India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 9న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం లేదా మరేదైనా సందేహాల నివృతి కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జూన్ 8 ఉ.10 నుంచి సా. 6 వరకు తిరిగి 9న ఉ. 6 నుంచి మ. 2 వరకు 08545-233525 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సందేహాలనివృత్తికి అభ్యర్థులు హెల్ప్లైన్ నంబరును వాడుకోవాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు మంగళవారం తెలిపారు. నేడు ఏసీబీ అధికారులు ఆర్టీవో కార్యాలయంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ముగ్గురు పట్టుబడ్డారు. ఎలాంటి అధికారం లేకున్నా అధికారులతో కుమ్మక్కై విధులు నిర్వహించడం చాలా విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం జరిగింది. నీటిగుంతలో నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడ్డారు. చిన్నారుల అర్తనాదాలు విన్న స్థానికులు గుంత దగ్గరికి వెళ్లి ఒకరిని బయటికి తీయగా ఇద్దరు <<13332379>>చిన్నారులు<<>> మహమ్మద్ ఫుర్ఖాన్ (10) , మహమ్మద్ హుస్సేన్ (13) నీటమునిగి మృతిచెందారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.
నాగర్కర్నల్ జిల్లా బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. వారి మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా గట్టులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38.6, నారాయణపేట జిల్లా ఉట్కూర్లో 38.1, వనపర్తి జిల్లా దగడలో 37.7, నాగర్ కర్నూల్ జిల్లా జెట్ప్రోల్లో లో36.8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
✓ పాఠశాల, కళాశాల బస్సు నడిపే డ్రైవరు వయసు 60 ఏళ్ల లోపుండాలి.
✓ అయిదేళ్ల హెవీ వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
✓ ప్రతి పాఠశాల బస్సుకు డ్రైవరుతో పాటు సహాయకుడిని (అటెండెంటు) నియమించుకోవాలి.
✓ బస్సుల్లోని కిటికీలకు ఇరువైపులా నాలుగు వరుసల పైపులను విద్యార్థులు తల బయటపెట్టి తొంగి చూడకుండా ఉండేలా అమర్చాలి.
✓ బస్సు కండీషన్లో ఉండటమే కాకుండా బ్రేకు వేసిన సమయంలో నాలుగు వైపులా పార్కింగ్ లైట్లు వెలగాలి.
MBNR లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డీకే అరుణ, వంశీ చంద్ రెడ్డి మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తొలి విడత కానుంది. అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. కాగా ఈసారి జిల్లాకు హరితహారం కింద 30.87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.
మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని అపహరించిన ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ తమ వాహనాలు పక్కకు నిలిపి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమైయ్యాడు. మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని పక్కకు పంపించారు. తర్వాత చూస్తే పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. కోదండపురం ఓ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం పోలీసులు గుర్తించారు.
1890 డిసెంబర్ 4రోజున పాలమూరులోని 6వ నిజాం మహబూబ్అలీ ఖాన్ పేరు మీదనే మహబూబ్ నగర్గా పేరు మార్చారు. మహబూబ్ నగర్ అంటే గుర్తు వచ్చేది” పిల్లల మర్రి”ఆ చెట్టు వయసు దాదాపు 800 సంవస్సరాలు, ఈ చెట్టు 4 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, పల్లెల హనుమంత రావు, లాంటి గొప్పవాళ్లు ఉమ్మడి MBNRకి చెందిన వాళ్ళు, జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర”కురుమూర్తి స్వామి”జాతర. SHARE IT
Sorry, no posts matched your criteria.