India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 65.39 శాతం పోలింగ్ నమోదవగా.. నాగర్కర్నూల్ పరిధిలో 62.23 శాతం నమోదైంది. కాగా ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ సామాజిక మాధ్యమాల్లో రాజకీయానికి సంబంధించిన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా గ్రూపుల్లో రాజకీయానికి సంబంధించిన విద్వేషపూరితంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు రాజకీయ ప్రస్తావన పోస్టులు పెట్టొద్దని సూచించారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సోమవారం జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రవినాయక్ తెలిపారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఈవీఎం, పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి పరిశీలించారు. MBNR పార్లమెంట్ పరిధిలో 1916 పోలింగ్ కేంద్రాలు, 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కొడంగల్ నియోజకవర్గం బొంరస్పేట్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పరి వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందాడు. 30 ఏళ్లుగా ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న వెంకటయ్య మరణం పత్రికా రంగానికి తీరని లోటుని టియుడబ్ల్యుజే(ఐజేయు) సంఘం రాష్ట్ర నాయకులు శ్రీకిషన్ రావు అన్నారు. వెంకటయ్య మృతి బాధాకరమని, మీడియా రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
దేశానికి సంబంధించి అత్యున్నత ఎన్నికలివి. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 296 మంది, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి 228 మంది ఓటేశారు. ఇంకా చాలామంది వృద్ధులు పోలింగ్ కేంద్రానికి రావడానికి సిద్ధం అవుతున్నారని, మన రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో (MBNR, NGKL) పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం. రేపు జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం మరువద్దని అధికారులు పిలుపునిచ్చారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా రేపు ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.
1.ఓటర్ ఐడి 2.పాస్ పోర్ట్ 3.డ్రైవింగ్ లైసెన్స్ 4.ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు గుర్తింపు కార్డులు 5.పోస్టాఫీసు పాస్ బుక్ 6.పాన్కార్డు 7.ఆర్టీజీ ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు 8.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి జాబ్ కార్డు 9.ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు10. ఫొటోతో కూడిన పింఛను పత్రం11. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు 12.ఆధార్ కార్డు, వీటిలో ఏదైనా ఒకటి చూపించి మీరు ఓటు వేయవచ్చు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు చైతన్యం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఈసీ రెండ్రోజులుగా మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అన్న సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తోంది. పనులుంటే వాయిదా వేసుకోండి.. రేపు మాత్రం ఓటు వేయండి అంటూ పిలుపునిస్తోంది.
**GO VOTE.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..”881 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అతి సమస్యాత్మకమైన 58 పోలింగ్ కేంద్రాల వద్ద బలగాలు మోహరిస్తున్నామని, పోలింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.