India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో NSS-2025(జాతీయ సేవా పథకం) దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) జిఎన్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ వాలంటరీలతో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, NSS సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ కే.ప్రవీణ, అధ్యాపకులు, వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ (ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్) 2025-26లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఉమెన్ PC రాధిక కాంస్య పతకం సాధించింది. హరియాణాలో ఈనెల 20 నుంచి 24 జరుగుతున్న క్రీడలలో తెలంగాణ పోలీస్ మహిళా ఆర్మ్ రెజ్లింగ్ క్రీడాకారిణి రాధికా (WPC పోలీస్ స్టేషన్ అడ్డకల్, MBNR) 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించింది. SP డి.జానకి ఆమెను ప్రశంసించారు.
#CONGRATULATIONS

మహబూబ్నగర్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఈ నెల 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. మూడు ప్రైవేటు సంస్థల్లో 200 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన 18-30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మాజీ కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి అసభ్య పదజాలాలతో తనను దూషించారని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆధారాలతో కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ మీడియాకు తెలిపారు. మాజీ కౌన్సిలర్ రవికిషన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు, చట్టప్రకారం ముందుకు వెళ్తామని మహబూబ్నగర్ వన్ టౌ సీఐ అప్పయ్య పేర్కొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో రేపు NSS-2025(జాతీయ సేవా పథకం) దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి (VC) ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. NSS ఛైర్మన్ డాక్టర్ సిహెచ్ రవికాంత్ హాజరుకానున్నారు.

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ ఆర్చరి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటి PD డా.వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 24న MBNRలోని స్టేడియం గ్రౌండ్లో ఉదయం 10 గంటలకు ఆర్చరి (స్త్రీ, పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు. SHARE IT

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ పురుషుల కబడ్డీ జట్టును ఎంపిక చేశారు.
✒పురుషుల కబడ్డీ జట్టు: 1.కిరణ్ కుమార్, 2.హేమంత్,3.సతీష్, 4. శివకుమార్, 5. నవీన్, 6.దినకర్, 7. శివకుమార్, 8. వై.శ్రీనివాస్, 9.సి.ప్రవీణ్ కుమార్, 10.పి. వెంకటేష్, 11.సి.మధు,12. జే.వినయ్ కుమార్,13. కె.భాస్కర్,14. కే.శివకుమార్, 15.శేఖర్,16. కే. కౌశిక్,17. కే.సాయి ప్రసాద్ లు ఎంపికైనట్లు యూనివర్సిటీ PD డా. శ్రీనివాసులు తెలిపారు.

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ కబడ్డీ మహిళల జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ VC జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి పాలమూరు విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మహిళా కబడ్డీ జట్టు:
1. పద్మ, 2.రాజేశ్వరి, 3.అనిత, 4.అనూష, 5.సరిత, 6.పార్వతి, 7.శిరీష, 8.కావేరి,9. సునేమా, 10.పూజ, 11.సునీత,12.కవిత,13.హిందూ,14. శ్రావణి,15.వాసంతి, 16.శ్రావణి

పాలమూరు విద్యార్థి నిజామొద్దిన్ డెడ్బాడీని తరలింపుపై.. పాలమూరు ఎంపీ డీకే అరుణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో విదేశీ వ్యవహారాలశాఖ అధికారులను ఎంపీ డీకే అరుణ కలిశారు. అనంతరం అమెరికా కాన్స్లెట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి.. నిజామొద్దీన్ పార్థీవదేహం తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, శుక్రవారం నాటికీ నిజామొద్దీన్ మృతదేహం పాటు, సామగ్రి HYDకు చేరేలా చూస్తున్నామన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో సౌత్ జోన్లో పాల్గొనేందుకు కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ.జి.ఎన్.శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేష్ బాబు, విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదేర్ల కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ధైర్యం, నిబద్ధత, క్రీడా స్ఫూర్తితో ఆడి విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్ఠలు జాతీయస్థాయిలో నిలపాలన్నారు. పీడీలు సత్యభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.