India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా రేవల్లిలో 31.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 24.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కృష్ణలో 13.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.
గోపాల్పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13న కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే దసరా తర్వాత కార్యకర్తలను కలవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 12న వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మరుసటి రోజు కొడంగల్ రానున్నారు.
✔DSC-2024 ఉద్యోగాలు సాధించిన పలువురికి ఘన సన్మానం
✔IMEX అమెరికా 2024 ట్రేడ్ షోలో పాల్గొన్న మంత్రి జూపల్లి
✔GDWL:పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
✔NRPT: చెట్టుకు ఢీకొని కారు దగ్ధం
✔MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
✔సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కలెక్టర్లు
✔ఘనంగా బతుకమ్మ సంబరాలు
✔మక్తల్:రోడ్డు ప్రమాదం..మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీహరి
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్నగర్లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <
కొడంగల్ మండలం హుస్నాబాద్కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
గద్వాల జిల్లా అయిజ మండలంలో విషాదం నెలకొంది. మేడికొండకు చెందిన బోయ లక్ష్మన్న(24) పాముకాటుతో మృతి చెందాడు. లక్ష్మన్న నిన్న పొలంలో పని చేస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన గద్వాల వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
Sorry, no posts matched your criteria.