Mahbubnagar

News September 25, 2024

కొడంగల్: ఉదయం నుంచే బ్యాంకు వద్ద రైతుల పడిగాపులు

image

బ్యాంకులలో తీసుకున్న రుణాలు నేటి వరకు మాఫీ అవ్వకపోవడంతో రైతులు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నారు. రోజు వందల మందికి పైగా బ్యాంకుకు వస్తుండడంతో వారిని అదుపు చేయడం సిబ్బంది కష్టంగా మారింది. రుణమాఫీ కోసం వచ్చే రైతుల రద్దీని నియంత్రించడానికి ప్రతిరోజు 50 మంది రైతులకు టోకెన్‌లు ఇస్తున్నారు. టోకన్లు తీసుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు.

News September 25, 2024

రాజాపూర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి శివార్లలోని నేషనల్ హైవే 44పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత వెంకటేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ముదిరెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మృతదేహాన్ని బాదేపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News September 25, 2024

KLPR: అన్ని కళాశాలల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన

image

KLPR: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పానగల్, వీపనగండ్ల, కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపళ్లు లేకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల పాలనలో నడుస్తున్నాయి. పదోన్నతుల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది.

News September 25, 2024

అచ్చంపేట: రూ.1.5కోట్లు కాజేసిన బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్

image

అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ఖాతాదారుల నుంచి వారికి తెలియకుండా రూ.1,49,50,000, ఇతరులకు బదిలీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించినట్లు అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపారు.

News September 25, 2024

కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ: మంత్రి జూపల్లి

image

రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్పేస్ టోన్ పేరిట కార్టూన్ నెట్ మిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మూడు అక్షరాల కార్టూన్ 30 అర్థాలను తెలియజేస్తుందని చెప్పారు. కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ అని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్, హరికృష్ణ, కార్టూనిస్టులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

News September 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేడు మంత్రుల పర్యటన

image

పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఈనెల 25న పరిశీలించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్, వట్టెం, ఉదండాపూర్ జలాశయాలను సందర్శించనున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటి పారుదలశాఖతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News September 24, 2024

NGKL: ఉరేసుకొని యువకుడి సూసైడ్.. మృతిపై అనుమానాలు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో చిరు వ్యాపారి పూసల సాయి(25) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాయి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చిరు వ్యాపారం నిర్వహించే సాయి ఆత్మహత్య పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2024

పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి: మాజీ మంత్రి

image

ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం పనులు కేసీఆర్ హయాంలోని పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. వలసల జిల్లా అయిన పాలమూరు పచ్చబడే విధంగా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

News September 24, 2024

MBNR: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదరుచూపులు !

image

ఇటీవల కురిసిన వర్షలకు పేద మధ్యతరగతి కుటుంబాల్లో గుబులు మొదలవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన లెక్కల ప్రకారం 46,700పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని త్వరగా అమలు చేసి, పేద మధ్యతరగతి వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 24, 2024

మళ్లీ తెరుచుకున్న సరళసాగర్ సైఫర్లు

image

వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెచ్చుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు నిండడంతో గాలి పీడనం ద్వారా.. 3 సైఫర్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో ఉన్న వరద నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వరద నీరు పారుతుంది. దీంతో ప్రయాణికుల సందడిగా మారింది. మదనాపూర్ రైల్వే గేట్ సమీపంలో మారేడు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.