India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ రహదారి 44 వేముల వద్ద రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. పైపు లైన్ల మార్పులు కారణంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాలకు మూసాపేట మండలంలోని 20 గ్రామాలకు మూడు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు జిల్లా మిషన్ భగీరథ కార్యనిర్వహక ఇంజినీర్ పి.వెంకట్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుంచి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 119 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇందులో మక్తల్ నియోజకవర్గం ని ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడింది. ఈరోజు నుంచి గ్రామంలో ఈనెల 7 వరకు ఇంటింటి సర్వే ఃజరగనుంది.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 41,039 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీ ప్రస్తుతం ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
☞ఉపాధిపై యువత పోరాడాలి:సీఐటీయూ
☞Way2Newsతో డప్పు కళాకారులు
☞రేపు వర్షాలు:వాతావరణ శాఖ
☞ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
☞SGT అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
☞కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
☞కోస్గిలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
☞DSCలో సత్తా చాటిన వారికి ఘన సన్మానం
☞దసరా సెలవులకు ఊరెళ్తూన్నారా.? అయితే జాగ్రత్త:SIలు
☞ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డిజిటల్ కార్డు సర్వే బృందాలు కుటుంబ వివరాలను పక్కాగా నిర్వహించాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. డిజిటల్ కార్డు సర్వే బృందాలకు కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డులలో ఈనెల 3నుంచి 7 వరకు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. సర్వే బృందాలకు MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లు టీం లీడర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
1.MBNR(రూరల్)-36,864, 2.అడ్డాకుల-24,147,
3.బాలానగర్-32,912,
4.రాజాపూర్-21,599,
5.నవాబ్ పేట-52,708,
6.మూసాపేట-21,305,
7.మిడ్జిల్-24,770,
8.కోయిల్ కొండ-50,845,
9.జడ్చర్ల-40,237,
10.హన్వాడ-39,417,
11.గండీడ్-61,608,
12.దేవరకద్ర-45,956,
13.సీసీ కుంట-37,474, 14.భూత్పూర్-26,359 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 3,836 వార్డులు ఉండగా.. మొత్తం 5,16,183 మంది ఓటర్లు ఉన్నారు.
ఉమ్మడి పాలమూరు సీతాఫలాలకు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. కొల్లాపూర్ మామిడితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలమూరులో పండే సీతాఫలాలకు సైతం అదే స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అడవులు, వాతావరణం, వర్షపాతం తదితర కారణాలవల్ల సీతాఫలాలు మధురంగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రచారం జరుగుతుండడంతో జాతీయస్థాయిలో పాలమూరు సీతాఫలాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 408.108 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.
తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(MBNR, NRPT, WNP, NGKL, GDWL) ప్రత్యేక అధికారిగా కాలుష్య నివారణ బోర్డు సెక్రటరీ రవి ఐఏఎస్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.