Mahbubnagar

News November 4, 2024

MBNR: మూడేళ్ల బాలికపై హత్యాచారయత్నం

image

మూడేళ్ల బాలికపై ఓవ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో జరిగింది. రూరల్ CI గాంధీనాయక్ కథనం.. MBNRలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు(3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్‌లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. స్థానికులు, తల్లిదండ్రులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

News November 4, 2024

పాలమూరు జిల్లాలో మీ సేవలు బంద్..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.

News November 4, 2024

ఉమ్మడి జిల్లాకు నేడు వర్ష సూచన

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది.

News November 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✔Get Ready..75 ప్రశ్నలపై ఫోకస్✔NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి✔ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక✔NGKL:నీటి సంపులో పడి బాలుడి మృతి✔MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు✔నూతన ఉపాధ్యాయులకు సన్మానం✔Way2News క్లిక్.. పలుచోట్ల పొద్దున్నే కమ్ముకున్న పొగ మంచు✔కొత్తకోట:కారు,బైక్ ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు✔సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి:కాంగ్రెస్

News November 3, 2024

MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల తైక్వాండో జట్టు ఆల్ ఇండియా లెవెల్లో పాల్గొనడానికి ఆదివారం పంజాబ్‌కు బయలుదేరింది. ఈ పోటీలు పంజాబ్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన క్రీడాకారులు గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌లలో నిర్వహించే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని PU PD డా.శ్రీనివాసులు తెలిపారు. 

News November 3, 2024

దేవరకద్ర: ఎట్టకేలకు 27వ దొంగతనానికి దొరికిపోయారు

image

ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో 26 సార్లు పశువుల దొంగతనానికి పాల్పడిన దొంగలు 27వ సారి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు దొంగలు గత కొంతకాలంగా కల్వకుర్తి, దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

News November 3, 2024

MBNR: వినియోగదారులు తోడ్పాటు అందించాలి: SE రమేశ్ 

image

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటర్ కమిషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబ్ నగర్ సర్కిల్ పరిధిలో 8, జడ్చర్ల డివిజన్ 23, దేవరకద్ర 3, రాజాపూర్ 3 ఫిర్యాదులు అందాయని SE రమేశ్ తెలిపారు. వాటి పరిష్కారానికి విద్యుత్తు అధికారులు సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.

News November 3, 2024

NGKL: నీటి సంపులో పడి బాలుడి మృతి

image

వంగూరు మండలంలోని వంగూరు గేట్ దగ్గర నివాసం ఉంటున్న రమేశ్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు సత్యదేవ్(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని నీటి సంపు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

News November 3, 2024

MBNR: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి: TG UTF

image

బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని టీజీ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 3, 2024

MBNR: ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక

image

ఉమ్మడి MBNR జిల్లా అండర్-23 క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం.రాజశేఖర్ తెలిపారు. డేవిడ్ కృపాల్(C), MD.షాదాబ్, అబ్దుల్ రఫీ, MD.ముఖీత్, MD.అద్నాన్, అభిలాష్ గౌడ్, కొండా శ్రీకాంత్, అరవింద్, ఛత్రపతి,  జస్వంత్, తరుణ్, ప్రణీత్, అక్షయ్, అంజి, శ్రీకాంత్‌లు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు వరంగల్‌లో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు.