Mahbubnagar

News May 4, 2024

షాద్‌నగర్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

షాద్‌నగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. కిషన్ నగర్ గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించారు. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయి అతడు కింద పడినట్లు తెలుస్తోంది.

News May 4, 2024

10ఏళ్ల నిజానికి.. 100 రోజుల అబద్ధానికి మధ్య పోరు: ఎమ్మెల్సీ చల్లా

image

రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి మధ్య పోరు జరుగుతోందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌తో కలిసి ప్రయాణించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్‌ను గెలిపించాలన్నారు.

News May 4, 2024

లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

గద్వాలలోని లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన రంగస్వామి లింగం బావిలో ఈత కొట్టేందుకు పైనుంచి దూకాడు. ప్రమాదవశాత్తు తలకు గాయమైంది. దీంతో అతడు బావిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

News May 4, 2024

పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సీఎం రేవంత్

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్‌లో లక్ష మెజారిటీతో వంశీచంద్ రెడ్డి గెలవడం ఖాయం. వారసత్వంగా నేను రాజకీయాలు చేయడం లేదు. గతంలో వనపర్తిలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీగల్లీ తిరిగా. పాలమూరులో 14 సీట్లకు 12 ఇచ్చి ఆశీర్వదించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

News May 4, 2024

నర్వ మండల వైద్యాధికారిని సస్సెండ్ చేసిన కలెక్టర్

image

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్వ మండల వైద్యాధికారి డాక్టర్ కేశవ్‌ను విధుల నుంచి సస్సెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష శనివారం తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిన మండల వైద్యాధికారిగా ఉన్న కేశవ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారని, విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో సస్సెండ్ చేసినట్లు చెప్పారు. ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

News May 4, 2024

నాగర్‌కర్నూల్: ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి !

image

ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో శనివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. వంగూరు మండలానికి చెందిన వెంకటేశ్(28), జిల్లెల్ల గ్రామానికి చెందిన రాములు(29) బైక్‌పై కల్వకుర్తి వైపు నుంచి వెళ్తున్నారు. ఈ క్రమంలో తాండ్ర గ్రామ చౌరస్తాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 4, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు !

image

ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే అయినప్పటికీ తమ అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో చెమటలోడుస్తున్నారు. ఈ వారం రోజుల్లో పడే శ్రమ, వ్యూహరచన కీలకం కావడంతో ఆయా అభ్యర్థులు, నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

News May 4, 2024

MBNR: ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే

image

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్లజాబితా ప్రకారం MBNRలో 50.53, NGKLలో 50.24 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు

News May 4, 2024

MBNR: భానుడి భగభగలు.. వీటికి ఫుల్ డిమాండ్

image

భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రతీ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై పలు ప్రాంతాలు రెడ్‌జోన్ లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాలుగా యత్నిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలను తాగు తుండగా, ఎక్కువ మంది తాటి ముంజలను తినేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలోనే ప్రత్యేకంగా లభించే తాటి ముంజలకు జిల్లాలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.

News May 4, 2024

MBNR: మండే ఎండలో రాజకీయ కాక.!!

image

ఉమ్మడి జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే.. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. ఉమ్మడి పాలమూరులోని NGKL, MBNR పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.