Mahbubnagar

News October 3, 2024

జూరాల గేట్లు మూసివేత

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 41,039 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీ ప్రస్తుతం ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

☞ఉపాధిపై యువత పోరాడాలి:సీఐటీయూ
☞Way2Newsతో డప్పు కళాకారులు
☞రేపు వర్షాలు:వాతావరణ శాఖ
☞ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
☞SGT అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
☞కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
☞కోస్గిలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
☞DSCలో సత్తా చాటిన వారికి ఘన సన్మానం
☞దసరా సెలవులకు ఊరెళ్తూన్నారా.? అయితే జాగ్రత్త:SIలు
☞ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News October 2, 2024

MBNR: ‘డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి’

image

డిజిటల్ కార్డు సర్వే బృందాలు కుటుంబ వివరాలను పక్కాగా నిర్వహించాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. డిజిటల్ కార్డు సర్వే బృందాలకు కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డులలో ఈనెల 3నుంచి 7 వరకు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. సర్వే బృందాలకు MRO, MPDO, మున్సిపల్ కమిషనర్‌లు టీం లీడర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు.

News October 2, 2024

MBNR: మండలాల వారిగా తుది ఓటర్ల సంఖ్య ఇలా..!

image

1.MBNR(రూరల్)-36,864, 2.అడ్డాకుల-24,147,
3.బాలానగర్-32,912,
4.రాజాపూర్-21,599,
5.నవాబ్ పేట-52,708,
6.మూసాపేట-21,305,
7.మిడ్జిల్-24,770,
8.కోయిల్ కొండ-50,845,
9.జడ్చర్ల-40,237,
10.హన్వాడ-39,417,
11.గండీడ్-61,608,
12.దేవరకద్ర-45,956,
13.సీసీ కుంట-37,474, 14.భూత్పూర్-26,359 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 3,836 వార్డులు ఉండగా.. మొత్తం 5,16,183 మంది ఓటర్లు ఉన్నారు.

News October 2, 2024

‘పాలమూరు సీతాఫలాలకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు’

image

ఉమ్మడి పాలమూరు సీతాఫలాలకు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. కొల్లాపూర్ మామిడితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలమూరులో పండే సీతాఫలాలకు సైతం అదే స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అడవులు, వాతావరణం, వర్షపాతం తదితర కారణాలవల్ల సీతాఫలాలు మధురంగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రచారం జరుగుతుండడంతో జాతీయస్థాయిలో పాలమూరు సీతాఫలాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

News October 2, 2024

జూరాలలో 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి

image

జూరాల ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 408.108 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.

News October 2, 2024

ఉమ్మడి MBNR జిల్లా ప్రత్యేక అధికారిగా రవి

image

తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(MBNR, NRPT, WNP, NGKL, GDWL) ప్రత్యేక అధికారిగా కాలుష్య నివారణ బోర్డు సెక్రటరీ రవి ఐఏఎస్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

News October 2, 2024

పాన్‌గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..

image

పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువు‌కు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.

News October 2, 2024

నాగర్ కర్నూల్‌ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి

image

సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.

News October 1, 2024

NGKL: డీఎస్సీ ఫలితాల్లో రెండు జిల్లాల్లో డిస్ట్రిక్ టాపర్

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన కే. స్వప్న తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. SGT తెలుగులో 84.90 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. అలాగే SGT ఇంగ్లిష్‌లో 87.90 మార్కులు సాధించి హైదరాబాద్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. ఫలితాల్లో స్వప్న సత్తా చాటడంతో సన్నిహితులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.