India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామ సమీపంలో డీసీఎం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. నరసింహ(25) పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బైక్ పై ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన DCM ఢీ కొట్టింది. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే స్పష్టత లేదు. BRS నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 రోజుల క్రితం కేటీఆర్తో సమావేశమై BRSలో కొనసాగుతానన్నారు. పది రోజుల క్రితం మళ్లీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై బుజ్జగించారు. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంటుండడంతో చర్చనీయాంశంగా మారారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే స్పష్టత లేదు. BRS నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 రోజుల క్రితం కేటీఆర్తో సమావేశమై BRSలో కొనసాగుతానన్నారు. పది రోజుల క్రితం మళ్లీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై బుజ్జగించారు. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంటుండడంతో చర్చనీయాంశంగా మారారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో 15 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ఆ ఏరియాల్లో ప్రతిరోజు ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఇంట్లోని ప్రతి గదిలో అన్ని మూలాలకు ఇండోర్ స్ప్రే చేస్తున్నారు. ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో ఈ ఏడాది మొత్తం 79 డెంగీ కేసుల నమోదయ్యాయి.
ఓ యువకుడుపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగం (28) అదే గ్రామానికి చెందిన జగతయ్య సుద్దపల్లి గ్రామానికి చెందిన బాలరాజు ఇద్దరు కలిసి లింగంపై దాడి చేసినట్లు సీఐ తెలిపారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లింగంను గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లి లో 30.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 20.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 16.5 మిల్లీమీటర్లు, చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ప్రేమపేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన నవాబ్ పేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ముస్తఫా అనే యువకుడు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా మతం అడ్డొస్తుందని పెళ్లి చేసుకోకుండా యువతి మోసం చేశాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు.
రూ.2లక్షల రుణమాఫీపై ఉమ్మడి పాలమూరుకు చెందిన రైతుల్లో గందరగోళం నెలకొంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ కొందరు రైతుల నుంచి వ్యవసాయ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. మరోవైపు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ.. తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని నిలదీస్తున్నారు. దీనిపై అధికారులు, బ్యాంకర్ల నుంచి సరైన సమాధానం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పిల్లలమర్రిచెట్టు మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు.సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది.
దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.
అనుమానాస్పదంగా ట్రాన్స్జెండర్ మృతిచెందిన ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకుంది. SI విజయ్ భాస్కర్ వివరాలు.. బిజినేపల్లి మం. నందివడ్డేనాన్ వాసి నరేందర్ 5ఏళ్ల క్రితం ట్రాన్స్జెండర్(నాగశ్రీ)గా మారారు. MBNRలో అద్దె గదిలో ఉంటూ భిక్షాటన చేస్తుంది. గతేడాది ఆటో డ్రైవర్ రమేశ్ను పెళ్లి చేసుకున్న ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.