India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట(M) <<14512550>>కురుమూర్తిలో<<>> ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ. 1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. #Way2News ప్రత్యేక కథనం.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గద్వాల జిల్లా కల్లూరు తిమ్మందొడ్డిలో 33.8 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 33.7, వనపర్తి జిల్లా రేవల్లి లో 32.9, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 32.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్హాళ్లు బుకింగ్లు మొదలయ్యాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి వేంకటేశ్వరస్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధం అవుతున్నాయి. ప్రతీ ఏడాది ప్రభుత్వం లక్కీ డిప్ ద్వారా నేత కుటుంబాలను ఎంపిక చేస్తుంది. ఈసారి పగడాకుల కుర్మన్న నేత కుటుంబానికి దక్కింది. ఈ పట్టు వస్త్రాలు ఈనెల 6న అలంకారోత్సవం రోజున స్వామి వారికి సమర్పిస్తారు. నేత పనిని అత్యంత నిష్ఠతో కొనసాగిస్తారు. పని పూర్తి చేసే వరకు వారు మాంసాహారం తీసుకోరు.

ఓ బాలికపై 62 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలో జరిగింది. సీఐ కనకయ్య తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామంలో ఇంటిముందు తిరుగుతున్న చిన్నారిని అదే గ్రామానికి చెందిన వృద్ధుడు ఇంట్లోకి పిలిచి మభ్యపెట్టి అత్యాచారానికి ఒడిగెట్టాడు. ఆలస్యంగా గుర్తించిన సదరు బాలిక తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పోలీస్లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 15 వరకు గడవు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు.

వనపర్తిలో గురువారం జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఒకరోజు వ్యవధిలోనే ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి(M) అంకూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి చిట్టి డబ్బులు విషయమై గాంధీనగర్కు చెందిన వీరపాగు రాములును గొంతు నులిమి చంపి వనపర్తి శివారులో పడేశాడు. సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా శ్రీనివాస్ రెడ్డి నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు ఉపాధ్యాయుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా ప్రణాళిక, విద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సర్వే నిర్వహించేందుకు మొత్తం 1180 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లు అవసరమని వారి పాత్ర కీలకమని అన్నారు.

✔MBNR:లా,ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు పట్ల పలువురు హర్షం
✔భక్తులతో కిటకిటలాడిన కురుమూర్తి దేవాలయం
✔కిష్టంపల్లి: ముళ్లపొదలో పసికందు.. ఆసుపత్రికి తరలింపు
✔NGKL: డెంగ్యూతో బాలుడి మృతి
✔MBNR: 4న ఉమ్మడి జిల్లా స్థాయి యోగా ఎంపికలు
✔పలుచోట్ల దీపావళి వేడుకలు
✔మహమ్మదాబాద్: ఘనంగా మాజీ మంత్రి కమతం రాంరెడ్డి జయంతి వేడుకలు
✔పకడ్బందీగా కుటుంబ సర్వే: కలెక్టర్లు
✔కురుమూర్తి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా పానగల్ లో 34.0 డిగ్రీలు, గద్వాల జిల్లా అలంపూర్ లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వార్లో 33.4 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరులో 33.2 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాలలో 32.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.