Mahbubnagar

News May 19, 2024

MP ఎన్నికలు.. రూ.8.40 కోట్ల నగదు, 33వేల లీటర్ల మద్యం సీజ్

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డింది. జిల్లాలోని 2 నియోజకవర్గాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 13 నుంచి ఈనెల 14 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.8.40 కోట్ల నగదు, 33,831.93 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం విలువ రూ.2.98 కోట్లు ఉంటుందని అంచనా.

News May 19, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో యవకుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మండలంలోని కాటవరం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడుకి సుమారు 30ఏళ్లు ఉంటాయని ఘటనపై కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు చెప్పారు.

News May 19, 2024

జోగులాంబను దర్శించుకున్న విద్యాశాఖ డైరెక్టర్లు

image

ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యాదగిరి(మల్టీ జోన్ 2), మల్టీ జోన్ 1 డైరెక్టర్ జాయింట్ రాజేందర్ సింగ్, అలాగే తెలంగాణా డిగ్రీ పీజీ కళాశాలల ప్రిన్సిపల్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు దర్శనాలు చేయించారు. వీరితోపాటు డిగ్రీ కళాశాల లెక్చరర్ పిండి కృష్ణమూర్తి ఉన్నారు.

News May 19, 2024

MBNR: ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌కు కావలసిన సర్టిఫికెట్స్!!

image

✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో.
✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్.
✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి.)
✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్.
✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో.
✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి.
✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది.

News May 19, 2024

మహబూబ్‌నగర్: ‘అంతటా అదే చర్చ!!’

image

ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారని స్థానికులు తెలిపారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.

News May 19, 2024

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 41.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 36.5 మి.మీ, గద్వాల జిల్లా సాటేర్లలో 29.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో 22.0 మి.మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News May 19, 2024

అడ్డాకుల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఇంట్లో ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడ్డాకుల మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కుటుంబ సభ్యులు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనేందుకు వెళ్లగా యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని MBNR ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 19, 2024

MBNR: ‘రుణమాఫీ.. వారికి డబుల్ ధమాకా.?’

image

ఉమ్మడి జిల్లాలో గతంలో అప్పులు తీసుకున్న రైతులకు అప్పటి BRS ప్రభుత్వం తొలి విడతలో రూ.50వేలు రుణం ఉన్నవారికి, 2వ విడతలో రూ.99 వేల వరకు రుణం ఉన్నవారికి రుణమాఫీని వర్తింప చేసింది. పాత రుణం రద్దు చేసి వారికి తిరిగి కొత్త పంట రుణం మంజూరు చేశారు బ్యాంకర్లు. రుణమాఫీ వారికి మినహాయించి మిగతా వారికి ఇస్తారా లేక అందరికీ ఇస్తారా అనేది తేలియాలి. అందరికీ మాత్రం 2023లో రుణమాఫీ పొందిన రైతులకు డబుల్ ధమాకా తగలనుంది.

News May 19, 2024

అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లా నుంచి 6134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

News May 18, 2024

CM రేవంత్ రెడ్డికి ఆ టెన్షన్: DK అరుణ

image

CM రేవంత్ 5 నెలలు అవుతున్నా పాలనపై పట్టు సాధించకుండా.. హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు అని DK అరుణ ఆరోపించారు. MP ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు దక్కడం లేదన్న టెన్షన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. BJPకి రాష్ట్రంలో 10 నుంచి 12 MP స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో CM టెన్షన్‌లో ఉన్నారన్నారు.