India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు గద్వాల జిల్లా ఎర్రవల్లిలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో సాయంత్రం 3.45కి సభా ప్రాంగణానికి రానున్నట్లు సంపత్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మంది జనసమీకరణకు నేతలు ప్లాన్ చేశారు. హైవే సమీపంలో సభ ఉన్నందున వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని అధికారులకు ఎస్పీ రితిరాజ్ సూచించారు.
మోదీ తెచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో సీఎం మాట్లాడుతూ..”గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా.. పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరు. పాలమూరు జిల్లాలో బీజేపీ పాతరేయాలి. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్ కోరారు.
పోస్టల్ ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఎన్నికల విధులకు వెళ్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట గురుకుల సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని రెండవ రోజు శనివారం పరిశీలించారు. పొరపాట్లు జరగకుండా ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నమోదైన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు.
పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, భద్రత ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ఇబ్బందులు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, స్ట్రాంగ్ రూం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
పాలమూరు బిడ్డను సీఎం కుర్చీ నుంచి దింపడానికి ఢిల్లీ నుంచి కొంతమంది గొడ్డలితో బయలుదేరారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినందుకా కాంగ్రెస్ పార్టీని ఓడించమంటున్నారు ప్రశ్నించారు.
✏పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే:CM రేవంత్ రెడ్డి
✏చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా:DK అరుణ
✏నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్ శ్రీ హర్ష
✏NGKL:ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి!
✏పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✏BJP మతం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది:కాంగ్రెస్
✏GDWL:బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
✏SSC విద్యార్థులపై ఫోకస్
షాద్నగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. కిషన్ నగర్ గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయి అతడు కింద పడినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి మధ్య పోరు జరుగుతోందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్తో కలిసి ప్రయాణించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ను గెలిపించాలన్నారు.
గద్వాలలోని లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన రంగస్వామి లింగం బావిలో ఈత కొట్టేందుకు పైనుంచి దూకాడు. ప్రమాదవశాత్తు తలకు గాయమైంది. దీంతో అతడు బావిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
మహబూబ్నగర్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ‘మహబూబ్నగర్లో లక్ష మెజారిటీతో వంశీచంద్ రెడ్డి గెలవడం ఖాయం. వారసత్వంగా నేను రాజకీయాలు చేయడం లేదు. గతంలో వనపర్తిలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీగల్లీ తిరిగా. పాలమూరులో 14 సీట్లకు 12 ఇచ్చి ఆశీర్వదించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.