India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి… అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, మహబూబ్నగర్ కొత్తపల్లిలో 40.0, వనపర్తి జిల్లా పానగల్లో 39.9, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 39.7, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 39.3 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మహబూబ్ నగర్ MP అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరి మాటలను ఖండించాల్సిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి నవ్వులు చిందించడం విస్మయం కలిగించిందన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL పార్లమెంట్ నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా అధికారులు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటేసి మనమేంటో చూపిద్దాం. మే 13న తరలిరండి అంటూ అధికారులు పిలుపునిచ్చారు.
సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ఈ నెల 11తో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు సమయం లేదు మిత్రమా’ అంటూ ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. పాంప్లెట్లు, న్యూస్ పేపర్లు, బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
ఓ కార్మికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. MBNR జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం శంషాబాద్కు వచ్చి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్నగర్కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్ పరిచయమయ్యాడు. ఈనెల 25న పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను బైక్పై వదిలేస్తానని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.
సార్వత్రిక సమరం 2024 తుదిదశకు చేరుకుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటు కూడా తమకే వేయాలని పార్టీ శ్రేణులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించి ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే విధంగా ఒక్కో ఓటరుకు సమయం కేటాయిస్తున్నారు.
పానగల్ మండలం కేతేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. వనపర్తి టీచర్స్ కాలనీలోని స్వగృహంలో తెల్లవారుజామున బాత్రూంకి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయి మరణించినట్లు మృతుని బంధువులు తెలిపారు. ఆయన భార్య ప్రభుత్వ టీచరే. కిరణ్ మరణంతో కేతేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
MBNR పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈనెల 13న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మూత్రశాలలు, షామీయానాలు, తాగునీరు, ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది సేవలు అందుబాటులో ఉంచనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. సొంత జిల్లాలో రెండు స్థానాలను దక్కించుకునేందుకు సీఎం వ్యూహరచన చేస్తున్నారు. MBNR, NGKL పార్లమెంటు స్థానాలు ఎంతో కీలకం కావడంతో ఆయన ఈ రెండు నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ రెండు స్థానాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని సీఎం భావిస్తున్నారు.
వేధింపులతో పెళ్లైన 2నెలలకే నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన గాయత్రి(19)కు పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. ఉపాధి కోసం HYDకి వచ్చి కర్మన్ఘాట్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితోపాటు మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లగా తల్లిదండ్రులు నచ్చజెప్పి 3రోజుల క్రితం తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఆమె ఉరేసుకుంది.
Sorry, no posts matched your criteria.