India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 44.9, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 44.8, వనపర్తి జిల్లా కేతేపల్లి లో 44.8, మహబూబ్ నగర్ జిల్లా వడ్డేమాన్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
టెన్త్ విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గారడీతో ప్రజలు మోసపోయి, KCR సంక్షేమ పాలన దూరం చేసుకున్నామని ఆవేదన చెందుతున్నారని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు వనపర్తి పట్టణంలోని ఎకో పార్కులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. తనను MPగా గెలిపిస్తే 6 నెలల్లోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు
లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన విజయ సోమవారం దారుణ హత్యకు గురైంది. అచ్చంపేట సీఐ రవీందర్ వివరాల ప్రకారం..విజయను తన భర్త చంద్రు గొంతు నులిమి చంపాడని, ఈ కేసులో అత్త లక్ష్మి, ఆడపడుచు బుజ్జి ప్రమేయం లేదన్నారు. చంద్రుని అరెస్టు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
OYO వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది
✓ ఆరుబయట పనిచేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి
✓ చిన్న పిల్లలను ఎండలో పంపొద్దు
✓ ఎండలో ఎక్సర్సెజ్లు చేయొద్దు
✓ తప్పనిసరైతే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దు ఒకవేళ వెళ్లినా లేత రంగు దుస్తులు ధరించండి.
✓ టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.
✓ దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి
✓ ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినేలా చూసుకోండి
✓ వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
చరవాణిలో ఆట ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న సంఘటన మంగళవారం ఊర్కొండ మండలంలో చోటుచేసుకుంది. SI వీరబాబు కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెందిన వీరెడ్డి శేఖర్ రెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి చరవాణిలో ఆట ఆడుతుండగా మనీ 777 క్యాసినో అనే లింక్ రాగా లింక్ పై క్లిక్ చేశాడు. దీంతో 5 విడతలుగా రూ.67,899 బ్యాంకు ఖాతాలో నుంచి బదిలీ అయ్యాయి. 1930కు సమాచారం ఇచ్చి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు జిల్లాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 20 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్లో 10 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్ స్టేడియంలోని నూతన ఇండోర్ హాల్లో షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ శిక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి పాలమూరులో BJPకి సైతం ఆదరణ పెరుగుతోంది. దీంతో NGKL, MBNR పార్లమెంట్ స్థానాలలో గతంలో ద్విముఖ పోటీ జరిగితే.. ఇప్పుడు త్రిముఖ పోటీ అనివార్యం అవుతోంది.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ హామీల మీద హామీలు గుప్పిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.