India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 3 సంవత్సరాలుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ, స్కానింగ్ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నామని DMHO అధికారులు తెలిపారు.

❤రేపు కురుమూర్తికి సీఎం రాక.. ఏర్పాట్లపై ఫోకస్
❤NGKL:ఊరేసుకుని యువకుడి ఆత్మహత్య
❤ కొనసాగుతున్న కుటుంబ సర్వే
❤వనపర్తి:CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
❤ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్
❤NGKL:కరెంట్ షాక్తో బాలుడు మృతి
❤కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
❤సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్లు
❤NRPT: ఎన్యుమరేటర్లను అభినందించిన డిప్యూటీ సీఎం

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన వనపర్తిలోని సవాయిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. సవాయిగూడెంలోని ఓ పొలంలో అదే గ్రామానికి చెందిన 20 మంది కూలీలు వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని వస్తుండగా, చెరువు ముందరి తండా రోడ్డు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. కూలీలు గోపాలమ్మ(58), సానే పద్మమ్మ(59) మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు.

దేవరకద్ర నియోజకవర్గం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి డీఐజీతో కలిసి శనివారం జాతరలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వారు సంబంధిత అధికారులతో చర్చించి, సీఎం రూట్ మ్యాప్, హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న ఎన్యుమరేటర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రజలకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు.

JUN 12న నరసింహస్వామి(అసిస్టెంట్ కమాండెంట్),అబ్దుల్ వహెద్(రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ),25న ఎం.రవి(SI),విక్రం(102 అంబులెన్స్ డ్రైవర్),JUL 3న శివ శ్రీనివాసులు (MRO),25న బాలరాజు(ఐకేపీ సర్వేయర్),SEP 3న వెంకటేశ్వర్ రావు (ఏసీటీఓ),OCT 22న ఆదిశేషు(మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2),NOV 7న రవీందర్(DEO)లు ACBకి పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని ఏసీబీ ఇన్ఛార్జ్ DSP శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది <<14566088>>ACBకి <<>>14 మందిపై కేసులు నమోదు కాగా.. 21 మందిని కోర్టులో హాజరుపరిచారు. JAN 20న రమావత్ వశ్య (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే), 22న బాలోజీ (ఎక్సైజ్ CI),29న జీవరత్నం (లైన్మెన్), FEB 4న సురేష్(SI), 10న ఎస్.పృథ్వీ (ఏఈ), MAR 27న పాండునాయక్ (MRO), రవీందర్ రెడ్డి (ధరణి ఆపరేటర్),మొగులప్ప(రికార్డు అసిస్టెంట్), MAY 31న నరేందర్ కుమార్(డీఈ), వెంకటనాగేంద్ర కుమార్ (ఎస్ఈ), బి.మధుకర్(ఏఏఈ)

ఓటర్ నమోదుకు ఈ నెల 9,10న బూత్ స్థాయి ప్రత్యేక క్యాంప్లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఫారం- 6,7,8,8ఏ దరఖాస్తులు బీఎల్ఓల దగ్గర అందుబాటులో ఉంటాయని, www.nvsp.in వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, 1950(టోల్ ఫ్రీ) నంబర్కు ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వంట గదులు, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాలమూరు యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

సికింద్రాబాద్ లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో శుక్రవారం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మల్లు రవి చెప్పారు.
Sorry, no posts matched your criteria.