India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MBNR పార్లమెంట్కు ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
బల్మూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టపై కొనసాగుతున్న మైనింగ్ను నిలిపివేయాలని కోరుతూ గత కొంతకాలంగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు మేం దూరం.. దూరం అంటూ గ్రామంలో పోస్టర్లు వెలిశాయి. గుట్ట ముద్దు.. ఓటు వద్దు అనే నినాదంతో పోస్టర్లు వేశారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకు సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం నేడు వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఉండవల్లి మండలంలో జరిగింది. హైదరాబాద్ నుంచి బనగానపల్లికి ఖాసీం అనే యువకుడు బైకుపై వెళ్తున్నాడు. అలంపూర్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ రోడ్డు సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవ్యక్తి తీవ్రగాయాలవ్వడంతో అతన్ని NH 44రోడ్డు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అంబులెన్స్లో కర్నూల్ తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని పాలమూరు పోలీసులు సూచిస్తున్నారు.
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులలో ఎలుకల కాట్లు కలవరపెడుతున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఎలుకలు కరిచిన ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ మహిళ తన పిల్లలను ఆసుపత్రికి తీసుకురాగా ఆమె కాలును ఎలుక కరిచింది. ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి దుస్థితిపై రోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
✔బంగారు పతకం సాధించిన పాలమూరు క్రీడాకారిణి సంగీత.. ప్రశంసల వెల్లువ
✔ఎంపీ ఎన్నికలు:నేడు ఉపసంహరణ
✔ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలలో రెడ్ జోన్:వాతావరణ శాఖ
✔NRPT:నేడు డయల్ యువర్ డిఎం
✔ప్రచారంలో స్పీడ్ పెంచిన పార్టీ నేతలు
✔నేడు పలువురు నేతలు కాంగ్రెస్,BJP,BRSలో చేరికలు
✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔అక్రమ మద్యం,ఇసుక రవాణా పై అధికారుల ఫోకస్
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
కొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం లభించింది. ఎస్సై మంజునాథ్ రెడ్డి వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సంగీత దుబాయ్లో జరిగిన 400 మీటర్ల రిలే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్లో భారత్కు బంగారు పతకం సాధించింది. వరల్డ్ వైడ్ దుబాయ్ ఆసియా ఛాంపియన్షిప్లో ఇండియాకు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సంగీత తండ్రి శ్యామ్ జిల్లా ఎస్పీ ఆఫీసులో వైర్లెస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.
తనకు ప్రజాసేవ చేసే అవకాశం కలిపించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆదివారం పానగల్ మండలం మల్లాయిపల్లిలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న తనను గెలిపించాలని, అనుక్షణం ప్రజాసేవలో ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.
Sorry, no posts matched your criteria.