Mahbubnagar

News November 7, 2024

మహబూబ్‌నగర్: LOVE FAIL యువకుడి SUICIDE

image

లవ్‌లో ఫెయిల్ అయిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన HYD అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన సాయి కుమార్ (19) ఎలక్ట్రిషన్‌గా పని చేస్తూ చదువుకుంటున్నాడు. కాగా, కొద్ది రోజులుగా లవ్ ఫెయిల్ అయ్యి డిప్రెషన్‌లో ఉన్నాడని, అదే బాధతో ఉరేసుకున్నట్లు తెలిపారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2024

గద్వాల: కూతురికి వేధింపులు.. తండ్రి సూసైడ్

image

కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని ఓ తండ్రి ట్రైన్ కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాలలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. మండలానికి చెందిన పరుశురాములు కూతురిని వినోద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడిని పలు మార్లు మందలించినా మారలేదు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన పరుశురాములు వెంకంపేట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

News November 7, 2024

MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 7, 2024

MBNR: సీఎం సహాయ నిధికి విరాళం అందజేత

image

రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS

image

✔ఘనంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
✔నేటి నుంచి ప్రారంభమైన కులగణన సర్వే
✔వేరుశనగ ధర గిట్టుబాటు కాకపోవడం: రైతులు
✔లండన్‌లో పర్యటిస్తున్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
✔మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలమూరు నేతలు
✔రోడ్లపై ధాన్యాన్ని పోసి ప్రమాదాలకు కారణం కాకూడదు: SIలు
✔దామరగిద్ద:గుండెపోటుతో సీనియర్ అసిస్టెంట్ మృతి
✔తప్పులు లేకుండా సర్వే చేయండి:కలెక్టర్లు

News November 6, 2024

MBNR: అంబులెన్స్‌లో EMTగా ఉద్యోగ అవకాశాలు

image

జిల్లాలోని 108 అంబులెన్స్‌లో మెడికల్ టెక్నీషియన్స్ కోసం ఈ నెల 9న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ రవికుమార్ తెలిపారు. BSc-BZC, BSC Nursing, ANM, GNM, B-Pam, D-Pam, DMLT, MLT ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. 9న ఉ:10:00 నుంచి మ:3:00 వరకు జడ్చర్ల MPDO కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఒరిజినల్, జిరాక్స్‌ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.

News November 6, 2024

MBNR: సీఎం సహాయ నిధికి విరాళం అందజేత

image

రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ చైర్మన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ చైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2024

వనపర్తి: ఇంటర్ పరీక్షల ఫీజులు చెల్లించండి

image

వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఫీజులు చెల్లించాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య తెలిపారు. ఇవాళ నుంచి 26 వరకు ఎలాంటి అదనపు రుసుముల లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆయన అన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాలలో వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.

News November 6, 2024

MBNR: లండన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు

image

లండన్ నగరంలో 7, 8 తేదీలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెళ్లారు. నల్లమలలోని ప్రకృతి పర్యటక ప్రాంతాలపై, కృష్ణానది పరవళ్లు, పర్యాటకులను ఆకర్షిస్తాయని వివరించారు.

News November 6, 2024

8 తేదీన కొండారెడ్డిపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి 

image

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి ఈ నెల 8 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.