Mahbubnagar

News June 2, 2024

కేసీఆర్‌‌కు శుభాకంక్షలు తెలిపిన మాజీ మంత్రులు

image

రాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్బంగా ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జిల్లా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చం అందజేసి శుభాకంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.

News June 2, 2024

బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు: మంత్రి జూపల్లి

image

జూన్ 4 తరువాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు. అయినా తమ అభ్యర్థి ఓడింది కేవలం 111 ఓట్లతోనే అని అన్నారు. స్థానిక సంస్థల్లో గతంలో 300 ఓట్లున్న కాంగ్రెస్ బలం 652 ఓట్లకు పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు.

News June 2, 2024

KCRను కలిసిన నవీన్ రెడ్డి, జిల్లా నేతలు

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ రెడ్డి దంపతులు, ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నవీన్ రెడ్డిని అభినందిస్తూ పూలబోకే అందజేశారు. నవీన్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన ఉమ్మడి జిల్లా నేతలను కేసీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

News June 2, 2024

MBNR: ‘ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’

image

బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు, ఎలక్షన్ ఏజెంట్లతో ఆదివారం కన్వెన్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంగళవారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి చివరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

News June 2, 2024

రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి జూపల్లి

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పూలమాలలతో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగం, అధికారులు, తదితరులు ఉన్నారు.

News June 2, 2024

MBNR: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1439 ఓటర్లు ఉండగా అందులో 1437 ఓట్లు పోలయ్యాయి. జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 2, 2024

మహబూబ్ నగర్ జిల్లాలోని నేటి ముఖ్యంశాలు

image

✓ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు.
✓ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పక్కకు భారీ భద్రత ఏర్పాట్లు.
✓ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ సమాయత్తం: జిల్లా విద్యాధికారి.
✓ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా అదనపు కలెక్టర్.
✓ బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం.

News June 2, 2024

PL SURVEY: మహబూబ్‌నగర్‌లో BJP, నాగర్‌కర్నూల్‌లో BRS..!

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో BJP, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో BRS గెలుస్తాయని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. మహబూబ్‌నగర్‌లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్‌కర్నూల్‌లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు.

News June 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పానగల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.0, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 43.0, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 42.9, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 42.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News June 1, 2024

PL SURVEY: మహబూబ్‌నగర్‌లో BJP, నాగర్‌కర్నూల్‌లో BRS..!

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో BJP, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో BRS గెలుస్తాయని పొలిటికల్ ల్యాబొరేటరీ (PL) సర్వే అంచనా వేసింది. మహబూబ్‌నగర్‌లో BRS నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ పోటీ చేశారు. ఇక నాగర్‌కర్నూల్‌లో BRS నుంచి RS ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, BJP నుంచిభరత్ ప్రసాద్ పోటీలో ఉన్నారు.