India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈరోజు జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు.? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో నారాయణపేట జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.

కార్తీక సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, మల్దకల్, ఉమామహేశ్వరం, అలంపురం, మన్యంకొండ వంటి పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు రద్దీ నెలకొంది. సంబంధిత దేవస్థానాలు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లో భక్తులకు మంచినీరు కూడా అందించాలని హిందూ ధార్మిక సేన ప్రతినిధులు దేవాదాయ శాఖ వారిని కోరారు.

HYD- శ్రీశైలం హైవేపై కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కడ్తాల్కు చెందిన ఇద్దరు స్నేహితులు రాజు, మహేశ్ మైసిగండి నుంచి కడ్తాల్ వైపు బైక్ పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్నేహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర వషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10గంటలకు లగాచర్లకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. సాం. 4 గంటలకు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో మాట్లాడి హైదరాబాద్ వెళ్తారు.

పాలమూరు యూనివర్సిటీ(PU) పరిధిలో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 13 వరకు డిగ్రీ 1,3,5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు PU అధికారులు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు గమనించాలని కోరారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు గ్రూప్-4 అభ్యర్థులు ఆదివారం రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కలిశారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో తమకంటే మార్కులు తక్కువ వచ్చిన అభ్యర్థులకు జాబ్ వచ్చిందని.. మార్కులు ఎక్కువ ఉన్నప్పటికీ తాము జాబ్ కోల్పోయామన్నారు. ఏ పద్ధతిన సెలక్షన్ ప్రాసెస్ జరిగిందో తెలిపాలని వారు బోర్డుకు వినతి పత్రాన్ని అందించారు.

పెద్దకొత్తపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. NGKL నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా కుడికిల్లకి చెందిన నిరంజనమ్మ కల్వకోల్ గ్రామం రహదారి వద్ద కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పరార్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

✓అభ్యర్థులు హాల్టికెట్ను ఏ-4 సైజ్ కలర్ ప్రింట్ తీసుకోవాలి. ✓హాల్టికెట్పై పాస్పోర్టు సైజ్ ఫొటో అతికించాలి. ✓హాల్టికెట్పై ఫొటో సరిగ్గా ముద్రించకుంటే గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో 3పాస్పోర్టు సైజ్ ఫొటోలతోపాటు, వెబ్సైట్లో పొందుపర్చిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్కు అందించాలి. ✓బ్లూ,బ్లాక్ బాల్ పెన్ ఉపయోగించాలి✓ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు జరిగే పరీక్షలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 154 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఈరోజు రెండు విడతలు, రేపు ఒక విడత పరీక్ష ఉంటుంది. ఉ.8:30 నుంచి 9:30 గంటల వరకు, మ.1:30 నుంచి 2:30గంటల వరకు అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

పాలమూరు నుంచే ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తుంన్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టి కొట్టుకుపోతారని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.