Mahbubnagar

News May 3, 2024

MBNR: పీయూ సిబ్బంది పరీక్ష వాయిదా

image

పాలమూరు విశ్వవిద్యాలయం(పీయూ)లో పనిచేస్తున్న తాత్కాలిక బోధనేతర ఉద్యోగులకు నిర్వహిస్తామన్న పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 19న అధికారులు పీయూ బోధనేతర సిబ్బందికి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన పరీక్షలను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొంటూ పీయూ అధికారులు మరో సర్క్యులర్ జారీ చేశారు.

News May 3, 2024

రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి, ఇతర అధికారులు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ సమీపంలో హెలికాప్టర్ దిగే అవకాశాలను పరిశీలించారు. అనంతరం సంకిరెడ్డి‌పల్లి గుంపుగట్టు వద్ద పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

News May 3, 2024

MBNR, NGKL నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు ఇలా..

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.

News May 3, 2024

MBNR: మందుబాబులకు బ్యాడ్ న్యూస్..

image

మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్‌లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,02,961 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో-స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత బీర్ల కొరత ఉండనుంది.

News May 3, 2024

MBNR: సప్లమెంటరీ ఫీజు చెల్లించేదుకు గడువు పెంపు

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ ఫీజు చెల్లింపునకు గడువు పెంచింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల నాలుగో తేదీ వరకు ఫీజు చెల్లింపు చేయవచ్చని ఈరోజు ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించారు.

News May 2, 2024

తండాలను పంచాయతీలు చేసిన ఘనత KCRదే: ప్రవీణ్ కుమార్

image

తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత KCRకే దక్కుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ హాయంలోనే జరిగిందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి దక్కలేదని మండిపడ్డారు.

News May 2, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్
✒అదనపు EVMలు సిద్ధం:కలెక్టర్లు
✒NGKL:గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త
✒KCR ప్రచారాన్ని నిషేధిస్తే BRS ప్రభంజనం ఆగదు:RSP
✒BJP గెలిస్తే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం: మల్లు రవి
✒పలుచోట్ల వడదెబ్బపై అవగాహన
✒ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి:DK అరుణ
✒BJP అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ప్రమాదం:కోదండరాం
✒పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు: కలెక్టర్లు

News May 2, 2024

MBNR: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త !

image

ఉమ్మడి జిల్లాలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీసు సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు, పోస్టులు నమోదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటారు.

News May 2, 2024

MBNR: మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు అలెర్ట్‌

image

ఉమ్మడి జిల్లాలో భానుడి తాపానికి జనం వణికిపోతున్నారు. 2రోజులుగా జిల్లాలో 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

News May 2, 2024

కేసీఆర్ ప్రచారాన్ని నిషేధిస్తే BRS ప్రభంజనం ఆగదు: ప్రవీణ్ కుమార్

image

BRS అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటలు నిషేధిస్తే BRS ప్రచార ప్రభంజనం ఆగదని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమనగల్‌లో నిర్వహించిన బంజారా గర్జన సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. KCR తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అన్నారు. ఎన్నికల సంఘం పున:పరిశీలించి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.