India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా కార్యక్రమం జరగనుంది. మరికాసేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆందోళన చేపట్టనున్నారు. మరోవైపు రైతు రుణమాఫీపై కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నేతల ధర్నాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కడ్తాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం విధులలో చేరిన ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో ఇబ్బంది పడడంతో ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అతను కల్వకుర్తి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించారు.
NGKL: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల వల్ల ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 6న ప్రచురిస్తారు. జాబితాపై 13 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తొమ్మిది పది తేదీలలో రాజకీయ పార్టీల సూచనలు తీసుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో మహిళపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, పోక్సో, అదృశ్యం జనవరి నుంచి కేసుల నమోదు వివరాలు. మహబూబ్నగర్లో 406, వనపర్తిలో 230, గద్వాల జిల్లాలో 157, నారాయణపేట్ 152, నాగర్ కర్నూల్లో 96 పోక్సో, అత్యాచారం, అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చట్టాలు కఠినంగా అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి గొంతు కోసి పరారైన ఘటన MBNR పట్టణంలో జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. శ్రీనివాస్ కాలనీకి చెందిన బాలిక ప్రైవేటు పాఠశాలలు 5వ తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పిల్లలతో కలిసి పార్కులో ఆడుకుంటోంది. అనంతరం ఇంటికి వచ్చింది. ఇంట్లో వారు కోడి రాలేదని వెతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. కేసు నమోదైంది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి 57, 500 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగిందని, 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా 20,760, విద్యుదుత్పత్తి నిమిత్తం 39,442 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి మొత్తం 62,264 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.296 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..నిర్దేశించిన సమయంలోగా చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని, మినీ ట్యాంక్ బండ్ ను దగ్గరలోఉన్న కాల్వ ద్వారా కృష్ణ నీటితో నింపాలని సూచించారు.
పాము కాటుకు బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం ఇటిక్యాల మండలం గోపాలదిన్నెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేణుగోపాల్ (9) మంగళవారం రాత్రి పడుకున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ల సలహాతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
✏నేతలు ఓటరు జాబితా సవరణకు సహకరించండి:MROలు
✏MBNR,NGKL జిల్లాల్లో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✏పిల్లలమర్రిని పునః ప్రారంభించిన మంత్రి జూపల్లి
✏బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
✏భారత్ బంద్.. పలు నాయకులు అరెస్టు
✏కలకత్తా అత్యాచార ఘటన.. పలుచోట్ల నిరసన
✏వనపర్తి:కరెంట్ షాక్తో.. మహిళా మృతి
✏బస్సులో పుట్టిన ఆడబిడ్డకు జీవితకాల బస్పాస్ అందజేత
✏స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోండి:DEOలు
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రేపు ఉదయం నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో MBNR,NGKL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. నేడు ఉదయం పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు.
Sorry, no posts matched your criteria.