Mahbubnagar

News April 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు నాగర్ కర్నూల్ కు మాజీ సీఎం కేసిఆర్ రాక
✔నంచర్ల:నేడు జాబ్ మేళా
✔నేడు PUలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు
✔పోలింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల అవగాహన సదస్సులు
✔GDWL:నేడు పలు గ్రామాల్లో కరెంట్ కట్
✔అమరచింత:నేడు పట్టణంలో నీటి సరఫరా బంద్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ సర్వే
✔సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు

News April 27, 2024

MBNR: నరేంద్ర మోడీ దేశ ప్రజలను నయవంచన చేశాడు: కేసీఆర్

image

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను నయవంచన చేశాడని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై నిప్పులు చేరిగారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికైనా మేలు జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.

News April 26, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒కాంగ్రెస్ పాలనలో భయంకరమైన బాధలు:KCR
✒కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయండి:NGKL మాజీ ఎమ్మెల్యే
✒NGKL:మాజీ ఎంపీ మంద జగన్నాథ్ నామినేషన్ తిరస్కరణ
✒6 గ్యారంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి:DK అరుణ
✒GDWL:ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఓ
✒కాంగ్రెస్ కు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:మల్లు రవి
✒JEE టాపర్‌కు ఘన సన్మానం
✒ఉపాధి కూలీల సమస్యల పరిష్కరించాలి:AIPKMS
✒ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానం

News April 26, 2024

MBNR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా: KCR

image

కాంగ్రెస్ గెలవగానే క్షణాల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మరీ హామీ ఇచ్చినట్లుగా చేశారా? అని BRS అధినేత KCR ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు నిధులు అందలేదని ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని అన్నారు.. మరీ ఇచ్చారా? ఈ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు’ అని హెచ్చరించారు.

News April 26, 2024

MBNR: కాంగ్రెస్ పాలనలో భయంకరమైన బాధలు: కేసీఆర్

image

కాంగ్రెస్ పాలనలో ప్రజలు భయంకరమైన బాధలు పడుతున్నారని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా కళ్ళ ముందే తెలంగాణ నాశనం అవుతుంటే యుద్ధం చేస్తాను. ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన. ఎలాంటి పోరాటానికైనా జనం సిద్ధంగా ఉండాలి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని అన్నారు.

News April 26, 2024

MBNR: మరో 10 రోజులు జాగ్రత్త !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా పానగల్‌లో 44.4 డిగ్రీలు నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.

News April 26, 2024

6 గ్యారంటీలు అమలు చేసి ఓట్లు అడగాలి: DK అరుణ

image

అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి CM రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతంలోని ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అందుకే ఓట్లు అడుగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ ఐదేళ్లు సంక్షేమం, అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని అన్నారు. ఎన్నికుట్రలు చేసినా తన గెలుపు ఖాయమని అన్నారు.

News April 26, 2024

MBNR: ఎన్నికల అక్రమాలపై ఇలా ఫిర్యాదు చేయండి

image

ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించాలని జిల్లా రిటర్నింగ్ అధికారి రవి నాయక్ కోరారు. ఎన్నికల అక్రమాలపై సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా ఫోన్ నంబర్ 90597 97275/generalobserv-er011@gmail.com, ఎన్నికల వ్యయంపై ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్ రంగ స్వామికి 8522875617 లేదా vrswamyexpobr11pc.mbnr@gmail. ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 26, 2024

మహబూబ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..!

image

వంశీచంద్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), షేక్ మున్నా బాషా(ఏఐఎంఐఎం), జి. రాకేశ్ (ధర్మ సమాజ్ పార్టీ), శంకర్ రెడ్డి(విడుదలై చిరుతైగల్ కచ్చి), ఏ.రెహమాన్(బహుజన్ ముక్తి పార్టీ), వెంకటేశ్వర్లు(అలయన్స్ డెమోక్రసీ రిఫార్మ్స్ పార్టీ), నరేశెడ్డి(తెలంగాణ జాగీర్ పార్టీ), రవీందర్(సోషల్ జస్టిస్ పార్టీ), మహ్మద్ అల్లాఉద్దీన్(బహుజన్ సమాజ్ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.

News April 26, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఆశ వర్కర్ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి లింగాలకు చెందిన ఆశ వర్కర్ లీలావతి(55) మృతి చెందారు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి నాగర్ కర్నూల్ నుంచి లింగాల వైపు వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో బైకు పైనుంచి కిందపడటంతో తలకు బలమైన గాయలయ్యాయి. దీంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.