Mahbubnagar

News November 19, 2024

NRPT: విజయోత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం

image

నారాయణపేటలో ఈనెల 20న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సంగీత నాటక అకాడమి ఛైర్మెన్ సంగీత పుంజాల ఆధ్వర్యంలో అంజనా ఫంక్షన్ హాలులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సౌండ్, లైటింగ్, కళాకారులు బస చేసేందుకు వసతులు, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 19, 2024

NRPT: గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

image

నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం MPW వర్కర్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే మల్టీపర్పస్ వర్కర్స్ ప్రతి ఒక్కరు గ్రామ కృషి చేయాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేటట్టు కృషి చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News November 19, 2024

సీఎం రేవంత్ రెడ్డి అల్లుడుపై ఈడికి ఫిర్యాదు

image

సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కొలుగూరి సత్యనారాయణపై బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ఈడికి ఫిర్యాదు చేశారు. కొడంగల్ ఫార్మా కంపెనీలో రేవంత్ రెడ్డి అల్లుడికి భాగస్వామ్యం ఉందని ఆధారాలతో సహా బీఆర్‌ఎస్‌నేత క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. MAXBIEN కంపెనీలో సీఎం అల్లుడు డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 19, 2024

కల్వకుర్తి: ఒకేరోజు ఏడుగురు మృతి

image

కల్వకుర్తి నియోజకవర్గంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. మాడుగుల మండలం నాగిళ్లలో బావ, బావమరిది హత్యకు గురికాగా.. కడ్తాల్ మండలానికి చెందిన మహేశ్, రాజు ఆగి ఉన్న లారీని ఢీకొని చనిపోయారు. చింతలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్య, మర్ల యాదయ్య గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయారు. వెల్జాల్ చెరువులో పడి మరో వ్యక్తి మరణించాడు.

News November 19, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. నవాబుపేటలో 13.5 డిగ్రీలు, దామరగిద్ద 13.7, బాలానగర్ మండలం ఉడిత్యాల 13.9, మిడ్జిల్ మండలం దోనూరు 14,9, కోస్గి 14.4, తలకొండపల్లి 14.9, తెలకపల్లి 15.8, తాడూరు 15.9, తిమ్మాజిపేట 16.1° వెల్దండ 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 19, 2024

నాగర్‌కర్నూల్: మరణంలోనూ వీడని స్నేహం

image

మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన శివ(19), విజయ్(20) లు ఇద్దరు స్నేహితులు. శనివారం శివ కొత్త బైక్ కొనడంతో ఆదివారం వీరు కలిసి నాగర్‌కర్నూల్ మైసమ్మ వద్ద పూజ చేయించి తిరిగి తమ గ్రామానికి వస్తున్నారు. ఈక్రమంలో లారీ ఢీకొనడంతో వారిద్దరూ స్పాట్‌లోనే మరణించారు.

News November 19, 2024

బాలానగర్: శివలింగం ధ్వంసం.. ఇద్దరికీ రిమాండ్

image

బాలానగర్ మండలం మోదంపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన సయ్యద్ ఖలీమ్, లింగం అనే వ్యక్తులు తాగిన మైకంలో స్థానిక శివాంజనేయ దేవాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. దీంతో దేవాలయ పవిత్రతను అపవిత్రం చేశారని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్‌ తరలించామని ఎస్సై రవి తెలిపారు. 

News November 18, 2024

BREAKING: ఆమనగల్లులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మండలంలోని మంగళ్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నకేశవ కాలానికి చెందిన వరికుప్పల యాదయ్యతో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

News November 18, 2024

MBNR: “పాలమూరు యూనివర్సిటీలో SPORTS’

image

పాలమూరు యూనివర్సిటీలో ‘నేషనల్ ఫార్మసీ వీక్’ సందర్భంగా సోమవారం కాలేజ్ ఆఫ్ పారమెడికల్ సైన్స్ విద్యార్థులకు ప్రిన్సిపల్ నూర్జహాన్, ప్రభాకర్ రెడ్డి, యూనివర్సిటీ పీడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆట పోటీలు నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఆట పోటీలు నిర్వహించనున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నరేశ్, శారదా, మన్యంలు పాల్గొన్నారు.

News November 18, 2024

గద్వాల: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

గద్వాల జిల్లాలో పంచాయితీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఇటిక్యాల మండల పంచాయితీరాజ్ ఏఈ పాండురంగారావు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈక్రమంలో నేడు ఏఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.