India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో రికార్డ్ అసిస్టెంట్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. దీంతో విద్యార్థిని కుటుంబీకులు షీటీంను సంప్రదించారు. వారు కాలేజీకి చేరుకొని సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినితో లిఖితపూర్వక ఫిర్యాదు చేసుకున్నారు. పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని షీ టీం అధికారి వెంకటయ్య తెలిపారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్లో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నాను అని ఎంపీ అన్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలు అరుణమ్మను సన్మానించారు.
✒ఖమ్మంపై సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
✒మరో 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✒12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
✒రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
✒2వ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
✒పలుచోట్ల బతుకమ్మ సంబరాలు
✒ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు-23,22,054
✒సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త:SPలు
✒DSC-2024..కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన
✒ముమ్మరంగా డిజిటల్ కార్డు సర్వే
ఓరుగల్లులో రాష్ట్రస్థాయి U-19 టోర్నీలో ఉమ్మడి MBNR జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం సెమీస్లో ఖమ్మం జట్టుపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ల దాటికి ఖమ్మం జట్టు 39.3 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. జిల్లా జట్టు నుంచి అబ్దుల్ రాఫె-110 పరుగులు, MD ముఖిత్ 4 వికెట్లు తీశారు.
#CONGRATULATIONS
దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
వానా కాలంలో రైతులు సాగుచేసిన వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్లో 244, నారాయణపేటలో 95 జోగులాంబ గద్వాలలో 55, వనపర్తిలో 244, మహబూబ్నగర్లో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్టూరులో 84.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 37.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్లో 36.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా దోనూరులో 30.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Sorry, no posts matched your criteria.