Mahbubnagar

News November 6, 2024

MBNR: వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో తెలంగాణ స్టాల్‌ ప్రారంభించిన మంత్రి

image

లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ స్టాల్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ప్రపంచ నలుమూలల విస్తరించిందని తెలిపారు. లండన్‌లో స్టాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.

News November 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔GET READY..రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ✔11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ✔NRPT:చిరుతపులి దాడిలో మేకలు మృతి ✔MBNR:పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక ✔కడ్తాల్: మహిళ మృతదేహం లభ్యం ✔MBNR:ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి ✔GDWL:సెల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఉత్తమ ప్రతిభ ✔ప్రతి ఇంటిపై స్టిక్కర్లు అతికించాలి:కలెక్టర్లు ✔కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్:AITUC

News November 5, 2024

11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి 

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా  కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.

News November 5, 2024

అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత

image

జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.

News November 5, 2024

NRPT: చిరుతపులి దాడిలో మేకలు మృతి !

image

నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామ శివారులో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయని బాధితులు పేర్కొన్నారు. వెంకటప్ప తన మేకలను మేత కోసం సోమవారం అడవికి తీసుకెళ్ళారు. వాటిలో రెండు కనిపించకపోవడం మంగళవారం అడవిలో వెతకగా రెండు మేకలు మృతి చెంది కనిపించాయి. చిరుతపులి చేసిన దాడిలో మృతి చెందాయని బాధితుడు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే చిరుత సంచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 5, 2024

MBNR: కాలేజీల్లో ప్రమాణాలు కోల్పోకుండా చూడాలి !

image

ఉమ్మడి జిల్లాలో 72 మండలాల్లో 56 ప్రభుత్వ జూ.కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో నిరంతరం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. పాలన అంశాల్లో నిర్ణయం తీసుకోకపోవడం, నిధుల కొరత, మౌలిక వనరుల సమస్యలు దాదాపు అన్ని కళాశాలల్లో ఉన్నాయి. నూతన జూ.అధ్యాపకుల నియామకాలు, ప్రిన్సిపల్ పదోన్నతులు చేపట్టవలసి ఉంది. ప్రభుత్వ జూ.కళాశాలల్లో ప్రమాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

News November 5, 2024

MBNR: పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ నైజింగ్ ఫర్ ఇండియా) పథకంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 119 పాఠశాలలు ఎంపికయ్యాయి. MBNR-28, NGKL-29, GDWL-22, WNPT-21, NRPT-19 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో KGBVలు, గురుకులాలతోపాటు ఎక్కువ సంఖ్యలో హైస్కూళ్లు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలకు సైతం చోటు లభించింది. ప్రతి పాఠశాలకు రూ.2 కోట్ల నిధులు విడతల వారీగా మంజూరు చేయనున్నారు.

News November 5, 2024

 ధాన్యం కొనుగోళ్లు.. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారి

image

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ అధికారిని ప్రభుత్వం నియమించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో వీరు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐఏఎస్ అధికారి రవి నియమితులయ్యారు.

News November 5, 2024

శేష వాహనంపై కురుమూర్తి రాయుడు

image

చిన్నచింటకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకి సేవ కొనసాగింది. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ళ గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి.

News November 5, 2024

రేపు కురుమూర్తి స్వామి అలంకరణ మహోత్సవం

image

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అలంకరణ మహోత్సవం జరగనుంది. అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్థుల ఇలవేల్పు కురుమూర్తి స్వామికి 15వ శతాబ్దంలో స్వామివారికి రాజా సోమ భూపాల్ బంగారు ఆభరణాలు చేయించారు. ఏటా జరిగే అలంకరణ ఉత్సవంలో వీటిని స్వామి వారికి అలంకరిస్తారు.1976 నుంచిఆత్మకూరు SBIలో నగలు భద్రపరుస్తున్నారు. రేపు భారీ ఊరేగింపుగా పోలీసు బందోబస్తు ఆభరణాలు కురుమూర్తికి తీసుకొస్తారు.