India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్కు గురువారం వివిధ గ్రామాల నుంచి 23 మంది రైతులు 418 క్వింటాళ్ల మొక్కజొన్నను అమ్మకానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వరకు టెండర్ ప్రక్రియ పూర్తవ్వగా.. గరిష్ఠంగా రూ.2,439, కనిష్ఠంగా రూ.1,969, సగటున రూ.2,437 ధరలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారీ వర్షం పడటంతో మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు 200 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసిపోయిందని అంచనా.

స్థానిక ఎన్నికల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 23,22,054 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 11,54,128 మంది ఉండగా..11,67,893 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 13,765 మంది అధికంగా ఉన్నారు.
1.మహబూబ్ నగర్- 5,16,183
2.నాగర్ కర్నూల్- 6,46,407
3.నారాయణపేట- 4,03,748
4.గద్వాల్- 3,88,195
5.వనపర్తి- 3,67,521

కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో సోషల్ స్టడీస్లో 2వ ర్యాంక్, VKB జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అదే విధంగా ఇటీవలే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగంతో సత్తా చాటాడు. 4 ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.

దసరా సెలవులకు వేరే వుళ్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయాలని, ఇళ్లలో విలువైన ఆభరణాలు, డబ్బులు వుంచారదని, ఇంటి బయట 24 గంటలు లైట్లు వెలిగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో దొంగలు చేతివాటం చూపుతారని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని అన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి,వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.

వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధుల్లో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.

ఈ నెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి CM కప్ పోటీలు ప్రారంభిస్తామని సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి వెల్లడించారు. ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 21 నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు, 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు, NOV 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. NOV 28 నుంచి DEC 5వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 84 బ్లడ్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి జయచంద్ర మోహన్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. A+(ve) 11, A- (ve) 06, B+(ve) 19, B-(ve) 00, O+(ve) 37, O-(ve) 01, AB+(ve) 09, AB-(ve) 01 ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని NGKL కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.

జాతీయ రహదారి 44 వేముల వద్ద రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. పైపు లైన్ల మార్పులు కారణంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాలకు మూసాపేట మండలంలోని 20 గ్రామాలకు మూడు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు జిల్లా మిషన్ భగీరథ కార్యనిర్వహక ఇంజినీర్ పి.వెంకట్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.