India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో నోటాకు ఆదరణ తగ్గింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఇష్టం లేనప్పుడు ఓటర్లు నోటాకు ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో నోటాకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు ఓట్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న అభిప్రాయానికి ఓటర్లు వచ్చినట్లు స్పష్టత వస్తోంది.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ను బీజేపీ, నాగర్కర్నూల్ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. కాగా MBNR కౌంటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ తీవ్ర ఉత్కంఠ రేపింది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయింది. చివరకు 7,601 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. అటు NGKLలో మల్లు రవి 94,414 ఓట్లతో ఘనవిజయం సాధించారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన డీకే అరుణకు జిల్లా ఎన్నికల అధికారులు మంగళవారం సాయంత్రం గెలుపొందిన పత్రాన్ని అందజేశారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ కౌంటింగ్ మొదట నుండి ఉత్కంఠ మధ్య జరిగింది. ఎట్టకేలకు డీకే అరుణ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించారు. గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
✒మహబూబ్ నగర్ లో డీకే అరుణ(BJP) విజయం
✒నాగర్ కర్నూల్ లో మల్లురవి(INC) ఘన విజయం
✒భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు
✒ఉమ్మడి జిల్లాలో CONGRESS,BJP నాయకుల సంబరాలు
✒APలో చంద్రబాబు గెలుపు.. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల టిడిపి కార్యకర్తల సంబరాలు
✒GDWL:ఈదురు గాలులు.. రాకపోకలు బంద్
✒NRPT: ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి
✒ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై అధికారుల పై అధికారుల ఫోకస్
మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి స్వల్ప తేడాతో డీకే అరుణపై ఓడిపోయారు. దీంతో వంశీ ఇప్పటి వరకు వరుసగా 3సార్లు ఓటమి చవిచూశారు. 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి 78 ఓట్లతో MLAగా గెలుపొందిన చల్లా 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మహబూబ్నగర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోగా తాజాగా మరోసారి ఓటమి పాలయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ ఆయనను ప్రజలు ఆదరించలేదు.
పాలమూరు పార్లమెంట్ సీటు హాట్ సీటుగా మారింది. మహబూబ్ నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. NGKLలో మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు.
మహబూబ్నగర్ లోక్సభ ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. 17వ రౌండ్ ముగిసేవరకూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కేవం 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్కు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కౌంటింగ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మొదటి నుంచి లీడ్లో కొనసాగిన డీకే అరుణ ఆధిక్యం తాజాగా తగ్గడంతో కమలం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. MBNRలో 11వ రౌండ్ వరకు డీకే అరుణ 15,067 ఓట్లు, 12వ రౌండ్ వరకు మల్లు రవి 42,825 ఓట్లతో లీడ్లో కొనసాగుతున్నారు. DK అరుణకు మొత్తం 2,85,843, మల్లుకు 2,80,145 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా… అత్యధికంగా గద్వాల జిల్లా బూడిదిపాడు లో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 6.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 3.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 2.8 మి.మీ, వనపర్తి జిల్లా అమరచింతలో 2.5మిలి మీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 34.3, వనపర్తి జిల్లా దగడలో 33.1, గద్వాల జిల్లా అలంపూర్లో 32.4, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 31.7 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.