India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 5 నుంచి 7 వరకు లండన్లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొనేందుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టూరిజం శాఖ అధికారులు లండన్ పర్యటనకు బయలుదేరారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆండర్-23 వన్డే అంతర్ జిల్లా లీగ్ కం నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ వరంగల్, మెదక్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు మొదటి మ్యాచ్ నేడు ఆదిలాబాద్ జట్టుతో, రేపు వరంగల్ జట్టుతో, 6న ఖమ్మం జట్టుతో తలబడనుంది. మెదక్లో 8న సెమీఫైనల్,9న ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కానున్నారు.

పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులందరు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిలో ఉండవెల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురవరం లోకేశ్వర రెడ్డి, మాజీ సర్పంచులు శేషన్ గౌడ్, శివరాముడు, పవిత్ర జనార్దన్ రెడ్డి, భాస్కర్, ఈదన్న, పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఉండవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. MBNR-2, NGKL-15, GDWL-1, WNPT-1, NRPT-5 జిల్లాలో పత్తి కేంద్రాలను అధికారులు అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే పత్తిని అత్యధికంగా నాగర్ కర్నూల్లో పండిస్తారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే చర్యలు తప్పవని ఆయా జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.

మూడేళ్ల బాలికపై ఓవ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో జరిగింది. రూరల్ CI గాంధీనాయక్ కథనం.. MBNRలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు(3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. స్థానికులు, తల్లిదండ్రులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ఆర్టీసీ కళా భవన్లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది.

✔Get Ready..75 ప్రశ్నలపై ఫోకస్✔NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి✔ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక✔NGKL:నీటి సంపులో పడి బాలుడి మృతి✔MBNR: పంజాబ్కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు✔నూతన ఉపాధ్యాయులకు సన్మానం✔Way2News క్లిక్.. పలుచోట్ల పొద్దున్నే కమ్ముకున్న పొగ మంచు✔కొత్తకోట:కారు,బైక్ ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు✔సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి:కాంగ్రెస్
Sorry, no posts matched your criteria.