Mahbubnagar

News May 15, 2024

NGKL: ఆ గ్రామంలో ఐదుగురే ఓటేశారు

image

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం 2కిలోమీటర్లకు ఎక్కువ దూరం ఉన్న గ్రామాలకు పోలింగ్ కేంద్రాలను మంజూరు చేసింది. దీనితో నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అమ్రాబాద్ మండలం ఫర్హాబాద్ చెంచుపెంటలో నలుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మొత్తం 10మంది ఓటర్లే ఉన్నారు. తాజా ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 15, 2024

మహబూబ్‌నగర్: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్ !

image

పాలమూరులో ఓటర్ల తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో 31 మంది, నాగర్ కర్నూల్ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. MBNRలో 7.12, NGKLలో 7.23 పోలింగ్ శాతం పెరిగింది. ఈ సమయంలో‌ ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో‌ టెన్షన్‌ పెంచింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

News May 15, 2024

పాలమూరు బిడ్డకు BRICS యువజన సదస్సు ఆహ్వానం

image

ఈనెల 15, 16న సౌత్ ఆఫ్రికాలోని ట్రిటోరియాలో జరిగే BRICS యూత్ ఇన్నోవేషన్ సమావేశాలకు భారత్ నుంచి మరికల్ మండల కేంద్రానికి చెందిన న్యాయవాది అయ్యప్పకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిపై బ్రిక్స్ దేశాలు చర్చిస్తాయి. బ్రిక్స్ యూత్ ఇన్నోవేషన్ సదస్సుకు ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు న్యాయవాది అయ్యప్ప అన్నారు.

News May 15, 2024

కోస్గి: విమానం ఎక్కేలోగా మృత్యువడిలోకి..

image

కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.

News May 15, 2024

MBNR: కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహబూబ్ నగర్‌లోని ఏనుగొండ సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వై.సురేందర్ తెలిపారు. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈలో 10 తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఎంపీసీ, బైపీసీలో కలిపి 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని, ఈనెల 15 నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 15, 2024

నాగర్‌కర్నూల్ MP ఎన్నికలు.. పోలింగ్ ఇలా..!

image

నాగర్‌కర్నూల్ లోక్ సభ పరిధిలో మొత్తం 69.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 17,38,254 ఓట్లకు గానూ 12,07,471 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,13,085 మంది పురుషులు, 5,94,967 మంది స్త్రీలు, 19 మంది ఇతరులు ఉన్నారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74.93, 74.06 శాతం పోలింగ్ కాగా.. అచ్చంపేట, కొల్లాపూర్‌లో అత్యల్పంగా 65.11 శాతం చొప్పున నమోదైంది. పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.

News May 15, 2024

MBNR: ప్రత్యేక తరగతులు నిర్వహించండి

image

జిల్లాలో 10 తరగతి వార్షిక పరీక్షల్లో 2,127 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అత్యధికంగా గణితం సబ్జెక్టులో 594, సైన్స్ సబ్జెక్టులో 573 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరంతా జూన్ 3 నుంచి 13 వరకు జరిగే సప్లమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. వీరికి విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

News May 15, 2024

మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే మేలు..!

image

కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 1.90 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. అదనంగా మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.

News May 15, 2024

PU వీసీ పదవికి 152 దరఖాస్తులు

image

పీయూ ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మూడేళ్ల పదవి కాలం ఈనెల 21తో ముగియనుంది. 2021 మే 21న పీయూ 6వ ఉపకులపతిగా రాష్ట్రంలో మరో 10 యూనివర్సిటీలకు కూడా అప్పుడే వీసీలు నియమితులయ్యారు. వీరి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకాలకు కసరత్తు మొదలుపెట్టింది. పీయూ వీసీ పదవికి మొత్తం 152 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా విశ్రాంతి ఆచార్యులు ఉన్నారు.

News May 15, 2024

కొల్లాపూర్: 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు

image

కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్గడ్డ తీరంలో మంగళవారం నాటికి 807 అడుగుల మేర శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ ఉన్నట్లు మిషన్ భగీరథ పథకం ఈఈ సుధాకర్ సింగ్ చెప్పారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ ద్వారా రేగుమాన్ గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను పంపులతో ఎత్తిపోస్తున్నారన్నారు. తాగునీరు అందించే ఎల్లూరు జలాశయంలో 0.35 టీఎంసీల సామర్థ్యం మేర పూర్తి స్థాయిలో నీటితో నింపుతున్నారు.