Mahbubnagar

News May 5, 2024

MBNR: మరో వారం.. ప్రచారం జోరు

image

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్‌లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో MBNR, NGKL పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

News May 5, 2024

గద్వాల: జన జాతర సభకు సర్వం సిద్ధం..!

image

గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో నేడు జరిగే జన జాతర సభకు అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. సభావేదిక ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పార్కింగ్, హెలిపాడ్ సర్వం సిద్ధం చేశారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి ఇతర కాంగ్రెస్ ప్రముఖులు హాజరుకానున్నారు.

News May 5, 2024

MBNR: నేడు నీట్ పరీక్ష.. రూల్స్ ఇవే..

image

నీట్- 2024 పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అధికారుల సూచనలు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని, ఆభరణాలు కూడా ధరించి రావొద్దన్నారు. హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ మాత్రమే ధరించాలని, బూట్లు కాకుండా స్లిప్పర్లు మాత్రమే వేసుకోవాలి. కేంద్రాల్లో నిర్వాహకులే పెన్నులు ఇస్తారని చెప్పారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.

News May 5, 2024

హోం ఓటింగ్‌కు 1,026 మందే దరఖాస్తు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు మొత్తం 1028 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానం పరిధిలో 539 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్దులు 296 మంది, దివ్యాంగులు 243 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో 487 మంది దరఖాస్తు చేసుకోగా అందులో వృద్ధులు 228, దివ్యాంగులు 259 మంది ఉన్నారు.

News May 5, 2024

PU డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పరీక్షల టైం టేబుల్ విడుదల చేశారు. 2వ, 4వ సెమిస్టర్ పరీక్ష ఉదయం 9:30 నుంచి మ.12:30 గంటల వరకు, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా. 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

News May 5, 2024

ఇది ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్ రెడ్డి

image

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో చూపించే ఎన్నిక అని మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. “ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక, కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS పదేళ్లు అధికారంలో ఉండి మనల్ని బానిసలుగా చూశారని, పాలమూరు పౌరుషాన్ని చూపాలని, 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని” కోరారు.

News May 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔GDWL: నేడు ఎర్రవల్లిలో జన జాతర.. హాజరుకానున్న రాహుల్ గాంధీ,CM రేవంత్ రెడ్డి
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ
✔త్రాగునీటి సమస్యలపై ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్టులు.. కొనసాగుతున్న తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేడు పలువురు కాంగ్రెస్, BJPలో చేరికలు
✔MP ఎన్నికలు.. సోషల్ మీడియాపై అధికారుల దృష్టి
✔’సమ్మర్ క్రికెట్ శిబిరాల’పై నజర్

News May 5, 2024

పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు: సీఎం

image

పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన డీకే అరుణ పాలమూరు పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారని విమర్శించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డీకే అరుణ ఎందుకు అడగలేదన్నారు

News May 5, 2024

MBNR: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

image

రాష్ట్రానికి యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 2004-14 మధ్య యూపీఏ, 2014-24 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ రాశారు. కొడంగల్లో లేదా అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావాలన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.