Mahbubnagar

News August 19, 2024

MBNR: బస్సులో పురుడు పోసిన కండక్టర్..

image

బస్సు కండక్టర్ నిండు గర్భిణీకి పురుడు పోసిన ఘటన గద్వాల్ మండలం కొండపల్లిలో సోమవారం జరిగింది. గద్వాల్ నుంచి వనపర్తికి పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సులో గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును ఆపి, బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. ఈ విషయంపై సజ్జనర్ Xలో ట్వీట్ చేశారు.

News August 19, 2024

MBNR: పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు

image

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పీపీపీ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంపద సృష్టించడం ద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని అన్నారు.

News August 19, 2024

“పాలమూరుకు ఎంఎంటీఎస్ రైళ్లు”

image

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రానుంది. నిజాం కాలంలో 140 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం త్వరలోనే కనుమరుగు కానుంది. ఇప్పటికే డబుల్ లైన్ పనులు, విద్యుదీకరణ పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ప్యాసింజరు, MMTS రైళ్లను ఈ మార్గంలో నడిపించేందుకు HYD రైల్వే డివిజన్ అధికారులు నిర్ణయించారు. రూ.17 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

News August 19, 2024

MBNR: 23న డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక.. షెడ్యూల్ ఇలా!

image

MBNR జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23న బ్యాంకు ఆవరణలో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్నికల అధికారి టైటాస్ పాల్ తెలిపారు. ఈ నెల 23న ఉ.9 నుంచి 11 గంటల వరకు నామినేషన్లు, ఉ.11.30గం. పరిశీలన, 12 నుంచి 2గం. వరకు ఉపసంహరణ, 2.30 గంటలకు అభ్యర్థుల తుది జాబితా, 3 నుంచి సా.5 గం. వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సా.5.30 గంటలకు ఓట్ల లెక్కింపు.

News August 19, 2024

MBNR: దుకాణాల్లో మొదలైన రాఖీ సందడి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో రాఖి అమ్మకాలు జరుగుతుండడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వ్యాపారాలు భారీగా పెరిగాయి. సుమారు 43 లక్షల జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారు. అందులో 15 లక్షల మంది క్రమం తప్పకుండా రాఖీలు కడతారని అంచనా. ఈ ఏడాది రాఖీలు, మిఠాయిల కొనుగోళ్లు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.16 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

News August 19, 2024

మక్తల్: విహారయాత్రలో విషాదం యువకుడు మృతి

image

తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మక్తల్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. అమృత్ గౌడ్ (25) తన మిత్రులతో కలిసి కారులో తమిళనాడులోని వివిధ పర్యటక ప్రాంతాలను సందర్శించేందుకు విహారయాత్రకు వెళ్లారు. కారు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో అమృత్ గౌడ్ అక్కడే మృతి చెందగా తనతో పాటు ఉన్న మరో నలుగురికి గాయాలు అయినట్లు తెలిపారు.

News August 19, 2024

MBNR: ముళ్లపంది దాడిలో చిరుత మృతి.!

image

మద్దూరు మండలం జాదవరావుపల్లి శివారులో ముళ్లపంది దాడి చేయగా చిరుత చనిపోయింది. గ్రామస్థులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇచ్చారు. వారు చిరుత మృతదేహాన్ని పరిశీలించగా, ముళ్లపంది ముళ్లు గుచ్చుకున్నట్లు గుర్తించారు. దీంతో ముళ్లపంది దాడిలో చిరుత చనిపోయినట్లు నిర్ధారించారు. MBNRవెటర్నరీ సర్జన్ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. రిపోర్టు ఆధారంగా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

News August 19, 2024

GDWL: నంబర్‌ప్లేట్ లేని వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు

image

నంబరు ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్‌కు అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్‌ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గట్టు ఎస్ఐ మల్లేశ్ అన్నారు. గట్టు మండల శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్ఐ మాట్లాడుతూ.. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు.

News August 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
✔MBNR: దైవ దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✔ఉమ్మడి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు
✔NGKLలో ప్రమాదం.. ఒకరి మృతి
✔కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమే:NGKL ఎంపీ
✔త్వరలో చేనేత ఎన్నికలు..ఓటరు జాబితాపై ఫోకస్
✔ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు: మాజీ మంత్రి నాగం
✔రైతన్నలకు కొత్త రుణాలు..బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్

News August 18, 2024

MBNR: రైతన్నలకు కొత్త రుణాలు.. బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 3.38 లక్షల మంది రైతులకు రూ.2,781.56 కోట్ల రుణమాఫీ అయిందని అధికారులు వెల్లడించారు. కొత్త రుణాలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,21,939 ఖాతాలకు రూ.8,928 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో 2,81,294 ఖాతాలకు రూ.5,950.56 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు దృష్టి పెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.03 లక్షల ఖాతాదారులకు రూ.14,878 కోట్ల పంట రుణాలు అందించనున్నారు.