Mahbubnagar

News November 16, 2024

వనపర్తి: ‘కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకు’

image

కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులగణులకు వారి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్లు, పశువుల వివరాలు అవసరమా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేసేందుకే ఇన్ని ప్రశ్నలు పెట్టారన్నారు. సర్వేను పునః పరిశీలించాలన్నారు.

News November 16, 2024

‘మెడికల్ హబ్’ గా కొడంగల్ 

image

‘మెడికల్ హబ్’గా కొడంగల్ మారనుంది. అందులో భాగంగానే వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. అయితే నర్సింగ్ కాలేజీకి అడ్మిషన్లు జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు.

News November 16, 2024

కొత్తకోట వాసవీమాత ఆలయంలో ఈ నెల 18న లక్ష పుష్పార్చన

image

కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో 18న కార్తీక మాసం, మూడో సోమవారం పురస్కరించుకొని హరిహరులకు లక్ష పుష్పార్చన, జల దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు రాత్రి 8 గంటలకు కటకం కృష్ణస్వామి కుటుంబ సభ్యులు భక్తులకు ఉపాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News November 16, 2024

గద్వాల: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

సాంబార్‌లో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి(M) పైపాడుకు చెందిన వీరేశ్ కూలీ పనులకు కర్నూలు జిల్లా గోనెగండ్ల(M) ఎన్‌గోడ్‌కు వెళ్లారు. ఆ ఊరిలో శుక్రవారం ఓ శుభకార్యం జరిగింది. వీరేశ్ కుమారుడు జగదీశ్(6) ఫోన్‌తో ఆడుకుంటూ సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. మూత జారిపోవడంతో సాంబారులో పడిపోయాడు. కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News November 16, 2024

షాద్ నగర్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

షాద్ నగర్ శివారు ప్రాంతంలోని బుచ్చి గూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. బుచ్చి గూడకు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కనే పడి ఉన్న బైక్‌ను చూసి రోడ్డుప్రమాదంలో మృతిచెందాడా లేదా ఎవరైనా చంపేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు.

News November 16, 2024

NRPT: 4200 మంది అభ్యర్థులు, 13 పరీక్ష కేంద్రాలు

image

ఈ నెల 17, 18న నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట జిల్లాలో 4200 మంది అభ్యర్థులకు 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, నలుగురు రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపర్డెంట్లు, 15 మంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారని తెలిపారు.

News November 15, 2024

మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

image

మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం చెలరేగింది. 2023 బ్యాచ్‌కు చెందిన సీనియర్ మెడికల్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగు చేశారు. బాధితులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టి 10 మంది సీనియర్ విద్యార్థులను కాలేజ్ నుంచి సస్పెండు చేశారు.

News November 15, 2024

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా నల్లమల బిడ్డ  

image

HYD ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా నల్లమల ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఖాసిం నియామకమయ్యారు. దీంతో ఆయన స్వగ్రామమైన లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సంబరాలు జరుపుకొన్నారు. తమ ప్రాంత వాసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడని, రాష్ట్ర ఏర్పాటులో ఓయూ కీలక పాత్ర వహించిందని, అంత గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆయన ఎంపికవడం తమకు గర్వంగా ఉందన్నారు.   

News November 15, 2024

NGKL: ఆర్మీ జవాన్ సూసైడ్.. ఇదే కారణమా..?

image

బిజినేపల్లి మం. మమ్మాయిపల్లిలో ఆర్మీ <<14606930>>జవాన్ శివాజీ<<>>(28) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 2014లో ఆర్మీలో చేరిన శివాజీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారం క్రితం సెలవులపై ఇంటికొచ్చిన శివాజీ బుధవారం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా రాత్రి ఉరేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News November 15, 2024

జూరాల ప్రాజెక్టు తాజా సమాచారం

image

ప్రియదర్శని జూరాల ప్రాజెక్టులో తాజా సమాచారం ఇలా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సమార్థ్యం 9.357 టీఎంసీలకు గానూ 5.650 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ నాగేశ్వరరావు తెలిపారు. నెట్టెంపాడుకు 609, ఎడమ కాలువకు 957, కుడికాలువకు 368 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం అవుట్ ఫ్లో 2,500 క్యూసెక్కులుగా వెళ్తున్నట్లు తెలిపారు.