India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
షాద్ నగర్ పరిధిలోని ఎలకిచర్ల, జిల్లేడు చౌదరిగూడలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శనివారం రోడ్ షో నిర్వహించారు. అరుణ మాట్లాడుతూ.. ‘రేవంత్ రెడ్డి చిక్కడు దొరకడు.. అయన సీఎం స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రజాధరణ కోల్పోయిందన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
రైతు బతికి ఉండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి భూమిని కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జిల్లేడు చౌదరి గుడా మండలంలోని వీరన్న పేట గ్రామానికి చెందిన రైతు గడ్డం వెంకటయ్యకు సంబంధించిన 30 గుంటల భూమిని అధికారులు ఇతరుల పేరున చేశారు. రైతు బంధు రావడం లేదంటూ అధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 9 మంది రెవెన్యూ సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవలో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్వాడీ కుటుంబ సర్వే ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ల నుంచి 300 ఇళ్లు ఉండేలా సర్దుబాటు చేసి, సంబంధిత వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్ లో సర్వేను ఒకే సారి పొందుపరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,321 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెళ్లిళ్లు శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేకు పడనుంది. గత నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు అంచనా వేశారు. ఈ నాలుగు నెలల్లో బ్రాహ్మణులు, ఇతర కుల వృత్తుల వారు, బంగారం వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులు, టాక్సీలు, వస్త్ర వ్యాపారులకు చేతినిండా పని దొరికింది. మూఢంతో 4 నెలల పాటు పని లేకుండా పోయిందని పలువురు అన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు..
✓ మహబూబ్నగర్ – 275, ✓ జడ్చర్ల – 274, ✓ దేవరకద్ర – 289, ✓ నారాయణపేట – 270, ✓ మక్తల్ – 284, ✓ కొడంగల్ – 282
✓ షాద్నగర్ – 263, ✓ నాగర్ కర్నూల్ – 264
✓ అచ్చంపేట – 339, ✓ కల్వకుర్తి – 271
✓ కొల్లాపూర్ – 292, ✓ వనపర్తి – 307
✓ గద్వాల – 303, ✓ అలంపూర్ – 291
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,004 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
BRS బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ భారీ రోడ్ నిర్వహించారు. KCR ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు నిలబడ్డాయి.. BRS, కాంగ్రెస్, BJP.. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు పని చేస్తరో.. ఎవరు న్యాయంగా ఉంటారో.. వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడుతాయి. పని చేయని వాళ్లకు వేస్తే ఇబ్బంది పెడుతరు.’ అని హితవు పలికారు.
మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ పాలమూరుకు బతుకుదెరువు చూపారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడుతూ.. “అమాయక పాలమూరు ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలకు మోసపోయి గెలిపించారన్నారు. ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే అధికారం చేపట్టిన కాంగ్రెస్ మోసం చేసిందని” ఆరోపించారు.
లోక్ సభ నియోజకవర్గానికి బలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది నామపత్రాలు దాఖలు చేయగా 35 మంది నామపత్రాలను ఆమోదించారు. వివిధ సాంకేతిక కారణాలతో ఏడుగురు అభ్యర్థుల పత్రాలు తిరస్కరించారు.
✔నేడు నాగర్ కర్నూల్ కు మాజీ సీఎం కేసిఆర్ రాక
✔నంచర్ల:నేడు జాబ్ మేళా
✔నేడు PUలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు
✔పోలింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల అవగాహన సదస్సులు
✔GDWL:నేడు పలు గ్రామాల్లో కరెంట్ కట్
✔అమరచింత:నేడు పట్టణంలో నీటి సరఫరా బంద్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ సర్వే
✔సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు
Sorry, no posts matched your criteria.