India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎనలేనిదని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారని వెల్లడించారు.
బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జనాభా, పరిపాలన సులభతరం కావడానికి గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన జిల్లా ఎస్పీ జానకి ప్రభుత్వానికి పంపించామని శుక్రవారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో 3వ టౌన్, జడ్చర్లలో సబ్ డివిజన్ కార్యాలయం, ట్రాఫిక్ రూరల్ పోలీస్ స్టేషన్, కౌకుంట్లలో నూతన భవనాలకు నివేదికను ఇచ్చామన్నారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో ఉదయం నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేయగా రాత్రి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 7,849 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 11,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడినట్లు షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామపంచాయతీలోని గుండ్యా తండాకు చెందిన జటావత్ రమేశ్ చెడు వ్యసనాలకు అలవాటు పడి భార్య లలిత(30)ను 2020 అక్టోబర్ 26న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు రమేశ్కు జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
వనపర్తి: మొట్టమొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమస్ఫూర్తి, పోరాటజ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరంప్రతాపరెడ్డి అని కొనియాడారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ వరకు తెలియజేయవచ్చని, 28న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని డీపీఓ పార్థసారథి తెలిపారు.
✒పలు ఆదర్శ పాఠశాలలో నూతన ప్రిన్సిపల్ లు బాధ్యతలు స్వీకరణ
✒ భారీ వర్షం
✒MBNR:యాక్సిడెంట్లో మహిళ మృతి
✒పలు గ్రామాలలో కొనసాగిన ఫ్రైడే-డ్రైడే
✒రేపు సవరణ.. 28న ఓటరు తుది జాబితా
✒గండీడ్:కలెక్టర్ తనిఖీ
✒పలుచోట్ల మీలాద్-ఉన్-నబి వేడుకలు
✒బాల కార్మిక నిర్మూలనపై అవగాహన
✒మధ్యాహ్న భోజనం.. రూ.1.94 కోట్ల నిధులు విడుదల
✒అక్టోబరు 3 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నవాబ్పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని MBNR ఎంపీ అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.
Sorry, no posts matched your criteria.