Mahbubnagar

News November 3, 2024

NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

image

గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. లింగాలకు సొంత పనుల మీద వచ్చిన ఓ వ్యక్తి ఆకలి వేయడంతో స్థానిక చెన్నంపల్లి చౌరస్తా వద్ద గుడ్లు కొని తింటున్నాడు. ఈ క్రమంలో గుడ్డు గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2024

MBNR: 2014లో కుటుంబ సర్వే డాటా.. 75 ప్రశ్నలపై ఫోకస్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 42,84,024 ఉండగా.. 9,67,013 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు 56 ప్రధాన ప్రశ్నలు మరో 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సమాచారం సేకరించనున్నారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

News November 3, 2024

MBNR: దామరగిద్దలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా త్యాగదొడ్డిలో 34.9 డిగ్రీలు, వనపర్తి జిల్లా అమరచింతలో 33.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 32.1 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 31.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News November 3, 2024

NGKL: పదేళ్ల బాలికపై వృద్ధుడి లైంగిక దాడి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కనకయ్యగౌడ్ వివరాలిలా.. ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి చెందిన వృద్ధుడు మల్లయ్య మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 3, 2024

విద్యుత్ వినియోగదారులకు ALERT.. ఫిర్యాదు చేయండి!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు అధికారులు అలర్ట్ ప్రకటించారు. నేడు(ఆదివారం) ‘విద్యుత్ వినియోగదారుల దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్ డివిజన్ కార్యాలయంలో 9:00 గంటలకు వినియోగదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 3, 2024

NRPT: శ్రీశైలం వెళ్ళే భక్తులకు శుభవార్త

image

నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రేపటి నుంచి బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కార్తీకమాసం పురస్కరించుకొని బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. బస్టాండ్ నుంచి ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు డీలక్స్ బస్ శ్రీశైలం బయలుదేరి వెళ్లి మళ్ళీ మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి నారాయణపేటకు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News November 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఓపెన్ DEGREE, PG.. దరఖాస్తుకు గడువు పడగింపు
✔రేపటి నుంచి పెళ్లిళ్ల సీజన్ షురూ..DEC వరకు ముహూర్తాలే
✔SDNG:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
✔మెస్ చార్జీలు పెంచడంతో విద్యార్థుల హర్షం
✔Way2Newsతో దివాలి భక్తులు
✔PUలో 6,7,8న సౌత్ జోన్ ఎంపికలు
✔ఇంటింటి సర్వేకు సర్వం సిద్ధం
✔నేటి నుంచి ప్రారంభమైన యాక్ట్-30
✔కురుమూర్తి స్వామికి సిద్ధమవుతున్న పట్టు వస్త్రాలు
✔BC సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ 

News November 3, 2024

ఆత్మకూరు: కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు వివిధ ప్రాజెక్టుల్లో శనివారం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు సూపర్డెంట్ ఇంజినీర్ సూరిబాబు తెలిపారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు మూడు యూనిట్లలో 33.459 యూనిట్ల ఉత్పత్తి, లోయర్ జూరాల ప్రాజెక్టులో మూడు యూనిట్లలో 319.165 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు ఆయన తెలిపారు.

News November 2, 2024

MBNR: 6, 7, 8న సౌత్ జోన్ ఎంపికలు

image

MBNRలోని PUలో సౌత్ జోన్ /ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు ఈ నెల 6,7,8న ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ PD డాక్టర్. శ్రీనివాసులు తెలిపారు. 6న హాకీ (పురుషుల విభాగం), స్త్రీ, పురుషుల విభాగంలో 7న ఆర్చరీ,  8న ఖోఖో పోటీల్లో ఎంపికలు ఉంటాయని తెలిపారు. 17-25 సంవత్సరాలు గల క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, 10వ తరగతి MEMO తో హాజరు కావాలని తెలిపారు.

News November 2, 2024

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి2/2

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన <<14512539>>కురుమూర్తి <<>>వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.