India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
❤ఉమ్మడి జిల్లా ఖోఖో సబ్ జూనియర్స్ బాల,బాలికల జట్లు ఎంపిక
❤ఆత్మకూరు: పందికి పాలు పట్టించిన ఆవు❤దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం❤BSC డిప్లమాలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి
❤MBNR:దొంగతనానికి వెళ్లి ఇద్దరు దుర్మరణం
❤కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:BJP
❤GDWL:Way2News ఎఫెక్ట్.. ప్రమాదకర విద్యుత్ వైర్లు తొలగింపు
❤కార్మికుల బకాయిలు చెల్లించండి:AITUC
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ స్టేజి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. దేవరకద్ర PACS ఛైర్మన్ నరేందర్ రెడ్డి గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినపడగా పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూశారు. చీమలు పట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి SI నాగన్న, అంగన్వాడీ టీచర్ చేరుకుని నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. పాలమూరు జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో గడిచిన 12 నెలల్లో 930 ఆత్మహత్యకు పాల్పడ్డారంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్ఫ్రీ నంబర్లను, యాప్లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్లు ఉన్నాయి. SHARE IT
దొంగతనానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మిడ్జిల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోయిన్పల్లిలోని ప్రగతి సోలార్ ప్లాంట్లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో యాజమాన్యం కంచెకు విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో కషాయ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నేడు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. దేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రతి కార్యకర్త 200 మందిని సభ్యత్వంలో చేర్పించాలని అన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.