Mahbubnagar

News November 21, 2024

కృష్ణ: తంగడి కుంటలో మొసలి కలకలం

image

కృష్ణ మండలం పరిధిలోని తంగిడి కుంటలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి వీరేష్ వెళ్తుండగా మొసలి కనిపించిందని తెలిపారు. మొసలి ఉన్నట్లు గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అటువైపు వెళ్ళవద్దని మత్స్యకారులు, పశువుల కాపరులు కుంటలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News November 20, 2024

BREAKING: మాగనూరు: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

image

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 20, 2024

మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ రైతుల మీద లేదు: హరీశ్ రావు

image

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ ప్రభుత్వానికి రైతుల పైన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బుధవారం మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డితో కలిసి కురుమూర్తి జాతరకు వెళుతున్నా ఆయన మార్గమధ్యలో రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇస్తామన్న 500 బోనస్ బోగస్ పథకంగా మారిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని మండిపడ్డారు.

News November 20, 2024

పీయూ పరిధిలో మొదటి రోజు పరీక్ష వాయిదా

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 25 తేదీన జరగాల్సిన డిగ్రీ మొదటి, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.వాయిదా పడ్డ పరీక్ష టైం టేబుల్ త్వరలో తెలియజేస్తామని తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

News November 20, 2024

MBNR: బయోమెట్రిక్ హాజరు నమోదులో ఇబ్బందులు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత రెండు సంవత్సరాల నుంచి సిబ్బందికి బయోమెట్రిక్ విధానంలో హాజరు అమలు చేస్తున్నారు. కానీ కొన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో హాజరు నమోదు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు ఏర్పడుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని సిబ్బంది కోరుతున్నారు.

News November 20, 2024

జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న ఇన్ ఫ్లో

image

జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు ఇన్ఫ్లో తగ్గుతుంది. మంగళవారం 4,880 క్యూసెక్కులు ఉండగా నేడు 3,523గా ఉంది. బుధవారం 5,691 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పవర్ హౌస్‌కు 317 నెట్టెంపాడు 750 ,బీమా 650 ఎడమ 730, కుడి 530, ప్యారేలాల్ కెనాల్ 950, మొత్తం అవుట్ ఫ్లో 3,998 క్యూసెక్కులు బయటకు నీరు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

News November 20, 2024

సరిత తిరుపతయ్యకు కీలక పదవి?

image

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షరాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా గద్వాల మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితను రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది.

News November 20, 2024

కురుమయ్య.. చల్లంగా చూడయ్యా

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ దిగువ నుంచి స్వామి వారి సన్నిధి వరకు ప్రధాన మెట్లపై క్యూలైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకున్నారు. కొండ దిగువన ముఖద్వారం వద్ద భక్తులు కార్తీకదీపం వెలిగించి కురుమయ్యను సల్లగా చూడవయ్యా అంటూ వేడుకున్నారు.

News November 20, 2024

పీయూ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా కిషోర్

image

పాలమూరు యూనివర్సిటీ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా సూక్ష్మ జీవ శాస్త్రం విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్‌ను నియమిస్తూ వీసీ ప్రొ. శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ కిషోర్ గతంలో చీఫ్ వార్డెన్‌గా, సంయుక్త సంచాలకులుగా, పాలకమండలి సభ్యులుగా, ప్రిన్సిపాల్‌గా, విభాగాధిపతిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

News November 19, 2024

22న మహబూబ్‌నగర్‌కు బీసీ కమిషన్ సభ్యులు రాక

image

తెలంగాణలో స్థానిక సంస్థలలో కల్పించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనను స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఈనెల 22న మహబూబ్‌నగర్ ఐడీఓసీ కార్యాలయానికి రానున్నారని వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ సంఘాల సభ్యులు అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.