India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో కురుమూర్తి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆలయానికి సంబంధించి రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్ల మార్గంలోనే కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల్లో 2,041కు పైగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న MBNR-1,156, NGKL-1,450, GDWL-606, NRPT-746, WNPT-782 మంది ఉపాధ్యాయులను అధికారులు సర్వేకు కేటాయించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒంటి పూటే కొనసాగగా.. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు సర్వేకు వెళుతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించింది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JL నియామక పత్రాలు వెంటనే అందజేయాలని కోరుతున్నారు.

కురుమూర్తి బ్రహోత్సవాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృత్యువాత పడ్డాడు. ఎస్సై శేఖర్ వివరాల ప్రకారం.. బ్రహోత్సవాలకు వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కోనేరులో స్నానం చేసేందుకు దిగి ఈతరాక మృతి చెందాడు. మృతుడు బ్రౌన్ కలర్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని ఇతడిని గుర్తించిన వారు సీసీ కుంట పోలీసు నంబర్ 87126 59354 సంప్రదించాలని తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కనిమెట్ట గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర NH-44పై శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతర వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో డెడ్బాడి ఛిద్రమైంది. పోలీసులు మృతదేమాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 5, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు కురుమూర్తి దర్శనానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి రోడ్డు ద్వారా MBNR జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలోని కురుమూర్తి దేవాలయానికి చేరుకుంటారు. మ.12:10కు ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి మ.12.30కు కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.

కులగణనపై ప్రజలు అపోహలు విడనాడి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్తో మాట్లాడారు. కులగణనలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్త వహించే విధంగా చూడాలన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులను సర్వేలో భాగస్వాములు చేయాలన్నారు.

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు కురుమూర్తి దర్శనానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి రోడ్డు ద్వారా MBNR జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలోని కురుమూర్తి దేవాలయానికి చేరుకుంటారు. మ.12:10కు ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి మ.12.30కు కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.

పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు MBNR, NRPT, NGKL, SDNR డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈనెల 13న ఆయా బస్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని, రిజర్వేషన్ల కోసం MBNR-99592 26286, NGKL-99592 26288, NRPT-99592 26293, SDNR-99592 26287లకు సంప్రదించాలన్నారు. MBNRలోని బస్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.