India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 45.1, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 44.8, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 44.6, వనపర్తి జిల్లా మదనపూర్ లో 44.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
‘ఒక్క కేసీఆర్ గొంతు నొక్కితే లక్షలాది గొంతుకలై ప్రశ్నిస్తాం. 48 గంటలు నిషేధిస్తే నలుదిక్కులా పిక్కటిల్లేలా ప్రచారం చేస్తాం’ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నినదించారు. శ్రీరంగాపూర్లో కార్యకర్తలలో ఉత్సాహం నింపుతూ ప్రజలతో మమేకమై ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి రేవంత్ రెడ్డి, మోదీకి కళ్లు మండుతున్నాయని విమర్శించారు.
బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని అన్నారు. మేధావులు ఉద్యోగులు ఈ సంఘాల నాయకులు మైనార్టీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచార జోరు కనిపించడం లేదు. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తాల్సిన గ్రామాలు, పట్టణాల్లో ఆ హడావుడి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలే. ఈ ప్రభావం ఎన్నికల ప్రచారంపై పడుతోంది. ఫలితంగా ప్రచారాన్ని ఉ.10 గం.కు ముగిస్తున్నారు . మళ్లీ సా.4 గంటల తరువాత ముందుకొస్తున్నారు. లోక్ సభ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.
మద్యం మత్తులో అతి కిరాతకంగా భార్య గొంతు కోసి చంపిన ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాములు మద్యానికి బానిసై తరచూ జ్యోతితో గొడవ పడేవాడు. దీంతో ఉదయం కూడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో భార్య జ్యోతిని అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో అంతంతమాత్రంగా ప్రచారం ఉండటంతో ఓటరు నాడి అందడం లేదు.MBNR,NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండటం ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవటం కోసం BJP,ఎట్టకేలకు వచ్చిన అధికారంపై పట్టు సాధించాలంటే సత్తా చాటుకోవడం కాంగ్రెస్,పూర్వవైభవం తెచ్చుకోవడం కోసం BRS,ఈ పరిస్థితుల్లో ఓటరు గుంభనంగా ఉండటం పార్టీలకు ఎండవేడిమితో పాటు రాజకీయ ఉక్కపోత కల్పిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. నాగర్ కర్నూల్ సెగ్మెంట్ను ఎస్సీలకు రిజర్వు చేశారు. 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నాగర్ కర్నూల్ 1962 నుంచి లోక్ సభ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా తొమ్మిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, నాలుగు సార్లు టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులు గెలుపొందారు.
మహబూబ్ నగర్ ఐటీ పార్క్ పరిధిలో నెలకొల్పిన అమర రాజా లిథియం బ్యాటరీ కంపెనీని ఎత్తి వేయాలని ప్రజలు చేపట్టిన నిరసన దీక్షకు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ బుధవారం రాత్రి తన మద్దతు ప్రకటించారు. దివిటిపల్లి, సిద్దయ్యపల్లి, ఎదిర, అంబట్ పల్లి గ్రామల ప్రజలు ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఎదిర గ్రామ కేంద్రంగా గత 49 రోజులుగా శాంతియుత నిరసన దీక్ష చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమ వద్దు అంటున్నారు.
పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పది రోజులే కీలకంగా కానున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ప్రచారాల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ పది రోజులు కీలకం కావడంతో అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచి ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఈ కొన్ని రోజుల ప్రచారాలు మరో ఎత్తుగా సాగనుంది.
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రతి ఓటరుకు ఓటు స్లిప్ అందించాలని, వృద్ధులకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సంబందిత అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.