Mahbubnagar

News May 4, 2024

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం: ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

image

పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. ‘పార్లమెంట్ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్ ఐటీ హబ్ లను డెవలప్ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్ స్కూల్ ను మంజూరు చేయిస్తా’ అని తెలిపారు.

News May 4, 2024

ఉమ్మడి పాలమూరుకు అధినేతల రాక

image

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈనెల 5న AICC అగ్రనేత రాహుల్‌ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని మోదీ ఈనెల10న NRPTకు రానున్నారు. నేడు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించనున్న కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

News May 4, 2024

MBNR, NGKL ఎంపీ అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇలా..!

image

MBNR ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) విద్యార్హత ఇంటర్ కాగా.. BJP అభ్యర్థి డీకే అరుణ ఎస్ఎస్సీ చదివారు. NGKL లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి MBBS చేయగా.. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చదివారు. BRS అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేశారు. ఈ మేరకు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News May 4, 2024

పెబ్బేరు: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్

image

భార్యాభర్తలు గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI వెంకటేశ్వర్లు వివరాలు.. గోపాల్‌పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు HYDలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్లీ గొడవ పడ్డారు. భర్త మనస్తాపంతో నిన్న ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.

News May 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు కొత్తకోటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
✔నేడు సమీక్ష.. రేపు నీట్ ప్రవేశ పరీక్ష
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ చిట్టిల పంపిణీ
✔కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
✔SSC సప్లమెంటరీ పరీక్షలపై అధికారుల ఫోకస్
✔పలుచోట్ల కేంద్ర బలాలతో కవాతు
✔పకడ్బందీగా కొనసాగుతున్న తనిఖీలు
✔ఎంపీ ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన నేతలు

News May 4, 2024

MBNR: నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో నిర్వహించనున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. MBNR పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో బహిరంగ సభ తర్వాత ఇదే పార్లమెంట్ పరిధిలోని కొత్తకోటలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.

News May 4, 2024

జిల్లాలు కుదిస్తే ఉద్యమం: ప్రవీణ్ కుమార్

image

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 33 జిల్లాలను 15 జిల్లాలకు కుదించాలన్న ఆలోచన ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని BRS ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. NGKL పార్టీ ఆఫీసులో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పాలన సౌలభ్యం కోసం KCR 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జిల్లాలను కుదించాలనడం సరికాదన్నారు. జిల్లాల కుదింపు జరిగితే కొత్త సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

News May 4, 2024

NRPT: ‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి’

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం నారాయణపేట గురుకుల పాఠశాలలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అప్పటి వరకు నమోదైన ఓట్ల వివరాలను పిఓ, ఏపిఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 4, 2024

MBNR: జిల్లాల వారీగా ‘TET’ అప్లికేషన్లు ఇలా..

image

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024కు శుక్రవారం అధికారులు పరీక్ష షెడ్యూలు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..✒మహబూబ్ నగర్: పేపర్-1కు 4,297, పేపర్-2కు 7,688✒నాగర్ కర్నూల్: పేపర్-1కు 4,453, పేపర్-2కు 6,023✒నారాయణపేట: పేపర్-1కు 3,262,పేపర్-2కు 3,446✒గద్వాల్: పేపర్-1కు 3,036,పేపర్-2కు 3,581✒వనపర్తి: పేపర్-1కు 2,560, పేపర్-2కు 5,211 అప్లికేషన్లు వచ్చాయన్నారు.

News May 3, 2024

MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!

image

లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.