీకి చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటుంది. ప్రమాదవశాత్తు ఊయలకు కట్టిన పాప గొంతుకు బిగుసుకుంది. కొంతసేపటి తర్వాత గుర్తించిన తల్లి శైలజ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నోటాకు ఆదరణ తగ్గింది. మహబూబ్నగర్లో4330, నాగర్కర్నూల్లో4969 ఓట్లు మాత్రమే నోటాకు పడ్డాయి. ఈ 2 లోక్ సభ స్థానాల్లో కలిపి 2014లో 21,425 ఓట్లు, 2019లో 24,125 ఓట్లు, 2024లో 9,299 నోటాకు పోలయ్యాయి. 2019తో పోల్చితే ఈ సారి నోటాకు 14,826 ఓట్లు తక్కువగా వచ్చాయి. నోటాకు ఆదరణ తగ్గిందనడానికి తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా సెరివెంకటాపూర్లో 12.0 మి మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 16.0 మి.మీ, గద్వాల జిల్లా ధరూరులో 8.8 మి.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
డీకే అరుణ తమ కుటుంబం నుంచి ఆరో ప్రయత్నంలో ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. MBNR నుంచి ఆమె 1996లో TDP తరపున పోటీచేసి మాజీ మంత్రి మల్లికార్జున్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అరుణ.. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకు ముందు ఆమె మామ డీకే సత్యారెడ్డి 1962, 71, 77లో మహబూబ్నగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆ కల నెరవేరింది.
నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన శిరీష(బర్రెలక్క) పోటీ ఇవ్వకుండానే ఓడిపోయారు. మొత్తానికి నోటాకు 4,580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆమెకు అప్పట్లో 5,754 ఓట్లు పోల్ కాగా ఎంపీ ఎన్నికల్లో 3,087 ఓట్లే వచ్చాయి.
బాలకేంద్రం వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపులో భాగంగా పాలమూరు బాలోత్సవ్ పేరిట బుధవారం సాంస్కృతిక సంబరం చేపట్టనున్నట్లు బాలకేంద్రం శిక్షకులు తెల్కపల్లి గజేంద్ర, రాజేశ్ కన్న వెల్లడించారు. మహబూబ్ నగర్ కొత్త బస్టాండ్ సమీపంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక మహోత్సవంప్రారంభమవుతుందన్నారు. చిన్నారులతో సంప్రదాయ, జానపద నృత్యాలు, చిత్రకళ ప్రదర్శన ఉంటుందని అన్నారు.
నాగర్ కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క) పోటీలో లేకుండానే ఓడిపోయారు. అసలు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కంటే నోటాకే వచ్చిన ఓట్లే ఎక్కువ. మొత్తానికి నోటాకు 4580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
సొంత జిల్లాలో ఎన్నికలను పతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 10సార్లు పర్యటించినా ఫలితం దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతోపాటు MBNR ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి సైతం ఓటమి చెందడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ అలుముకుంది. ఇది రేవంత్కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.