Mahbubnagar

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

♥అధికారంలోకి వస్తే కుల గణన చేస్తాం: రాహుల్ గాంధీ
♥MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్
♥ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ
♥9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ:CM రేవంత్ రెడ్డి
♥BJPని ఓడించాలి:CPM
♥ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం:కలెక్టర్లు
♥అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి:SPలు
♥ కొడంగల్: కాంగ్రెస్ లో 200 మంది చేరికలు

News May 5, 2024

రిజర్వేషన్లకు ప్రధాని మోదీ వ్యతిరేకం: రాహుల్

image

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి బహిరంగసభలో రాహుల్ మాట్లాడుతూ.. పేదల హక్కులను హరించి, ధనికులకు మేలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లు తొలగించడమేనని రాహుల్ వ్యాఖ్యనించారు.

News May 5, 2024

MBNR: బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ: చల్లా వంశీ చంద్

image

మక్తల్ పట్టణంలో ఆదివారం గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MBNR కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఎదిగితే ఓర్వలేని వ్యక్తి డీకే అరుణ అన్నారు. ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తి కాదన్నారు. గొల్ల కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

News May 5, 2024

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రజలను ఆగం చేసిందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం ఉర్కొండ మండల పరిధిలోని మాదారం‌లో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజలను నమ్మించి ముంచినందుకు ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News May 5, 2024

MBNR: గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

image

గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన జనజాతర సభలో అన్నారు. డీకే అరుణను కాంగ్రెస్సే ఎమ్మెల్యే చేసిందని, పార్టీని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్లు సంపాదించారని అన్నారు. ఈనెల 9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 5 నెలలు కాకుండానే 5గ్యారంటీ పథకాలు అమలు చేశామని, KTR పథకాలు అమలు కావడం లేదనడం విడ్డూరమన్నారు.

News May 5, 2024

సీఎం రేవంత్ రెడ్డికి ఆ 4 స్థానాలు ఎంతో కీలకం !

image

సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

News May 5, 2024

ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ.. వాహనదారులకు కీలక సూచన

image

ఎర్రవల్లిలో కాంగ్రెస్ సభ నేపథ్యంలో వాహనదారులకు గద్వాల SP రితిరాజ్ పలు సూచనలు చేశారు. గద్వాల నుంచి సభకు వచ్చే వాహనాలు ధన్వంతరి మెడికల్ షాప్ సమీపంలో ఖాళీ వెంచర్‌లో నిలుపుకోవాలన్నారు. షేక్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు వైన్ షాప్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో, కర్నూలు వైపు నుంచి వచ్చే వాహనాలు పుల్లారెడ్డి పెట్రోల్ పంపు లెఫ్ట్ సైడ్, బీచుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు ఏకశిలా స్కూల్ వద్ద పార్కు చేసుకోవాలన్నారు.

News May 5, 2024

సీనియర్ సిటిజెన్స్ ఆలోచించి ఓటు వేయాలి: డీకే అరుణ

image

సమస్యలు తెలిసి అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి కోసం వయో వృద్ధులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నానని, ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి తనను గెలిపించాలని డీకే అరుణ అభ్యర్థించారు.

News May 5, 2024

MBNR, NGKL ఎంపీ బరిలో ఏడుగురు మహిళలు

image

లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుగురు మహిళలు పోటీలో ఉన్నారు. MBNR నుంచి డీకే అరుణ, గోవిందమ్మ, విజయ, సరోజనమ్మ బరిలో నిలవగా.. NGKL నుంచి బర్రెలక్క(కర్నె శిరీష), గీత, భారతి పోటీలో ఉన్నారు. కాగా వీరిలో శిరీష(స్వతంత్ర) అత్యంత పిన్న వయస్సు(25) కాగా.. డీకే అరుణ(BJP) ఎక్కువ వయస్సు(64) ఉన్న అభ్యర్థులుగా ఉన్నారు.

News May 5, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డికి ఆ 4 స్థానాలే ఎంతో కీలకం !

image

సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాలుగు ఎంపీ స్థానాలు ఎంతో కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో MBNR, NGKL ఎంపీ స్థానాలతో పాటు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, స్నేహితుడు పోటీ చేస్తున్న భువనగిరి స్థానాలు కీలకంగా మారాయి. వారిని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.