India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాఠశాల పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలన విధానం తదితర అంశాలపై అభివృద్ధి కోసం ఇటీవల ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలానికి ఒక MEOను నూతనంగా నియమించారు. కాగా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈనెల 29నHYDలో ఒక్కరోజు శిక్షణ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ అంశాల పర్యవేక్షణ MEOలకు పై శిక్షణ ఇవ్వనున్నారు.

పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శివ(25) అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శివ మృతికి కారణం మహిళతో వివాహేతర సంబంధమా, లేక మరేమైన కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శంకర్ నాయక్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణకు అవసరమయ్యే సామాగ్రిని గోదాములో భద్రపరిచారు. MBNRలో 441 పంచాయతీలకు గాను 3,836, NGKLలో 464 పంచాయతీల్లో 4,140, GDWLలో 255 పంచాయతీల్లో 2,390, WNPTలో 260 పంచాయతీల్లో 2,366, NRPTలో 280 పంచాయతీల్లో 2,544 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్పేటలో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా రాజోలిలో 34.0 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా జడ్ప్రోల్లో 33.3 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 33.2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కోటకొండలో 33.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గానికి రానున్నారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలానికి చేరుకొని మండలానికి ఉ.11 గంటలకు చేరుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ కుమారుడు సతీష్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం మ.12 గంటలకు బొంరాస్పేట మండలం రేగడి మైలారంలో ఇటీవల మృతి చెందిన నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

ఉమ్మడి MBNR జిల్లా SGF టోర్నీ కోసం మహబూబ్ నగర్ జిల్లా అండర్-14,17 కబడ్డీ బాల,బాలికల జట్లను ఈనెల 29న బాదేపల్లిలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ కార్యదర్శి శారదాబాయి తెలిపారు. అండర్-14 బాలురు 51 కిలోలు,బాలికలు 48 కిలోలు ఉండాలని, అండర్-17 బాలురు 55 కిలోలు,బాలికలు 55 కిలోలకు మించి ఉండరాదని అన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

NGKL జిల్లా బల్మూరు మండలం బిల్లకల్ ప్రాథమిక పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుంది. భవనం ఇలా ఉంటే తమ పిల్లలను ఎలా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల నడుస్తుంది. దీంతో కొందరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.

గ్రామస్థాయిలో పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తులు పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, ఇరిగేషన్ ఏఈలు సమన్వయంతో పనిచేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని మండలాల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎంపీఓలు, ఇరిగేషన్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. 3 విభాగాల అధికారులు వారంలో ఒకచోట సమావేశం కావాలన్నారు.

➤లొంగిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు
➤రేవంత్ రెడ్డి ఇలాకాలో రైతుల రణరంగం
➤రేపు మద్దూర్కు సీఎం రాక..భారీ బందోబస్తు
➤సుంకేసుల 23 గేట్లు ఓపెన్
➤అంగడిరైచూర్లో పులి కలకలం
➤బొంరాస్పేట:Way2News EFFECT..VKBD బస్సు ప్రారంభం
➤29న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ ఎంపిక
➤జూపల్లికి రాజకీయ విలువలు లేవు: హర్షవర్ధన్ రెడ్డి
Sorry, no posts matched your criteria.