India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 41.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 33.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 20.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని కేఎల్ఐ క్యాంప్లో ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్- 1 కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అశోక్ తన కార్యాలయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన దామరగిద్ద తండాలో జరిగింది. రైతు గోన్యనాయక్ రోజువారీగానే ఆవులను మేపుకొని వచ్చి పొలం వద్ద కట్టేయగా రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. కాగా, వారం రోజులుగా చిరుత బాపన్పల్లి గ్రామ శివారులో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు బాపన్పల్లి శివారు అడవిలో బోన్ ఏర్పాటు చేశారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి బుధవారం 1,02,286 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 875.0 అడుగుల వద్ద 163.5820 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో 13.723 మి.యూ. కుడిగట్టు కేంద్రంలో 2.107 మి.యూ విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 49,234 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం సాయంత్రానికి 51వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి 72 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఏడు క్రస్టు గేట్లను ఎత్తి 50,232 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 37,715 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా బుధవారం జడ్చర్లలో ఉదండాపూర్, కొత్తకోటలో కానాయపల్లి గ్రామ శివారులో గల శంకర్ సముద్రం రిజర్వాయర్ పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. అనంతరం భీమా ఫేస్-2 అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
☞ఉమ్మడి జిల్లాలో మంత్రుల పర్యటన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
☞జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించిన మంత్రులు
☞నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా పార్మాసిస్ట్ డే వేడుకలు
☞కల్వకుర్తి: ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి నది
☞వనపర్తి జిల్లా లో కానిస్టేబుల్ మిస్సింగ్
☞పలు జిల్లాలో ఘనంగా దీన్ దయల్ జయంతి
☞పలు మండలలో బాధ్యతలు స్వీకరించిన నూతన MEOలు
☞జోగులాంబ శక్తిపీఠాం దర్శించుకున్న భక్తులు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు MBNR, నారాయణపేట జిల్లాల సరిహద్దుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు బుధవారం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు. ఎగువన ఉన్న మద్దూరు, దౌల్తాబాద్ మండలాల నుంచి వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇతర గేట్లను ఎత్తే అవకాశం ఉందని సూచించారు. బండర్ పల్లి వాగుకు వరద కొనసాగుతుంది.
ఉమ్మడి జిల్లాలో 10 రూపాయల నాణేల చలామణిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నాణేలు చెల్లవంటూ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో వీటిని తీసుకోవడానికి, చెలామణి చేయడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. సరుకుల కొనుగోళ్ల సమయంలో చిల్లర కోసం దుకాణదారులు రూ.10 నోట్లకు బదులు నాణేలను ఇస్తే వాటిని తీసుకునేందుకు చాలామంది నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
అక్టోబర్ 3-12వ తేది వరకు అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అడిషనల్ డీజీపి మహేశ్ భగవత్, ఐజీ ఎం.రమేష్, ఎండోమెంట్ కమీషనర్ హనుమంతరావు, ఏపి జితేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.