India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.

NGKL జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాలు.. వట్టిపల్లికి చెందిన ఈశ్వరయ్యను భూమి అమ్మకం విషయమై తన భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్దఅల్లుడు మల్లేశ్, మరదలు ఆశమ్మలు హత్య చేశారు. గొడ్డలితో దాడిచేసి, మర్మాంగాన్ని కత్తిరించి హతమార్చారు. మృతుడి చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI కనకయ్య గౌడ్ తెలిపారు.

ఈనెల 27, 28, 29న కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఐడీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 27న ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాలను సినిమా హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించనున్నారు. అలాగే చివరి రోజు 29న కొల్లాపూర్ పట్టణంలోని రామాపురం రహదారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆర్టిస్టులతో కొల్లాపూర్ బిజీబిజీగా కళకళలాడనుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుంచే దట్టమైన పొగ మంచుతో చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు భారీగా కురవడంతో చెరువులన్నీ నీటితో నిండాయి. ఫలితంగా చెరువుల మీదుగా చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

MBNR జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ ఇవాళ నిర్వహించిన బహిరంగ విచారణలో బీసీ సంఘాలు, మైనార్టీ వర్గాల నుంచి స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి 135 వినతులు ఆఫిడవిట్ రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన స్వాతికి రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చూయించుకుంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్డే మీల్స్లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 24న గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు సదానందం, శేఖర్ తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాంస్కృతిక సారధి ఛైర్మన్, గద్దర్ కూతురు వెన్నెల హాజరవుతారని తెలిపారు. ప్రజా సంఘాల, సామాజిక వాదులు, గద్దర్ అభిమానులు హాజరు కావాలని కోరారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా JL అభ్యర్థులుగా ఎంపికైన వారు నియామక పత్రాల జారీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా జరుగుతున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా JL అభ్యర్థుల నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్ విద్యలో నాణ్యమైన విద్య అందించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొంటున్నారు.

వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని కనిపించింది. గ్రామస్థుల వివరాలు.. పానగల్ (M) చిక్కేపల్లికి చెందిన బాలకృష్ణతో వివాహమైంది. నాగర్కర్నూల్ జిల్లాకి చెందిన ప్రశాంతి(21) భర్త వేధింపులకు పుట్టింటిలోనే ఉంటోంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త కొట్టి ఉరేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. పెద్దకొత్తపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.