India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రపతి పతకానికి ఇటిక్యాల ASI వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. కడప జిల్లా బద్వేల్ మండలం పోరుమామిళ్లకు చెందిన వెంకటేశ్వర్లు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి 1989లో పోలీసు ఉద్యోగం సంపాదించారు. మొదట KNRలో విధుల్లో చేరారు. 8 నెలల అనంతరం అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలికి బదిలీపై వచ్చారు. అనంతరం హెడ్కానిస్టేబుల్గా బిజినేపల్లకి అక్కడి నుంచి మిడ్జిల్ అనంతరం ASIగా ఉన్నతి పొంది 2020లో ఇటిక్యాలకు బదిలీపై వచ్చారు.
రాఖీ పండగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కార్గోలో రాఖీలు, మిఠాయిలు, బహుమతులు పంపవచ్చని ఏటీఎం లాజిస్టిక్స్ ఇసాక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సేవలు అందుబాటులో ఉంటాయని, పూర్తి వివరాల కొరకు 91542 98609, 91542 98610 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన బాలుడు <<13853898>>రఫీ హత్యలో<<>> విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలుడి సమీప బంధువైన మౌలాలి బాలుడి తల్లి సమీరాతో అక్రమ సంబంధం కొనసాగించాడు. ఇటీవల సమీరా మరొకరితో చనువుగా ఉంటుందని ఆగ్రహించి, మౌలాలి ఈనెల 13న ఆమె కుమారుడిని అపహరించి ముళ్ల పొదల్లో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగా <<13849590>>నజీర్ కుమారుడు<<>> రఫీ ఈనెల 13న కనిపించకుండా పోయాడు. ఈ విషయమై తండ్రి ఇటిక్యాల పీఎస్ లో కంప్లైంట్ చేశాడు. అయితే బుధవారం సాయంత్రం బాలుడు గ్రామ శివారులో పంట పొలాల మధ్య ఉన్న ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. అటుగా వెళ్లిన రైతులు గ్రహించి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో ఘటనస్థలికి డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేశ్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పూల బొకే, శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అమెరికా, కొరియాల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో సీఎంను కలిశారు. విదేశీ పర్యటన ద్వారా పలు కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారని, తద్వారా తెలంగాణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సంస్థానాధీశులు నిర్మించిన కోటలు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, ప్రాజెక్టులు, నల్లమల అటవీ సంపదకు ఈ ప్రాంతం నెలవు కావడంతో 2 సర్క్యూట్లుగా విభజించి డెవలప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. NGKL, WNP జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను ‘నల్లమల టూరిజం హబ్’గా, NRPT, MBNR, GDL ప్రాంతాలను కలిపి ‘ఏకో టూరిజం హబ్’గా అభివృద్ధి చేయనుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో 52.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 13.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరు లో 7.5 మిల్లీమీటర్ల, గద్వాల జిల్లా సాటేర్లలో 3.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
గుప్తనిధుల తవ్వకాల్లో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. CI శ్రీధర్ రెడ్డి వివరాలు.. గోవిందరావుపల్లి శివారు గుట్టల్లో తూము కట్టడంపై ఏనుగు బొమ్మ ఉండటంతో నిధి ఉందని భావించిన నాగ్సాన్పల్లి వాసి శంకరయ్య, మరో 8 మంది మే 21న తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో దాదాపూర్కు చెందిన సత్యప్పపై ఓ రాయి మీదపడి చనిపోయాడు. ఘటనను కప్పిపుచ్చడానికి యాక్సిడెంట్గా చిత్రీకరించిన నిందితులను అరెస్ట్ చేశారు.
MBNRను గతంలో “రుక్మమాపేట”, “పాలమురు” అనేవారు. HYD (1869-1911AD) నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా VI గౌరవార్ధం ఈ పేరును 4 డిసెంబర్ 1890న మహబూబ్ నగర్ గా మార్చారు. ప్రసిద్ధ “కొహినార్” డైమండ్ తో సహా ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఈ జిల్లా నుంచి వచ్చాయని టాక్. ఒకప్పుడు “చోళవాడి” / “చోళుల భూమి” అని పిలువబడింది. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. రాష్ట్రంలోనే అత్యధిక గ్రామీణ జనాభా(89%) ఉన్న జిల్లా ఇది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇకనుంచి ఉచితంగా విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. దీనికోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల వివరాలను వెబ్ పోర్టల్ లో పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.