Mahbubnagar

News November 9, 2024

స్కాట్లాండ్ పర్యటనలో మంత్రి, ఎమ్మెల్యేలు

image

స్కాట్లాండ్‌లోని ఎడింబర్గ్ కాసిల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంతరావు సందర్శించారు. మూడు రోజులుగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో రాష్ట్రంలోని టూరిజాన్ని ప్రమోట్ చేశారు.

News November 8, 2024

ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!!

image

✔రేపు,ఎల్లుండి ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్✔ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. పలుచోట్ల అన్నదానం✔PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక✔ఆత్మకూరు: ఉద్దాల ఊరేగింపు మహోత్సవం ప్రారంభం✔GDWL: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య✔సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి: కలెక్టర్లు✔10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఏర్పాట్లపై ఫోకస్✔అవినీతిలో ఉమ్మడి పాలమూరు టాప్

News November 8, 2024

PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో ఖో-ఖో స్త్రీ, పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్(ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్)లో పాల్గొనేందుకు శుక్రవారం ఎంపికలు చేసినట్లు యూనివర్సిటి పీడీ వై.శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తమిళనాడు, కాలికట్ యూనివర్సిటీలో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య, బాల్రాజ్, రవీందర్, సత్య భాస్కర్ రెడ్డి, మీనా తదితరులు పాల్గొన్నారు.

News November 8, 2024

అలంపూర్ టూ శ్రీశైలం సైకిల్ యాత్ర

image

కార్తీకమాసం సందర్భంగా అలంపూర్ పట్టణ యువకులు ఈరోజు శుక్రవారం 100 మందితో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం నుంచి శ్రీశైలం సైకిల్ యాత్రగా వెళ్లారు. ప్రతి సంవత్సరం సైకిల్ యాత్ర కమిటీ వేసుకుని అన్నదానం కోసం కూడా సైకిల్ లక్కీ లాటరీ ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 15 సంవత్సరాలుగా జరుగుతుందని నిర్వాహకులు ప్రశాంత్, భూపాల్, సుధాకర్, శీను అంజి తదితరులు తెలిపారు.

News November 8, 2024

రేవంత్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగి.. సీఎం దాకా !

image

8 నవంబర్ 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్థి దశ నుంచి అంచలంచలుగా ఎగిది నేడు సీఎం అయ్యారు.  2006లో ZPTCగా, 2007 MLCగా, 2019లో మల్కాగిజిరి ఎంపీగా, 2009, 2014, 2023 నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 7 జూలై 2021–6 సెప్టెంబర్ 2024 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 7 డిసెంబర్ 2023న తెలంగాణ 2వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.

News November 8, 2024

10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాతర పరిసరాలను జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.

News November 8, 2024

MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO

image

మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.

News November 8, 2024

నేడు కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉద్దాల కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి పాదరక్షలను ఊరేగించడాన్నే ఉద్దాల ఉత్సవమంటారు. దేవస్థానానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డెమాన్ నుంచి ఉత్సవం ప్రారంభం కానుంది. ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

News November 8, 2024

అవినీతిలో ఉమ్మడి పాలమూరు జిల్లా టాప్!

image

రాష్ట్రంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవినీతిలో అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూ, విద్యుత్, పోలీసు పలు శాఖలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో రెడ్ హ్యాండెడ్‌గా 14 మందిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిని ఏసీబీ అధికారులు జైలుకు పంపిస్తున్నా.. ప్రభుత్వ అధికారులలో తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News November 8, 2024

NGKL: దారుణం.. తెల్లవారుజామునే హత్య

image

పొలం వద్ద రాత్రి కాపలా కాస్తున్నయువకుడని గుర్తుతెలియని దుండగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలకలంరేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్దండ మండలం ఎంజీకాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు(30) నిన్న రాత్రి పొలం వద్ద కాపలాకు వెళ్లాడు. కాగా.. ఈ తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు రాజుపై దాడి చేసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.