India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒సర్వం సిద్ధం.. రేపు ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు పూర్తి
✒కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత:SPలు
✒నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి
✒కౌంటింగ్ కేంద్రాలను సందర్శించడం అధికారులు, ఆయా పార్టీల అభ్యర్థులు
✒MBNR: ఆటో నుంచి పడి చిన్నారి మృతి
✒పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర, కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు
✒గృహ లక్ష్మీ పథకం.. ఎలక్షన్ కోడ్ ముగియగానే జీరో బిల్లుల జారీ
పాలమూరు యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్
➥72 కొడంగల్ -(PU)లైబ్రరీ బ్లాక్
➥73 నారాయణపేట-(PU)ఇండోర్ గేమ్స్ కాంపెక్స్
➥74 మహబూబ్నగర్- (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ G-ఫ్లోర్
➥75 జడ్చర్ల – (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తు (కుడి వైపు)
➥ 76 దేవరకద్ర- (PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్ 1వ అంతస్తు (ఎడమవైపు)
➥77 మక్తల్-(PU)ఎగ్జామినేషన్ బ్రాంచ్- ఇండోర్ స్టేడియం
➥84 షాద్నగర్-(PU)ఫార్మాస్యూటికల్ బ్లాక్ 1వ అంతస్తు
మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా.? కామెంట్ చేయండి.
SHARE IT..
ఆటోలో నుండి ఎగిరిపడి 4 సంవత్సరాల చిన్నారి శాన్విక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం జడ్చర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి తన తల్లి గారి ఊరైన తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి కొద్ది రోజుల క్రితం తన కూతురు కుమారుడితో కలిసి వెళ్లింది. నేడు ఆటోలో తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తల్లి తెలిపింది.
గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావటం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంలో ACB అధికారులు CEO రాంచందర్ నాయక్ను అరెస్ట్ చేయడంతో ఇక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. పాలమూరులోని NGKL జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిగా పనిచేసిన అంజిలప్ప, పశుగణాభివృద్ధి సంస్థ MBNR, GDWL జిల్లా ADగా పనిచేసిన ఆదిత్య కేశవసాయి బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లారు. వీరిద్దరిని ACB అరెస్ట్ చేసింది.
ఉమ్మడి పాలమూరులో ఎంపీ ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ అంచనాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న జరిగే కౌంటింగ్తో ఈ టెన్షన్కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. MBNRలో, NGKLలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహబూబ్ నగర్- BJP, నాగర్ కర్నూల్లో INC గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని MBNR, NGKL నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికలసంఘం అధికారిక వెబ్ సైట్ results.eci.gov.inను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా వెబ్సైట్ను సంప్రదించి ఫలితాలను తెలుసుకోండి
సోమవారం నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్తోపాటు నల్గొండ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో నాగర్కర్నూల్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచి భరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని బీఆర్ఎస్, బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు.
Sorry, no posts matched your criteria.