Mahbubnagar

News October 1, 2024

“దేవద్రోణి తీర్థం” పుష్కరఘాట్‌లో ఘాతుక చతుర్దశి !

image

అలంపూర్ పుణ్యక్షేత్రం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న “దేవద్రోణి తీర్థం”లో మంగళవారం ఘాతుక చతుర్దశి చేస్తారు. మహాలయపక్షాల సందర్భంగా దేవద్రోణి తీర్థమైన పుష్కరఘాట్ లో ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. సాధారణ మరణాలు కాకుండా బలవన్మరణాలు, అకాల(యాక్సిడెంట్) మరణాలతో మృతి చెందిన వారికి వారి సంతానం ఈ ప్రాంతంలో తిలా తర్పనాలు, శ్రాధ్ద ఖర్మలు చేస్తారు.

News October 1, 2024

MBNR: దసరాకు 649 RTC ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల నుంచి 649 RTC ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. నేటి నుంచి ఈనెల 11 వరకు అదనపు సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ RM వి. శ్రీదేవి తెలిపారు. గద్వాల డిపోలో 89, కల్వకుర్తి-డిపో 67, కొల్లాపూర్ 58, MBNR 69, NGKL 53, నారాయణపేట 54, షాద్‌నగర్ 59, వనపర్తి 95.. అత్యధికంగా అచ్చంపేట డిపో 105 బస్సులు నడపనున్నారు. ఏపీకి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

News October 1, 2024

‘నిబంధన నామమాత్రమే.. క్రీడల్లో రాణించేది మనమెప్పుడు’

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.

News October 1, 2024

MBNR: DSC ఫలితాలు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇక్కడే..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC 1:3 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. MBNR-243 పోస్టులకు గాను 729 అభ్యర్థులు(మెట్టుగడ్డలోని డైట్ కళాశాలలో), NGKL-285 పోస్టులు(885)(లిటిల్ ఫ్లవర్ పాఠశాల), NRPT-279 పోస్టులు(837) (MLA క్యాంప్ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ హాస్టల్), GDWL-172 పోస్టులు (516)(ZPHS బాలుర స్కూల్), WNPT-152 పోస్టులు(456)(బాలికల ఉన్నత పాఠశాల) సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.

News October 1, 2024

యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్

image

యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

News September 30, 2024

NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.

News September 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !

image

✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్

News September 30, 2024

నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి: సిక్తా పట్నాయక్

image

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట శివారులోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 30, 2024

రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ

image

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నేడు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుహామీల సాధనదీక్షలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతురుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.

News September 30, 2024

అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

దౌల్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివారాలు.. దౌల్తాబాద్ మండలం నుంచి అంత్యక్రియల కోసం వెళ్తుండగా దేవర ఫసల్వాద్ సమీపంలో అదుపు తప్పి ఈర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.