Mahbubnagar

News May 27, 2024

MBNR: రంగారెడ్డి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి​ సంతాపం

image

నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్‌ ఎస్ఈ ఎన్‌.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్​ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

News May 27, 2024

MBNR: నిరుపేద బాలికల భవితకు భరోసా..

image

నిరుపేద, అనాథ బాలికల కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో కస్తూర్బా బాలికల విద్యాలయం (KGBV) ఏర్పాటుచేసింది. ఇంటర్‌కు విద్య అందిస్తున్న KGBVల్లో MPC, BIPC, MEC, MHIW కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించటం, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వస్తుండటంతో KGBVలకు ఆదరణ పెరుగుతోంది. MBNR, NGKL, WNP, GDL, NRPT జిల్లాల్లో ఉన్న నిరుపేద, అనాథ బాలికల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

News May 27, 2024

మహబూబ్‌నగర్: విషం తాగి బలవన్మరణం

image

విషం తాగి ఓ అధ్యాపకురాలు బలవన్మరణానికి పాల్పడింది. KPHB పోలీసుల వివరాల ప్రకారం.. MBNR కిషన్‌నగర్‌కు చెందిన ఉమాదేవి మియాపూ‌ర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. KPHB సర్దార్ పటేల్ నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటుంది. ఈ నెల 24న విషరసాయనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తాగేసింది. గమనించిన వసతి గృహం నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

News May 27, 2024

విషాదం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు మృతి

image

గాలివాన బీభత్సానికి నాగర్‌కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్‌కర్నూల్ సమీపంలోని మంతటి వద్ద కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

News May 26, 2024

విషాదం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు మృతి

image

గాలివాన బీభత్సానికి నాగర్‌కర్నూల్ జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తిమ్మాజీపేట మం. మారెపల్లికి చెందిన వెంకటయ్య (54) పిడుగుపాటుతో మృతిచెందాడు. నాగర్‌కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుగుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

News May 26, 2024

NGKL: యువకుడి ప్రాణం తీసిన గాలివాన

image

NGKL జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. స్థానికుల కథనం.. వేణుగోపాల్(35) కారు డ్రైవర్. యాత్రికులను తీసుకొని శ్రీశైలం వెళ్లి తిరుగు వస్తున్నారు. ఈ క్రమంలో NGKL సమీపంలో మంతటి వద్ద రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి కారుపై పడింది. దీంతో కారు అద్దం పగిలి గుచ్చుకొని వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 26, 2024

MBNR: ఈ ఏడాదంతా ఎన్నికల పండుగ !

image

పాలమూరులో ZPTC, MPTC సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండగ కొనసాగనుంది. ఆయా ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్దమవుతున్నారు.

News May 26, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు మృతి !

image

గాలి వాన బీభత్సానికి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో పిడుగుపాటుతో గోపాల్ రెడ్డి(45) చనిపోగా నాగర్‌కర్నూల్ సమీపంలోని మంతటి వద్ధ కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి పడటంతో కారు అద్దం పగిలింది. అలాగే తాడూరు మండలంలో గోడకూలి నలుగురు, తెలకపల్లిలో పిడుపాటుతో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

News May 26, 2024

MBNR: ఈనెల 28 నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు

image

మహబూబ్‌నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతాయని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. లేకపోతే పరీక్షలకు అనుమతి ఉండదని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.

News May 26, 2024

గద్వాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ట్రాక్టర్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి పంచాయతీ పరిధి తుమ్మలపల్లి గ్రామ శివారులో జరిగింది. APలోని కర్నూలు జిల్లా గుంతలపాడుకు చెందిన చంద్రశేఖర్(30) బైక్ పై టీ. గార్లపాడు మీదుగా వెళ్తుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో యువకుడికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.