Mahbubnagar

News May 3, 2024

ఉమ్మడి జిల్లాలో TODAY TOP NEWS

image

✒MPఎన్నికలు.. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SPలు
✒BJPని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యం:CPI
✒భగ్గుమన్న పాలమూరు.. పెరుగుతున్న ఎండలు
✒నిరుద్యోగ, ప్రజాసమస్యలు పరిష్కరిస్తా: బర్రెలక్క
✒MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు
✒ఏర్పాట్లు పూర్తి.. రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒GDWL: సీఎం, రాహుల్ పర్యటన కోసం హెలిపాడ్ స్థల పరిశీలన
✒పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్లు

News May 3, 2024

అంతర్జాతీయ మార్కెట్లో కొల్లాపూర్ మామిడి పండ్లకు డిమాండ్

image

కొల్లాపూర్ సంస్థానాధీశులు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని(రాజుగారి) పెద్దతోట, చుక్కాయిపల్లి క్రిష్ణ విలాస్ లో మామిడి తోటల సాగును ప్రారంభించారు. APలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తెచ్చిన మామిడి మొక్కలు.. కొల్లాపూర్ ప్రాంతం నేల, వాతావరణంలో కాయలు నాణ్యంగా, మంచి పరిమాణంతో పెరిగి, తీపిగా,ఆకర్షణీయంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.

News May 3, 2024

పద్మశ్రీ మొగిలయ్యకు పెన్షన్ చెల్లిస్తున్నాం: CM సీపీఆర్వో

image

ఉమ్మడి పాలమూరుకు చెందిన పద్మశ్రీ మొగిలయ్యకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సీపీఆర్వో అయోధ్య రెడ్డి తెలిపారు. మార్చి 31న కూడా ఆయన ఖాతాలో రూ.20 వేల పెన్షన్ జమ అయినట్లు Xలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్లో పెన్షన్ కొంచెం ఆలస్యం అవుతుందని మొగిలయ్యకు ముందే ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు.

News May 3, 2024

NRPT: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, x, ఇతర సోషల్ మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు, మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని అన్నారు.

News May 3, 2024

భగ్గుమన్న పాలమూరు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తీవ్రతతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. గద్వాలలో 45.7, నారాయణపేట 45.2, మహబూబ్‌నగర్‌లో 45.1, వనపర్తిలో 44.8 డిగ్రీలు రికార్డు అయింది. వచ్చే 3రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. మ‌ధ్యాహ్నం సమయంలో బ‌య‌ట‌కు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.

News May 3, 2024

MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.

News May 3, 2024

MBNR: ‘బూత్‌ల వారీగా బీజేపీ సమావేశాలు’

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల BJP నేతలు బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు నియోజకవర్గాల నేతలతో ఇటీవల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మోదీ పథకాలను వివరించాలన్నారు. పోలింగ్‌కు తేదీ దగ్గర పడుతుందని, రాబోయే రోజులు మరింత కీలకమని, అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా ఆ పార్టీ నేతలకు సూచించారు.

News May 3, 2024

MBNR: ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ FOCUS.!

image

ఉమ్మడి పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం MBNR పరిధిలో 4 సార్లు, NGKL పరిధిలో ఒకసారి పర్యటించారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ MLAలకు ఆమె దిశానిర్దేశం చేశారు.

News May 3, 2024

ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిపించండి: డీకే అరుణ

image

ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. శుక్రవారం ఆమె మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు.

News May 3, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో భానుడి భగభగ

image

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 46.0, కొల్లాపూర్ 46.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. వెల్దండ, కల్వకుర్తి, జడ్చర్ల, సీసీకుంట, ధన్వాడ, కృష్ణా, కొత్తపల్లి, వడ్డేపల్లి, అయిజ, అలంపూర్ మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై.. రెడ్ అలర్ట్‌కు చేరింది.