India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పలు అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పంచాయతీ సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ డీజిల్ మెయింటెనెన్స్, గ్రామాల్లోని తాగునీటి మోటార్ల మరమ్మతులు, వీధిలైట్ల నిర్వహణకు అప్పులు తీసుకురావాల్సిన దుస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

జోగులాంబ దేవస్థానంలో రాత్రి వీఐపీ బందోబస్తు కొరకు వచ్చిన పోలీస్ సిబ్బంది, ASI భాషాపై కుక్కలు దాడి చేయడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అలంపూర్లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, కుక్కలను నివారించాలని భక్తులు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్లే పాదయాత్ర భక్తులు వెంట తెచ్చుకున్న కుక్కలను తుంగభద్రనది, నల్లమల అడవి ఉన్నందున ఇక్కడే వదిలేస్తున్నారు. దీంతో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు అంటున్నారు.

ఉమ్మడి MBNR జిల్లాలో సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA)-1 పరీక్షలు ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు (DCEB) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 4,180 పాఠశాలల్లోని 1-10 తరగతులకు చెందని సుమారు 5,42,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.

ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తుంటారు. పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి సోమశిలదే(1993). NGKL-32, NRPT-1, MBNR-2, WNPT-4 మంది పోలీసులు చనిపోయారు. వీరిని గుర్తు చేసుకుంటూ నేటి నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా త్యాగాలను స్మరించుకుంటున్నారు.

SBI బ్యాంక్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చల్లా శ్రీనివాసులు శెట్టి దంపతులు మొదటిసారిగా వనపర్తికి వచ్చారు. వారిని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ సంతోష్, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎక్సైజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఇవాళ తాము ఏం పని చేయాల్సి వచ్చేదికాదని ఆయన తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం కూడా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం, నియోజకవర్గంలోనూ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతు రుణాలు 40% కూడా మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాలని ఎంపీ మల్లు రవి అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో గద్వాల, NGKL జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 22న పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్లో సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. సబ్సిడీ రుణాలు, ప్రభుత్వ పథకాలు, స్మాల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, బ్యాంకర్లు హాజరవుతారని తెలిపారు.

నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి సంబంధించిన స్థలాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, తదితరులు ఆదివారం పరిశీలించారు. పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి అన్ని రంగులతో భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్లు మల్లు రవి తెలిపారు.
Sorry, no posts matched your criteria.