Mahbubnagar

News August 31, 2025

MBNR: పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

News August 30, 2025

MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

image

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News August 30, 2025

నేడు PUలో ఓరియంటేషన్ ప్రోగ్రాం

image

పాలమూరు యూనివర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,PU వైస్ ఛాన్సలర్ జిఎన్. శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎండీ గౌస్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.

News August 30, 2025

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.

News August 30, 2025

MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

image

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News August 30, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. బొక్కలోనిపల్లికి చెందిన అజయ్ కుమార్ మహబూబ్‌నగర్ పట్టణంలోని కొత్త ఆర్టీవో ఆఫీస్ మైసమ్మ దేవాలయం పక్కన బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా EMT లక్ష్మణ్ గౌడ్, పైలెట్ కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

News August 30, 2025

యూరియా కొరత లేకుండా చూడండి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఎరువులను విక్రయించే డీలర్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, వాటిని పక్కదారి మళ్లించకుండా రైతులందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎరువుల స్టాక్ ఉండి లేదని చెప్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

News August 30, 2025

ఎరువులని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు: MBNR కలెక్టర్

image

రైతులకు ఎరువులను అందించకుండా వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాల్లో ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులకు ఎరువులు లేవని చెబుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 29, 2025

MBNR: పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.

News August 29, 2025

భూత్పూర్‌లో యూరియా కోసం రైతుల అవస్థలు

image

యూరియా కొరత వేధిస్తున్న ఈ సమయంలో భూత్పూర్‌లోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడే టోకెన్లు ఇవ్వడం అక్కడే యూరియా పంపిణీ చేయడంతో ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి, యూరియా బస్తాల కోసం రోజుల తరబడి లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.