Mahbubnagar

News May 18, 2024

MBNR: పల్లెల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల చర్చ

image

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ముగియటంతో జిల్లాలోని పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల చర్చ మొదలైంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియటం, ఫిబ్రవరి 2నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సీఎం జూన్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించడంతో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా, సర్పంచ్ అభ్యర్థి ఎవరన్నదానిపై పల్లెల్లో చర్చ సాగుతోంది.

News May 17, 2024

MBNR: మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

HYDకార్మికనగర్‌లో వనపర్తి జిల్లాకు చెందిన <<13256242>>మేకప్ ఆర్టిస్ట్ <<>>చెన్నయ్య(తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్‌నగర్‌ వాసి సంపత్ యాదవ్(19)కు పరిచయముంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి సంపత్, చెన్నయ్య కలిసి నిమ్స్‌మే గ్రౌండ్‌లో అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఈసమయంలో సంపత్ తన వద్ద ఉన్న కత్తితో చెన్నయ్యను చంపాడు. సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News May 17, 2024

నల్లమల అడవిలో ఎకో టూరిజం ఎఫెక్ట్

image

NGKL జిల్లా నల్లమలలోని సలేశ్వరం వరకు ఎకో టూరిజం ప్యాకేజీ ప్రవేశ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఏటా మూడు రోజులే అనుమతిస్తున్న సలేశ్వరం జాతరకు ఏడాదిలో 9 నెలలపాటు పర్యాటకులను అనుమతించే ప్రక్రియ మొదలైంది. సలేశ్వరం ప్రాంతంలో చెట్లను తొలిగించి మట్టిదారి నిర్మిస్తున్నారు. అయితే వాహనాలు, జన సంచారంతో ఇన్నాళ్లు కొనసాగిన ఆటవీ పరిరక్షణ, పెద్దపులులు, చిరుతల జీవనానికి ఆటంకం కలుగుతుంది.

News May 17, 2024

NGKL: అగ్ని వీర్ దరఖాస్తుల ఆహ్వానం

image

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఆసక్తిగల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన క్రీడల శాఖ అధికారి సీతారాం తెలిపారు. ఈనెల 22 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. భారత వాయుసేనలో చేరాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు agnipathvayu. cdac.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు

News May 17, 2024

MBNR: ఈనెల 30న.. కాబోయే వధువు మృతి

image

కాబోయే వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. స్థానికుల వివరాలు.. అమరచింతకు చెందిన ఓ యువతి(24) పెళ్లి ఈనెల 30న జరగాల్సి ఉంది. సాయంత్రం ఇంటికెళ్లిన సోదరుడు తలుపు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో లోపలికి వెళ్లిన అతను ఆమె తల నుంచి రక్తం కారుతుండగా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అయితే ఉరేసుకునే క్రమంలో ఫ్యాన్ కొక్కెం ఊడి కిందపడటంతో గాయాలై మృతి చెందినట్లు భావిస్తున్నారు.

News May 17, 2024

MBNR: 4,63,983 మంది ఓటేయలే

image

ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును వినియోగించుకోవడంలో పాలమూరు ప్రజలు నిర్లక్ష్యం ప్రదర్శించారు. తాజా ఎంపీ ఎన్నికల్లో 4,63,983 మంది ఓటుకు దూరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. MBNR పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 16,82,470 ఓట్లు ఉంటే 12,18,487 మంది తమ ఓటు వేశారు. 2019 MP ఎన్నికల్లో మొత్తం 13,68,868 మందికి 92,65,16 ఓట్లు పోలయ్యాయి. ఈ మధ్య 3,13,602 ఓట్లు పెరిగినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ఆందోళనకరం.

News May 17, 2024

PU డిగ్రీ పరీక్షలు.. ముగ్గురు డిబార్

image

PUలో డిగ్రీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఉదయం జరిగిన సెమిస్టర్-2 పరీక్షకు మొత్తం 11,848 మందికి గాను 11,227 మంది, సెమిస్టర్-6 పరీక్షకు 11,448 మందికి 11,108 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా కొండనాగులలో ఇద్దరు, నాగర్ కర్నూల్ లో ఒకరు మాల్ ప్రాక్టీసుకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు పీయూ అధికారులు తెలిపారు.

News May 17, 2024

పాలమూరులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం

image

సీఎం రేవంత్ సొంత ఇలాకా మహబూబ్‌నగర్ జిల్లా కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 2పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా 11 పర్యాయాలు స్వయంగా పర్యటించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న MBNR పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా పలుసార్లు వచ్చారు. జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

News May 17, 2024

MBNR: అప్పుడు 40.. ఇప్పుడు 22 రోజులు..!

image

ఉమ్మడి జిల్లాలో 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఫలితాలు వెల్లడి కోసం 22 రోజులు నిరీక్షించాలి. దేశవ్యాప్తంగా మరో 3 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్ని పూర్తయ్యాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. నేతలు ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారో అని లెక్కలు వేసుకుంటున్నారు.

News May 16, 2024

NRPT: సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

image

నారాయణపేటలో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ఖాళీగా ఉన్న పంట భూములను సారవంతం చేసేందుకు రైతులు దృష్టి సారించారు. సేంద్రియ ఎరువుగా గొర్రెలు, మేకల ఎరువు భూమి సారవంతానికి ఉపయోగ పడటంతో ప్రస్తుతం గొర్రెల మందలు భూమిలో నిలుపుదల చేయించుకుంటూ భూమి సారవంతానికి రైతులు చర్యలు తీసుకుంటున్నారు. గొర్రెలు, మేకల మందలను రాత్రంతా పొలంలో నిలుపుదల చేయడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.