Mahbubnagar

News April 28, 2024

MBNR: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

రైలుపట్టాలు దాటుతున్న వృద్ధుడు రైలు ఢీకొని మృతి చెందిన ఘటన MBNR రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ వివరాలు.. తిమ్మసానిపల్లికి చెందిన ఎల్లయ్య (85) శనివారం దొడ్డలోనిపల్లిలో రైల్వే గేటు పడటంతో కింది నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అప్పుడే వచ్చిన మధురై ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News April 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔సర్వం సిద్ధం.. ఉమ్మడి జిల్లాలో నేడు ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్ష
✔GDWL,NRPT:పలు గ్రామాలలో కరెంట్ కట్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✔MBNR,GDWL,NRPT,WNPT జిల్లాలలో రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ
✔పలుచోట ఓటు హక్కు పై ర్యాలీలు
✔ఏర్పాట్లలో నిమగ్నం.. మే 1 నుంచి ‘వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు’ ప్రారంభం
✔TTC ఉత్తీర్ణత అయినవారు శిక్షణకు దరఖాస్తు చేసుకోండి!

News April 28, 2024

MBNR:  జిల్లాలో నిన్నటి ఉష్ణోగ్రతలు

image

వడ్డెమాన్ 44.2℃, జానంపేట 43.4, బాలానగర్ 43.2, కొత్తపల్లె 43.0, సల్కర్‌పేట 42.9, మహబూబ్ నగర్ 42.9, సెరివెంకటాపూర్ 42.8, మహబూబ్ నగర్ 42.5, అడ్డాకల్ 42.5, భూత్పూర్ 42.4, చిన్న చింత కుంట 42.4, దేవరకద్ర 42.2, హన్వాడ 42.2, మహమ్మదాబాద్ 42.2, కౌకుంట్ల 42.0, జడ్చర్ల 41.8, కొత్త మోల్గార 41.8, పార్పల్లి 41.4, మాచన్‌పల్లె 41.4, రాజాపూర్ 41.4, దోనూరు 40.9, నవాబుపేట 40.3, మిడ్జిల్లో 40.5℃గా నమోదైంది.

News April 28, 2024

మహమ్మదాబాద్: పంటకు ట్యాంకర్ల‌తో నీళ్లు

image

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన రైతు అనంతయ్య తాను వేసిన వరి పంటను రక్షించుకోవాలని పొలానికి ట్యాంకర్ల‌తో నీరందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు నీరందిస్తే పంట చేతికి వస్తుందని, అందుకే నీరు పోస్తున్నట్లు రైతు తెలిపారు. తనకున్న 4 ఎకరాల్లో వరి నాటినట్లు తెలిపారు. అందులో అర ఎకరానికి నీరు అందకపోవడంతో ఎండిపోతుందని గమనించి ప్రతీ రోజూ 7,8 ట్యాంకర్ల‌తో నీరందిస్తున్నట్లు తెలిపారు.

News April 28, 2024

NGKL: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసిఆర్

image

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని BRS అధినేత KCR పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం NGKLలో KCR ప్రసంగించారు. మళ్లీ BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు. ‘సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు. దుర్మార్గ కాంగ్రెస్‌ పాలన పోవాలంటే BRSకు పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతివ్వాలి. KCR చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాటం చేశాను తెలంగాణ సాధించాను’ అని అన్నారు.

News April 27, 2024

MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లు ఆమోదం

image

తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. మహబూబ్ నగర్ లో7, నాగర్ కర్నూల్ లో13 నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. పరిశీలన అనంతరం MBNRలో 35,NGKLలో 21 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 29న ముగియనుంది.

News April 27, 2024

నాగర్ కర్నూల్‌ రోడ్ షోలో KCR వ్యాఖ్యలు

image

☞రైతుబంధు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
☞ప్రజల సొమ్మును రైతులకు ఇవ్వడానికి వచ్చిన నష్టమేంటి?
☞రైతులంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా?
☞తాగునీటి కోసం మహిళలు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చేసే రోజులు వచ్చాయి.
☞సొంత గడ్డకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో RSP రాజకీయాల్లో వచ్చారు. ఆయనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలి.

News April 27, 2024

NGKL: KCR సభ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్..!

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులలో కొత్త జోష్ కనిపిస్తుంది. కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తల ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారు మోగింది..

News April 27, 2024

కమిట్మెంట్ ఉన్న నాయకుడు RS ప్రవీణ్ కుమార్: KCR

image

నాగర్ కర్నూల్ BRS MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని MPగా గెలిపించుకుంటే మన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం KCR అన్నారు. నాగర్ కర్నూల్‌లో శనివారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన RS ప్రవీణ్ కుమార్ వాటిని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు అని అన్నారు.

News April 27, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లా ప్రజలు 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం ఆయన ఛాంబర్ ‌మాట్లాడుతూ.. 5 రోజులపాటు జిల్లాలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వేళలో ఎవరు ఎండలో తిరగరాదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. లేత తెలుపు రంగు వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు.