India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత తనిఖీలలో పట్టుబడ్డ గుర్తింపు లేని వాహనాలకు వేలం నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మొత్తం 76 వాహనాలు జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచినట్టు పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఆర్ఎస్ఐ నగేష్ 871265 9329 నంబర్ పై సంప్రదించాలన్నారు. ఎవరు సంప్రదించని క్రమంలో ప్రచురణ జరిగిన 14 రోజులలో వేలం వేస్తామన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT
మహబూబ్నగర్లో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వేపూరు గ్రామానికి చెందిన యాదయ్య వంట మాస్టర్. గత కొకొన్ని రోజులుగా మహబూబ్నగర్ పట్టణంలో ఉంటూ జీవనం సాగించేవాడు. యాదయ్య రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కొడుకు కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 87.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ లో 21.3 మిల్లీమీటర్లు, నారాయణ పేట్ జిల్లా గుండుమల్లో 1.3 మిల్లీమీటర్లు, వనపర్తి గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి కేవలం 30 మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో 19 ప్రాజెక్టులను ఎంపికచేశారు. నిన్న ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వీరికి పేటెంట్ హక్కులు కూడా కల్పించనున్నారు. గద్వాల జిల్లాలో పదికి 3 ప్రాజెక్టులు ఎంపిక చేశారు.
షాద్నగర్ PSలో సునీతపై థర్డ్ డిగ్రీ వ్యవహారంపై NHRCలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సమతా సైనిక్ దళ్ న్యాయ సలహాదారు కార్తీక్ నవయాన్ గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడిన డీఐ రాంరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి శిక్షించాలని పిటిషన్లో కోరారు.కేసు CBIకి అప్పగించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని,బాధితురాలికి పరిహారం, ఉపాధి కల్పించాలని కోరారు.
ORRపై <<138659>>యాక్సిడెంట్<<>>లో చనిపోయిన ముగ్గురిలో 2 నెలల బాలుడు ఉన్నారు. ఆత్మకూర్కు చెందిన 12 మంది తూఫాన్ వాహనంలో యాదాద్రికి నుంచి వస్తున్నారు. కరీంనగర్ నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి తూఫాన్ను బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తూఫాన్లో ఉన్న డ్రైవర్ తాజ్, వరాలు స్పాట్లో చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 నెలల బాలుడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదైంది.
అనుమానస్పద స్థితిలో చిరుత మృతి చెందిన ఘటన మద్దూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాదరావుపల్లి తాటిగట్టు గుట్టపై గురువారం చోటు చేసుకుంది. గుట్ట సమీపంలోని చెరువులో నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఏదైనా జంతువు దాడి చేసి ఉండవచ్చు అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.
షాద్నగర్లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్లో ఉన్న షాద్నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదైంది.
మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో MBNR జిల్లాలో 11,458 మంది రైతులకు రూ.138.75 కోట్లు, నాగర్కర్నూల్లో 21,352 మంది రైతులకు 261.36 కోట్లు, గద్వాలలో 9550 మంది రైతులకు 121.91 కోట్లు, వనపర్తిలో 10,047 మందికి రూ.126.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నారాయణపేట జిల్లాలో 3 విడతల్లో మొత్తం 58,754 మంది రైతులకు రూ.503.17కోట్లు మాపీ కానుంది.
Sorry, no posts matched your criteria.