Mahbubnagar

News April 30, 2024

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులు వీరే..

image

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ ప్రసాద్(BJP), బీసమోళ్ల యూసఫ్(BSP), అమరనాథ్(ఇండియా ప్రజాబంధు పార్టీ), అయ్యప్ప సునీల్(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్), అంబోజు రవి(డెమోక్రటిక్ రిఫార్మ్), విజయ్(బహు జన్ ముక్తి పార్టీ), దాసరి భారతి(విదుతలై చిరుతైగల్ కచ్చి), ప్రాసంగి (పిరమిడ్ పార్టీ), విజయ్(విద్యార్థుల రాజకీయ పార్టీ), స్వతంత్రులు కర్నె శిరీష(బర్రెలక్క)తో పాటు 8 మంది బరిలో ఉన్నారు.

News April 30, 2024

MBNR:తేలిన అభ్యర్థుల లెక్క.. హోరెత్తనున్న ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ప్రధానంగా సామాజిక వర్గాలపై దృష్టిసారించి వారి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13న లోక్ సభ ఎన్నికలు ఉండగా.. ఒకరోజు ముందుగానే పార్టీల ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంది.

News April 30, 2024

10TH రిజల్ట్స్.. పాలమూరులో 45,350 విద్యార్థులు

image

పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కాగా MBNR జిల్లాలో మొత్తం 12,866, NGKL 10,526, WNP-6,903, NRPT-7,678, గద్వాల 7,377 మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

 ధరూర్ కస్తూర్బా సిబ్బందిపై వేటు

image

KGBVలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావడంతో విచారణకు కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. దీనిపై అదనపు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి, అకౌంటెంట్, సీఆర్టీ ఉపాధ్యాయురాలు, అటెండర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఈనెల 25న డీఈవో ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంఈఓ సురేశ్ తెలిపారు.

News April 30, 2024

GDWL: చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి చేనేత పురస్కారాలకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి గోవిందయ్య తెలిపారు. అర్హులు, ఆసక్తి గల కళాకారులు తమ దరఖాస్తులను మే 20లోగా కార్యాలయ వెబ్‌సైట్ www.handlooms.nic.in నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు సంబంధించి మూడు ప్రతులను HYDలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ బీ1, బీ2లో అందజేయాలన్నారు.

News April 30, 2024

మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో 31 మంది అభ్యర్థులు

image

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి 35 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీలో 35 మంది నామినేషన్లు ఆమోదించారు. వారిలో సోమవారం నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ ఉండనుంది.

News April 30, 2024

MBNR: ఖైదీలూ ఓటేయొచ్చు.. వారు ఇలా చేయాలి..!

image

సార్వత్రిక ఎన్నికల్లో ఖైదీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ప్రిమెంట్ డిటర్మినేషన్ కింద వివిధ నేరాల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించారు. తమకు ఫలానా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని, దానిని వినియోగించుకుంటామని జైలర్ కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి జైలర్ ఆయా ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు.

News April 30, 2024

నేషనల్ హ్యాండ్లూమ్-2023 అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

image

జాతీయ సంత్ కబీర్& నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు-2023కి రాష్ట్ర ప్రభుత్వం, చేనేత జౌళి శాఖ దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా చేనేత మరియు జౌళిశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ, డిజైన్ లో నైపుణ్యం కనబరిచిన వారు మరియు చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన చేనేత కళాకారులకు ప్రతిష్టాత్మక సంత్ కబీర్ &నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు ఇవ్వబడుతుందని.. మే 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 30, 2024

ఎన్సీడీ నిర్వహణపై వైద్య సిబ్బందికి అవగాహన

image

గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం లకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఎన్సీడీ పోర్టల్ లో లింక్ చేసే విధానంపై డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు అబా కార్స్ లింక్ చేసిన తర్వాత వారి సంఖ్యను జిల్లా ఆరోగ్య కేంద్రానికి తెలపాలన్నారు. ప్రాక్టికల్ గా ట్యాబ్ లో అబా కార్స్ లింక్ చేశారు.

News April 30, 2024

ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ కుట్ర: డీకే అరుణ

image

ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. సోమవారం హన్వాడ మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. జూటా మాటలు చెప్పి, 6గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆమె అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.