India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందు కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144సెక్షన్ విధించారు.
✔ఏర్పాట్లు పూర్తి.. నేడు లోక్ సభ ఎన్నికల కౌంటింగ్
✔MBNR,NGKL అభ్యర్థుల్లో టెన్షన్.. గెలుపు పై ఎవరి ధీమా వారిదే
✔ప్రత్యేక నిఘా.. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
✔నేడు మద్యం దుకాణాలు బంద్
✔ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✔MBNR:పాలీసెట్ ఫలితాల్లో.. ప్రతిభ చాటిన విద్యార్థులు
✔ఉమ్మడి జిల్లాలో నేడు పలుచోట్ల వర్షాలు
ఉమ్మడి జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో విజేతలు ఎవరో నేడు తేలనుంది. రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రధాన పోటీ నెలకొంది. మొత్తంగా మహబూబ్నగర్లో 31 మంది, నాగర్ కర్నూల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సీఎం సొంత జిల్లా కావడంతో పోటీలో ఉత్కంఠ నెలకొంది.
మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఎన్నికల్లో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో 16, 82, 470 మందికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించగా.. 12, 18, 587 మంది ఓటు వేశారు. మొత్తం 72.43 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఓటరు నాడి పట్టుకో వడం అసాధ్యమైన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు ఎక్కువ కావడంతో పోలింగ్లో డబుల్ బ్యాలెట్ ఈవీఎంలను వినియోగించారు.
✓ ఎంపీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలకరించిన తొలకరి వర్షాలు, చల్లబడిన వాతావరణం, వ్యవసాయ సాగులో రైతన్నలు
✓ పాలిసెట్ ఫలితాల్లో మెరిసిన పాలమూరు విద్యార్థులు.
✓ ఈనెల 6వ తేదీ నుంచి గృహ జ్యోతి అమలు.. అధికారుల వెల్లడి.
✓ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి అధికారుల సిద్ధం.
మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. అధికారులు మొత్తం 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 390 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 325 మంది హాజరవగా.. మరో 65 మంది గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ రవీందర్ జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
MBNR పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్శాఖ భారీ బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేందుకు మొత్తం485 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుందని తెలిపారు.
MBNR, NGKL పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుండటంతో అన్ని రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. రెండు.. పార్లమెంటు నియోజకవర్గాలలో విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరు ఓటమిపాలు కాబోతున్నారనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గెలుపు మీదా.. మాదా అన్నట్లుగా ప్రచారాలు నిర్వహించారు. పోలింగ్ జరిగిన 20రోజులపాటు రాజకీయం చర్చలు జరిగాయి. నేడు కౌంటింగ్ అనంతరం మన కొత్త ఎంపీలు ఎవరో తేలనుంది.
MBNR, NGKLలోక్సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MBNR బరిలో ఉన్న 31 మంది, NGKL బరిలో నిలిచిన 19 మంది భవితయ్వం నేడు తేలనుంది. మహబూబ్నగర్లో మొత్తం 12,18,597 మంది ఓటు వేయగా, నాగర్కర్నూల్లో మొత్తం 12,07,471 మంది ఓటేశారు. నాగర్కర్నూల్లో అచ్చంపేటలో అత్యధికంగా 22 రౌండ్లు, తక్కువగా నాగర్కర్నూల్లో 17 రౌండ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్లో షాద్నగర్లో తక్కువగా 19 రౌండ్లు ఉన్నాయి.
6 గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5న కోడ్ ముగిసిన వెంటనే 6వ తేదీ నుంచి గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు జారీ చేసేందుకు అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారి చేశారు. గృహలక్ష్మి పథకం అమలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంస్థపై రూ.10 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.
Sorry, no posts matched your criteria.