Mahbubnagar

News August 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒JLMలకు ప్రమోషన్లు..CM,Deputy CM
చిత్రపటాలకు పాలాభిషేకం
✒ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా కల్పించాలి:RSP
✒బస్సులో డెలివరీ.. కండక్టర్‌ను సన్మానించిన సజ్జనార్
✒భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లు
✒CM ఇలాకాలో పాట రూపంలో రైతు ఆవేదన
✒ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
✒22న ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు
✒F-1 మార్కుల నమోదుకు చర్యలు:DEOలు
✒కోల్‌కతా ఘటన.. పలుచోట్ల నిరసన

News August 20, 2024

GDWL: BC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి !

image

గద్వాల్ జిల్లాలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కొరకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు బిసి స్టడీ సర్కిల్ కె రాములు తెలిపారు. స్వయం ఉపాధి శిక్షణ కొరకు బీసీ నిరుద్యోగ యువతి, యువకులు ఆన్లైన్ www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ లో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు HYDలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు.

News August 20, 2024

మహబూబ్‌నగర్ RTC రీజియన్ ఆల్ టైం రికార్డ్

image

రాఖీ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ RTC చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. రాఖీ పండుగ రోజున మొత్తంగా 3.71 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరగగా, 2.88 కోట్ల రాబడిని ఆర్టీసీ రాబట్టిందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి వెల్లడించారు. మొత్తంగా 5.88 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. డిపోలోనే రాఖీ పండగ కార్యక్రమం విజయవంతమైందన్నారు.

News August 20, 2024

MBNR: పరీక్ష పెట్టారు.. ఏడాదైనా బహుమతులు రాలే !

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పేరుతో గతేడాది జూలై 2, 3, 4, 8, 9తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. కానీ ఈరోజు వరకు పరీక్షలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించలేదు. ఈ పరీక్షలో మొదటి బహుమతిగా ల్యాప్టాప్, రెండో బహుమతిగా స్మార్ట్ ఫోన్, మూడో బహుమతిగా టాబ్లెట్, ప్రతి నియోజకవర్గంలో మహిళ టాపర్‌కు స్కూటీ ప్రకటించారు.

News August 20, 2024

నవబ్రహ్మ ఆలయాలపై కేంద్ర బృందం రీసర్చ్ !

image

7వ శతాబ్దాలనాటి అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలపై ఆర్కియాలజికల్ కేంద్ర అధ్యయన బృందం మంగళవారం అలంపూర్ సందర్శించింది. ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ మహాలక్ష్మీ బృందం నవబ్రహ్మ ఆలయాలను సందర్శించి ఇక్కడి అర్కిటెక్చర్, శాసనాలు సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో అలంపూర్ ఆలయాలు సంతృప్తినిచ్చాయన్నారు. ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు.

News August 20, 2024

బస్సులో ప్రసవం.. కండక్టర్, నర్సుపై ప్రశంసల వెల్లువ❤

image

బస్సులో ప్రయాణం చేస్తుండగా గర్భిణి సంధ్యకు కండక్టర్, నర్సు ప్రసవం చేశారు. దీంతో మంత్రి పొన్నం, RTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అభినందించారు. ఈ సందర్భంగా కండక్టర్ భారతి మాట్లాడుతూ.. జీవితంలో ఈ ఘటన గుర్తుండిపోతుందని, స్టాఫ్ నర్సు అలివేలు మాట్లాడుతూ.. కాన్పు చేసేందుకు గ్లాసులు లేకపోయినా వెనకాడ లేదని, పాప తల, మెడకు పేగు చుట్టుకొని ఉంది. జాగ్రత్తగా తీసి సుఖ ప్రసవం చేశామన్నారు.

News August 20, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ఐజలో 133.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 131.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 13.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో ఏటి 9.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్లో 67.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 20, 2024

నందిగామ: రైలు పట్టాలపై యువకుడు సూసైడ్

image

రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఖాజా(23) నందిగామ సమీపంలోని రైలు పట్టాపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మృతుడి తల కొద్ది దూరంలో ఎగిరి పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 20, 2024

UPDATE: జూరాలకు పెరిగిన వరద!

image

జూరాల జలాశయంలోకి వరద పెరుగుతోంది. 48,500 క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు జలవిద్యుదుత్పత్తి ద్వారా 39,907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 5.343 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 19వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 20వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.

News August 20, 2024

UPDATE: జూరాలకు పెరిగిన వరద!

image

జూరాల జలాశయంలోకి వరద పెరుగుతోంది. 48,500 క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు జలవిద్యుదుత్పత్తి ద్వారా 39,907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 5.343 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 19వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 20వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.