Mahbubnagar

News September 28, 2024

పెబ్బేరు: శేరుపల్లిలో ఐదు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

image

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లిలో 5రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. వెంకటాపురం శేరుపల్లి మధ్యన నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో పైపులైన్ పగిలిపోవడంతో సమస్య ఏర్పడింది. మరమ్మతు చేపట్టాలని గ్రామస్థులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పంచాయతీ సిబ్బంది ట్యాంకులతో గ్రామాల్లోకి నీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు.

News September 28, 2024

MBNR: త్వరలోనే వారికి ఇందిరమ్మ ఇళ్లు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 45,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గాంధీ జయంతి తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మార్గదర్శకాలు రాగానే గుడిసెల్లో నివాసముండే వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

News September 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

❤ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
❤MBNR:30న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపికలు
❤దామరగిద్ద మండలంలో చిరుత సంచారం
❤డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు:DK అరుణ
❤అయిజ: టీచర్లను నియమించాలని విద్యార్థులు ఆందోళన
❤ధన్వాడ:చిరుత దాడిలో ఎద్దు మృతి
❤వనపర్తి:ఘనంగా వరల్డ్ టూరిజం డే
❤లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి: బార్ అసోసియేషన్
❤గండీడ్: గ్యాస్ సబ్సిడీ పత్రాలు పంపిణీ.. MLAకు ఘన సన్మానం

News September 27, 2024

MBNR: CM ఇలాకాలో ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందించేందుకు వయాట్రిస్, HKM ఛారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందివ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వయాట్రిస్ రూ.6.4 కోట్ల విరాళాన్ని అందజేసింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకు అల్పాహారం అందివ్వనుంది.

News September 27, 2024

సోమశిలకు జాతీయ అవార్డు.. మంత్రి జూపల్లి హర్షం

image

నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల, నిర్మల్‌ జిల్లాకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కడంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. కళాకారులకు, పర్యాటకశాఖ అధికారులు, సిబ్బందకి ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన నిర్మల్‌ కొయ్య బొమ్మలకు, పేయింటింగ్స్‌కు, కొల్లాపూర్‌లోని సోమశిలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

News September 27, 2024

MBNR: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

News September 27, 2024

డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు: DK అరుణ

image

అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బుల మూటలు చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ హైడ్రా డ్రామాలు ఆడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాలన చేతకాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, హైడ్రా పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, HYD అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News September 27, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 12.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 12.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా మదనపూర్ లో 4.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా బొల్లంపల్లిలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 27, 2024

MBNR: 30న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ ఎంపిక

image

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెజ్లింగ్ ఎంపికలు ఈ నెల 30న ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి నర్సింలు తెలిపారు. అండర్-14,17 విభాగాల్లో ఎంపికలు ఉంటాయని, అండర్-14 విభాగానికి జనవరి 1, 2011, అండర్-17 విభాగానికి జనవరి1, 2008 తర్వాత జన్మించిన వారే అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఒరిజినల్ బోనఫైడ్‌తో హాజరు కావాలన్నారు.

News September 27, 2024

ఉండవెల్లి: దోమల నివారణకు ఇదే మార్గం

image

ఉండవెల్లి మండలం పరిధిలో గల ప్రాగుటూరులో ఫ్రైడే డ్రై కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇంటి పరిసర ప్రదేశాల్లో నీటిని ఎక్కువ కాలం నిల్వలేకుండా ఉంచుకోవాలని కోరారు. దోమలను నివారించడానికి ఇది సరైన మార్గమని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.