India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ కుమారుడు మృతిచెందాడు. ఈ ఘటన మల్దకల్ మండలంలో బుధవారం జరిగింది. మల్దకల్ మండల మాజీ ZPTC పటేల్ అరుణ- ప్రభాకర్ రెడ్డి కుమారుడు రాంచంద్రారెడ్డి ఎర్రవల్లి నుంచి గద్వాల వెళ్తుండగా దయ్యాలవాగు వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందారు.

ఉమ్మడి MBNR నుంచి రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కోసం క్రికెట్ పోటీలు ఉంటాయని MBNR క్రికెట్ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన Way2Newsతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 18న MDCA మైదానంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్-23 ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, వైట్ డ్రెస్లో రావాలన్నారు.

గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణస్థాయిలో ఉన్న LRS క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లి లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అలంపూర్ లో 1.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

రాష్ట్ర ప్రభుత్వం శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 220 బృందాలు ప్రధానంగా గేదెలు, ఆవులు, పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. పెంపకందార్లు పశువులకు ఉచితంగా ఈ టీకాలను వేసుకోవాలని అధికారులు తెలిపారు.

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 58,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 38,499 క్యూసెక్కులు, 2 గేట్ల ద్వారా 14,128, ఎడమ కాల్వకు 1030, కుడి కాల్వకు 731,సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్టు-2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 94 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రస్తుతం 8.909 TMCల నీరు ఉంది.

పాలమూరు జిల్లాలో డ్రగ్స్ మాఫీయా విస్తరిస్తోంది. MBNR, NRPT, WNP, GDWL జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ మత్తు దందాలో యువతతో పాటు విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. గతంలో MBNRలో గంజాయి సిగరెట్లు విక్రయిస్తుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ విక్రయిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు నుంచి వినిపిస్తున్నాయి.

వనపర్తి జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కంచెలను విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రైతులకు సూచించారు. జిల్లాలో పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా రైతులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రమాద హెచ్చరికలను గుర్తించకుండా కేవలం పంటచేలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

✒GDWL:ప్రజావాణిలో పురుగు మందు తాగిన రైతు
✒బిజినేపల్లి: కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
✒21 నుంచి SA-1 పరీక్షలు: DEOలు
✒దసరా EFFECT.. మద్యం అమ్మకాల్లో 80.14 కోట్ల ఆదాయం
✒ప్రజావాణి.. సమస్యలపై దృష్టి పెట్టండి: కలెక్టర్లు
✒జూరాలకు జలాశయానికి పెరిగిన వరద
✒ప్రయాణికులతో కిక్కిరిసి పోయిన ఆర్టీసీ బస్టాండ్లు
✒రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి జిల్లాల్లో 230 మద్యం దుకాణాలు ఉండగా..రూ.80.14 కోట్ల విక్రయాలు జరిగాయి. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచుతుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభిస్తుంది. పండగకు సొంతూరు వచ్చిన బంధువులు, మిత్రులతో కలిసి జోరుగా దావత్లు చేసుకున్నారు. బీరు, విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి.
Sorry, no posts matched your criteria.