India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు ప్రజాసేవ చేసే అవకాశం కలిపించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆదివారం పానగల్ మండలం మల్లాయిపల్లిలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న తనను గెలిపించాలని, అనుక్షణం ప్రజాసేవలో ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
✒NRPT:అథ్లెటిక్స్లో బసంత్-బంగారు పథకం, శ్రీలత-కాంస్య పథకాలతో క్రీడాకారుల సత్తా
✒ప్రతి ఊరికి వస్తా.. ఇళ్లు మంజూరు చేస్తా: మంత్రి జూపల్లి
✒గుండెపోటుతో అచ్చంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి
✒సాయిచరణ్ కు CM రేవంత్ రెడ్డి సన్మానం
✒ప్రచారంలో కోలాటం ఆడిన ఎమ్మెల్యే వంశీకృష్ణ,మల్లురవి
✒GDWL:ఫేక్ అధికారి అరెస్ట్
✒జాగ్రత్త..వనపర్తి,గద్వాల,నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
✒BJP, కాంగ్రెస్, BRSలో పలువురు చేరికలు
కొత్తకోట మండలం బూత్కూరులో వ్యవసాయానికి నీళ్లు కట్టడానికి వెళ్లిన శేఖర్కు పొలంలో కనిపించిన ముసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ సాగర్ ఘటనా స్థలానికి పరిశీలించారు. 185 కేజీలు ఉన్న దాన్ని బంధించి జూరాల డ్యాంలో వదిలినట్లు కృష్ణ తెలిపారు. వారం క్రితం ముసలి 2 గొర్రె పిల్లలను, ఒక ఆవు దూడను చంపిందని గ్రామస్థులు తెలిపారు.
సీపీఎం నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం సోమవారం వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ తెలిపారు. సమావేశానికి నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల సీపీఎం నాయకులు, కార్యకర్తలు హాజరవుతాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం వైఖరి అనే అంశంపై సమావేశం ఉంటుందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జాన్ వెస్లీ హాజరవుతారని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని,HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
వీఆర్ఏల సమస్యలను ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వీఆర్ఏ సమస్యలను న్యాయవాది కావలి గోవిందు నాయుడు ప్రొఫెసర్ కోదండరాం దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ఈ కార్యక్రమంలో కాచం సత్యనారాయణ, వీఆర్ఏల ప్రతినిధులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో నేడు జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటారు. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చాంపియన్ షిప్ అండర్-14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో బసంత్ బంగారు పథకం సాధించగా, ఉమెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీలత కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి.
సూపర్హీరో సాయిచరణ్ సాహసం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. షాద్నగర్ పరిధి నందిగామలోని ఓ ఫార్మా కంపెనీలో ఈనెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్ చేసి కాపాడారు. ఆదివారం స్థానిక MLA వీర్లపల్లి శంకర్ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.
పార్లమెంట్ ఎన్నికలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉండడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది గుర్తులు కేటాయింపు మిగిలింది. అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిల మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది.
Sorry, no posts matched your criteria.