India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాగనూరు మండల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమైంది. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన పునరావృతం అవ్వడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. భూత్పూర్ మం. ఎల్కిచెర్లలో నారమ్మను భర్త వెంకటయ్య హతమార్చాడు. అనంతరం సెప్టిక్ ట్యాంక్లో పడేసి ఏమీ తెలియనట్లే ఉన్నాడు. ఈ నెల 17న నారమ్మ కనిపించడం లేదంటూ కుమారుడు భరత్తో నాటకమాడారు. దీంతో 21న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

మల్లెబోయనపల్లిలోని నీటిశుద్ధి కేంద్రాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ EE వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిలతో ఆమె చర్చించారు. రాబోవు రోజులలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిపేరులో ఉన్న బోరు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని ఆమె ఆదేశించారు.

✔ప్రజావాణి.. సమస్యలపై అధికారుల నిఘా
✔GDWL:గోల్డ్ షాప్ వద్ద మంటలు
✔పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
✔రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలి:ANMలు
✔బిజినపల్లి:చెరువులో వృద్ధుడు మృతి
✔ఆత్మకూరులో గృహిణి ఆత్మహత్య
✔కార్తీక మాసం.. దేవాలయాల్లో భక్తుల సందడి
✔పలుచోట్ల ఘనంగా సదర్ ఉత్సవాలు
✔PUలో హ్యాండ్ బాల్,అథ్లెటిక్స్ ఎంపికలు వాయిదా
✔చివరి దశకు చేరిన కుల గణన సర్వే
✔30న సీఎం రాక.. సభ ఏర్పాట్లపై ఫోకస్

కుల గణన కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఇలాంటి తప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ నుంచి వీసీ నిర్వహించి ఆయన ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. అందుబాటులో లేని వాళ్లకు ఫోన్ చేసి సర్వే గురించి వివరించి సమాచారం తెలుసుకోవాలని, ఫుడ్ పాయిజన్ విషయంలో ఆరా తీశారు. ఆహారం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, డాటా ఎంట్రీలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుల గణన సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఆదివారం నాటికి మహబూబ్ నగర్-99.8%, నాగర్ కర్నూల్-96%, నారాయణపేట-99.5%, గద్వాల్, వనపర్తి జిల్లాలో దాదాపు పూర్తయినట్లే. ఇంటిదగ్గర అందుబాటులో లేని వాళ్లకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేని వాళ్లు ఆయా మండలాల ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలన్నారు.

BRS ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం MBNR కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

✔30న పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✔TCC కోర్సు.. ఫీజు చెల్లించండి:DEOలు
✔రేపు PUలో హ్యాండ్ బాల్ ఎంపికలు
✔29న దీక్షా దివస్..వైస్ ఇన్ఛార్జిల నియామకం
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔కొనసాగుతున్న కుల గణన సర్వే
✔సామాజిక సేవలో రెడ్డిల పాత్ర మరువలేనిది: డీకే అరుణ
✔రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవ సభలు:మంత్రి జూపల్లి
✔MBNR:’ప్రజాపాలన విజయోత్సవ’ సభ..ఏర్పాట్లపై ఫోకస్
✔26న సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు

ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జీలుగా మహబూబ్ నగర్ నేతలను నియమించారు. వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ జిల్లాకు MBNR మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ బండ ప్రకాష్ లను నియమించింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 29న దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఆయా జిల్లాలకు వైస్ ఇన్ఛార్జి లాను బీఆర్ఎస్ నియమించింది. MBNR జిల్లాకు కేమ మల్లేష్, NRPT ఎమ్మెల్సీ కోటి రెడ్డి, GDWL మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రెడ్డి, WNP మాజీ జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, NGKLకు మాజీ ఎమ్మెల్సీ విజయ సింహ రెడ్డిలను నియమించారు.
Sorry, no posts matched your criteria.