Mahbubnagar

News May 13, 2024

3PM: MBNRలో 58.92.. NGKLలో 57.17 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ. 3గం. వరకు MBNR పరిధిలో 58.92, నాగర్ కర్నూల్‌లో 57.17 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 52.21, వనపర్తి- 56.19, గద్వాల- 64.39, ఆలంపూర్- 63.04, అచ్చంపేట- 52.86, కల్వకుర్తి-60.70, కొల్లాపూర్- 50.40⏵మహబూబ్‌నగర్-52.45, జడ్చర్ల-63.73, దేవరకద్ర-61.92, నారాయణపేట-54.99, మక్తల్-59.43, షాద్‌నగర్-60.26, కొడంగల్-60.44 శాతం నమోదైంది.

News May 13, 2024

1 PM: MBNRలో 45.84.. NGKLలో 45.88 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మ. 1గం. వరకు MBNR పరిధిలో 45.84, నాగర్ కర్నూల్‌లో 45.88 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 44.72, వనపర్తి- 46.28, గద్వాల- 50.45, ఆలంపూర్- 51.11, అచ్చంపేట- 44.82, కల్వకుర్తి-46.85, కొల్లాపూర్- 36.52⏵మహబూబ్‌నగర్-42.08, జడ్చర్ల-49.53, దేవరకద్ర-48.93, నారాయణపేట-45.25, మక్తల్-43.78, షాద్‌నగర్-44.30, కొడంగల్-47.59 శాతం నమోదైంది.

News May 13, 2024

MBNRలో 26.99.. NGKLలో 27.74 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 11గం. వరకు MBNR పరిధిలో 26.99, నాగర్ కర్నూల్‌లో 27.74 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 26.12, వనపర్తి- 29.46, గద్వాల- 29.53, ఆలంపూర్- 30.46, అచ్చంపేట- 25.32, కల్వకుర్తి- 28.46, కొల్లాపూర్- 24.50⏵మహబూబ్‌నగర్-25.23, జడ్చర్ల-29.80, దేవరకద్ర-29.75, నారాయణపేట-24.32, మక్తల్-25.11, షాద్‌నగర్-25.69, కొడంగల్-29.32 శాతం నమోదైంది.

News May 13, 2024

MBNRలో 10.33.. NGKLలో 9.18 శాతం పోలింగ్

image

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉ. 9గం. వరకు MBNR పరిధిలో 10.33, నాగర్ కర్నూల్‌లో 9.18 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ వివరాలు ఇలా..⏵నాగర్‌కర్నూల్- 8.65, వనపర్తి- 11.46, గద్వాల- 9.23, ఆలంపూర్- 9.42, అచ్చంపేట- 8.13, కల్వకుర్తి- 11.31, కొల్లాపూర్- 10.31⏵మహబూబ్‌నగర్-10.87, జడ్చర్ల-11.32, దేవరకద్ర-12.25, నారాయణపేట-9.40, మక్తల్-8.07, షాద్‌నగర్-9.25, కొడంగల్-11.19 శాతం నమోదైంది.

News May 13, 2024

ఆలంపూర్: ఓటేసిన BRS అభ్యర్థి RSP

image

లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలంపూర్ పట్టణంలోని పోలింగ్ బూత్ నంబర్ 272లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు విధిగా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, వెంకట్ రామయ్య శెట్టి పాల్గొన్నారు.

News May 13, 2024

గద్వాల: అక్కడి ప్రజలకు డబుల్‌ ధమాకా

image

APలోని కర్నూలు పట్టణంలో TGకి సంబంధించిన అలంపూర్ నియోజకవర్గ ఓటర్లు అటు కర్నూలు ఇటు అలంపూర్‌లోనూ ఓటు వినియోగించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే APకి చెందిన వివిధ పార్టీల నాయకులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఓటర్లను నేరుగా వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. సుమారు ఆరు వేల ఓటర్లు ఇలా ఉన్నట్లు సమాచారం. ఓటేసేందుకు సైతం ఓ గంల పెంచడం ఓటు వేసేందుకు కలిసివచ్చినట్లేనని అక్కడి ప్రజలు అంటున్నారు.

News May 13, 2024

MBNR, NGKL: ఓటు వేయనున్న 34.20 లక్షల మంది

image

ఉమ్మడి జిల్లాలో నేడు 34.20 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. MBNR పరిధిలో 16,82,470, NGKL పరిధిలో 17,38,254 మంది పోలింగ్‌లో పాల్గొనున్నారు. 2 నియోజకవర్గాల్లో మొత్తం 3,993 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 15,876 మంది విధుల్లో పాల్గొంటున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో సుమారు 2లక్షలకుపైగా వలస ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటింగ్‌లో పాల్గొంటే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

MBNR: నేడే ఎంపీ ఎన్నికల ఓటింగ్.!

image

నేడు నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా ఓటు హక్కు వినియోగం, ప్రాముఖ్యతను ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కల్పించింది. కాగా.. నేడు ఉమ్మడి జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

మహబూబ్‌నగర్: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నేడు ఓటేసేందుకు రావాలని MBNR,NGKL,నారాయణపేట,గద్వా, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని, యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

News May 13, 2024

MBNR: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో 65.39 శాతం పోలింగ్ నమోదవగా.. నాగర్‌కర్నూల్ పరిధిలో 62.23 శాతం నమోదైంది. కాగా ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.