Mahbubnagar

News April 30, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏టెన్త్ ఫలితాలు.. ఉమ్మడి జిల్లాలో అమ్మాయిలదే హవా
✏టెన్త్ లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానించిన ఆయా జిల్లాల కలెక్టర్లు,నేతలు
✏దామరగిద్ద:హత్య కేసులో నిందితుడు అరెస్ట్
✏కడ్తాల్ మండలంలో వ్యక్తి దారుణ హత్య
✏PU పరిదిలో రేపటి నుంచి వేసవి సెలవులు
✏MBNR,NGKL స్థానాల్లో రెండో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాట్లపై ఫోకస్
✏ఉమ్మడి జిల్లాలో పదవీ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు
✏జాగ్రత్త..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

News April 30, 2024

GREAT: ‘వెన్నచేడ్ MODEL SCHOOL’ లో 99% పాస్

image

మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్ మోడల్ స్కూల్లో M.పల్లవి విద్యార్థినికి 10/10(GPA)తో సత్తా చాటింది. దీంతో మంగళవారం జిల్లా కలెక్టర్ G.రవి నాయక్ ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ప్రిన్సిపల్ కొండల్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెన్నచేడ్ మోడల్ స్కూల్లో మొత్తం 93(B-58,G-35) మంది విద్యార్థులకు గాను..92(99%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

News April 30, 2024

MBNR: పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి తప్పదు: జిల్లా ఎస్పీ

image

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అన్నారు. జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని అన్నారు.

News April 30, 2024

పాలమూరు లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు.!

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న, మొన్నటి వరకు BJP, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి KCR పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి BJP, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

News April 30, 2024

MBNR: టెన్త్ ఫెయిలైన విద్యార్థులు ఇది మీకోసమే.!!

image

టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.

News April 30, 2024

కడ్తాల్ మండలంలో వ్యక్తి దారుణ హత్య !

image

కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తిని హత్య చేసి వెంచర్‌లో వేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మహబూబ్‌నగర్

image

మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కోడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ హస్తం పార్టీ చివరిసారిగా 2004లో గెలిచింది. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ నడుస్తోంది. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదో చూడాలి.

News April 30, 2024

MBNR, NGKL స్థానాల్లో రెండో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు

image

నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం పూర్తికావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం గుర్తులు కేటాయించారు. EVMలో 15మంది అభ్యర్థులతోపాటు నోటా ఉంటుంది. నోటాతో కలిపి మొత్తం అభ్యర్థుల సంఖ్య 16 కాగా… MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల సంఖ్య 16 దాటడంతో ప్రతి పోలింగ్ బూత్లో రెండో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.

News April 30, 2024

మహబూబ్‌నగర్: ఓట్ల వేట మొదలు

image

పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల నాయకులు హామీలపై హామీలు ఇస్తూ ఓట్ల వేట మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎన్నికల ప్రచారంతో జిల్లా రాజకీయాలు మరింత హిట్ ఎక్కాయి. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు మాటల తూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు.

News April 30, 2024

టెన్త్ ఫలితాలు.. దిగులుపడకు మిత్రమా..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది పరీక్షల ఫలితాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై అఘాయిత్యాలకు పాల్పడటం మనసును కలచివేస్తోంది. ఉత్తీర్ణత సాధించలేకపోయినా మళ్లీ పరీక్ష రాసి సత్తాచాటాలి. ఆశించిన మార్కులు రాకపోయినా నిరాశ చెందకుండా ఉన్నత చదువుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని, ఆలోచనలు మార్చుకుంటే అన్ని అద్భుతాలే అని విద్యాశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు.