Mahbubnagar

News October 24, 2024

శ్రీశైలం జలాశయం తాజా సమాచారం

image

ఎగువ నుంచి వచ్చే వరద తగ్గడంతో శ్రీశైలం జలాశయం రెండు గేట్లను బుధవారం మూసివేశారు. శ్రీశైలానికి మొత్తం 142518 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 65,568 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయంలో ప్రస్తుతం 884.5 అడుగుల వద్ద 212.91 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉడగా.. ప్రస్తుతం 8.73 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

News October 24, 2024

PUకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తా: VC

image

పాలమూరు యూనివర్సిటీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తానని నూతన VC ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఉపాధి అందించే కోర్సులను పెంచి, విద్యార్థులకు సంస్కారం నేర్పి సమాజానికి అందిస్తామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తామన్నారు. వర్సిటీ అనుబంధంగా ఉన్న వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్లలో విద్యా ప్రమాణాలను పెంచి.. మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

News October 24, 2024

జడ్చర్ల: మద్యం లోడ్ కంటైనర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

మద్యం లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడటంతో జనం ఎగబడ్డారు. పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు మద్యం లోడుతో వెళ్తున్న కంటైనర్ జడ్చర్లలో హైవే- 44పై జంజం హోటల్ వద్ద ఆగి ఉండగా మరో లారీ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ బోల్తా పడటంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులను చెదరగొట్టారు.

News October 24, 2024

MBNR: ‘సమగ్ర కులాల ప్రజాభిప్రాయ సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి’

image

సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుతో మాట్లాడారు.

News October 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం ✔ఈనెల 26న మద్దూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ✔శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ✔భారీగా పెరిగిన చికెన్ ధరలు ✔NGKL:30న జాతీయ స్థాయి బండలాగుడు పోటీల ప్రదర్శన ✔NGKL: గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు ✔ప్రగతిపథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి ✔10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం:BRSV

News October 23, 2024

‘స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి’

image

స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని జోగులాంబ జోన్ 7 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ పిలుపునిచ్చారు. పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఐజి మాట్లాడుతూ.. ప్రాణపాయస్థితిలో రక్తదానం చేసినట్లయితే బాధితులను ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు.

News October 23, 2024

MBNR: గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు..!

image

గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి చనిపోయిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సుభాష్ నగర్ వాసి ఉప్పరి వెంకటయ్య (43) ఉ.11 గంటలకు టిఫిన్ సెంటర్ నుంచి దోశ తెచ్చుకొని ఇంట్లో తింటుండగా ఒక్కసారిగా మింగడంతో గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక కింద పడి చనిపోయాడు. ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.   

News October 23, 2024

ప్రగతిపథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

image

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన 80 పాటల సంకలనం ‘ప్రగతిపథంలో ప్రజా పాలన’ పుస్తకాన్ని ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలన్నీ ప్రజలకి చేరవేయడంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు రూపొందించిన పాటలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

News October 23, 2024

MBNR: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

PU డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కావున ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 28 వరకు ఆయా సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 ఫైన్‌తో నవంబర్ 3వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.