Mahbubnagar

News May 26, 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు బాధ్యతలు ఇలా..

image

ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
* ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం
* తాగునీటి సౌకర్యాలు కల్పించడం
* పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం&నిర్వహణ
* విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం
* బాలికల మరుగుదొడ్ల నిర్మాణం
* పాఠశాలలో సోలార్ ఫ్యానల్స్ ఏర్పాటు

News May 26, 2024

MBNR: BRS, BJP మినహా..!!

image

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. BRS, BJP మినహా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.

News May 26, 2024

MBNR: పారదర్శకంగా ఓట్ల లెక్కింపునకు శిక్షణ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.‌ NGKL ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో, MBNR ఎంపీ సీటు ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News May 26, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా మల్లాపూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో 39.8, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 39.7, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 38.4, వనపర్తి జిల్లా దగడలో 37.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 26, 2024

MBNR: రైల్వే స్టేషన్ వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త!

image

మీరు మీ కుటుంబ సభ్యులను, బంధువులను రైల్వేస్టేషన్‌లో దించడానికి వెళ్తున్నారా.. జర మీరు జాగ్రత్త! రైల్వే పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉండి మీ బైక్ దిగేలోపే.. రాంగ్ పార్కింగ్ చేశారని బైక్‌ను స్వాధీనం చేసుకొని జరిమానా కట్టాలని గంటల తరబడి ఓ గదిలో ఉంచుతారు. తర్వాత రైల్వే జడ్జి ముందు ప్రవేశపెట్టి జరిమానా విధిస్తారు. ఇప్పటికి 82 మందిపై కేసులను నమోదు చేసి రూ.45,500 జరిమానా వసూలు చేశారు. మరీ మీరు జాగ్రత్త..!

News May 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు నాగర్ కర్నూల్ 848 పాఠశాలల్లో 450 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణ పేట జిల్లాలో 493 పాఠశాలల్లో 470 ఉపాధ్యాయ ఖాళీలు, గద్వాల జిల్లాలో 461 పాఠశాలల్లో 317 ఖాళీలు, వనపర్తి జిల్లాల్లో 523 పాఠశాలల్లో 316 ఖాళీలు, MBNR జిల్లాలో 852 పాఠశాలల్లో.. 415 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి 1,968 పోస్టులు ఖాళీలు ఉండటంతో.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

MBNR: స్థానిక సమరానికి అధికారుల కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండో వారంలో వార్డుల రిజర్వేషన్లను, మూడో వారంలో గ్రామ పంచాయతీ సర్పంచుల రిజర్వేషన్లను ప్రకటించేందుకు జిల్లా అధికారుల ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. షెడ్యూల్ విడుదల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

News May 26, 2024

మహబూబ్‌నగర్ ఎంపీగా గెలవబోతున్నా: డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎంపీగా గెలవబోతున్నానని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా చూపిస్తున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన పలువురు పార్టీ శ్రేణులు డీకే అరుణను కలిశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ నినాదంతో ప్రజలు బీజేపీ వైపు ముగ్గు చూపారని ఈ సారి గెలుపు మనదే అని శ్రేణులు చెప్పారు.

News May 26, 2024

NRPT: ‘నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి’

image

జిల్లాలో నేరాల నియంత్రణకై పోలీసులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయ కాన్ఫిరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారానికి కోర్టు పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు.

News May 25, 2024

MBNR: మూడు విడతల్లో ఇంటర్ మూల్యాంకనం

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ జరగనుందని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.