Mahbubnagar

News May 10, 2024

MBNR: హోరాహోరిగా ప్రచారం

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటులో ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు.

News May 10, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి కార్యక్రమాలు

image

✒ఓటేసి పాలమూరు అంటే ఏంటో చూపిద్దాం.. అధికారుల పిలుపు
✒నేడు పేటకు PM మోడీ.. మక్తల్ కు CM రేవంత్ రెడ్డి రాక
✒పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోండి:DEOలు
✒పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✒నేడు పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✒సరిహద్దుల్లో వాహనాల తనిఖీలపై ఫోకస్
✒వలస ఓటర్ల పై దృష్టి పెట్టిన నేతలు
✒MP ఎన్నికలు.. జోరందుకున్న ప్రచారం
✒నేటి నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ

News May 10, 2024

మారుతున్న వ్యూహాలు.. వలస ఓటర్లపై ఫోకస్

image

లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న కొద్ది నాయకులు ప్రచార వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం లెక్కలను పరిగణలోకి తీసుకుని పక్కా వ్యూహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలుపు అంచనాతో మద్దతు కూడగట్టేందుకు ఆయా పార్టీల నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలు నువ్వా..నేనా.. అన్నట్లు వలస ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

News May 10, 2024

MBNR:14న ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా

image

MBNR జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. TSKC, ప్లేస్మెంట్ సెల్ సౌజన్యంతో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఏదైనా డిగ్రీ ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, రెస్యూమ్ తో కళాశాల సెమినార్ హాల్‌లో హాజరు కావాలన్నారు.

News May 10, 2024

నేడు నారాయణపేటకు మోదీ.. మక్తల్‌కు రేవంత్

image

నేడు ఉమ్మడి జిల్లాలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటించనున్నారు. డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో మేదీ, అదే జిల్లా మక్తల్‌లో వంశీచంద్ కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇద్దరి సభలు ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. నేడు షాద్‌నగర్‌లో రేవంత్ పర్యటిస్తారు.

News May 10, 2024

MBNR: అందరికీ ఇదే సమాధానం.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ముఖ్య నేతలకు ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ప్రచారానికి వెళ్లి ఓట్లు వేయమని అడుగుతున్న అభ్యర్థులకు ఓటర్లు తెలివిగా సరే అంటూ తలూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అన్ని పార్టీల వారికి ఇదే విధమైన సమాధానాలు వస్తుండడంతో ఇంతకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో తెలియక ఇటు అభ్యర్థులు.. అటు ముఖ్యమైన నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

News May 9, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి ముఖ్యంశాలు

image

✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
✒NGKL: తేనెటీగల దాడిలో యువకుడు మృతి
✒సమస్యలపై గళం వినిపిస్తా..MPగా ఆశీర్వదించండి:బర్రెలక్క
✒రేపు పాలమూరుకు మోదీ, ప్రియాంక గాంధీ
✒NGKL: అక్రమ సంబంధం.. భార్యను చంపిన భర్త
✒ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి:CPM
✒NRPT: వాహనాల తనిఖీల్లో రూ.2,76,500 సీజ్
✒పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై అధికారుల ఫోకస్
✒కాంగ్రెస్‌లో పలువురు చేరికలు

News May 9, 2024

రేపు పాలమూరుకు మోదీ, ప్రియాంక గాంధీ

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్రవారం పాలమూరు జిల్లాకు రానున్నారు. బీజేపీ పాలమూరు అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభకు నరేంద్ర మోదీ రానున్నారు. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా షాద్ నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.

News May 9, 2024

NGKL: అక్రమ సంబంధం.. భార్యను చంపిన భర్త

image

భర్త చేతిలో భార్య మృతి చెందిన HYD వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. NGKL జిల్లా ఉయ్యాలవాడ చెందిన సతీష్, స్వాతి దంపతులు. భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈనెల 6న భార్య సతీష్‌తో గొడవ పడగా.. స్వాతి గొంతునులిమి చంపి ఫ్యానుకు ఉరేసి, పారిపోయాడు. స్వాతి పేరెంట్స్ ఆస్తి పిల్లల పేరా చేయాలని డిమాండ్ చేశారు. స్వాతి డెడ్ బాడీ ఖననం చేయకుండా ఉంచారు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

News May 9, 2024

నాగర్‌కర్నూల్‌లో నువ్వా.. నేనా..!

image

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో నువ్వా.. నేనా..? అనే రీతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, BJP అభ్యర్థి భరత్ ప్రసాద్, BRS అభ్యర్థి RSP ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు రోజులు కీలకం కానున్నాయి.