Mahbubnagar

News April 26, 2024

నాగర్‌కర్నూల్: రోడ్డు ప్రమాదంలో ఆశ వర్కర్ మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి లింగాలకు చెందిన ఆశ వర్కర్ లీలావతి(55) మృతి చెందారు. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గురువారం రాత్రి నాగర్ కర్నూల్ నుంచి లింగాల వైపు వెళ్తుండగా జిల్లా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో బైకు పైనుంచి కిందపడటంతో తలకు బలమైన గాయలయ్యాయి. దీంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇవాళ చనిపోయినట్లు తెలిపారు.

News April 26, 2024

మహబూబ్‌నగర్‌లో 4వసారి గులాబీ జెండా పాతేనా..?

image

MBNR లోక్ సభ స్థానంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. వరుసగా గత మూడుసార్లు ఈ స్థానాన్ని BRS కైవసం చేసుకుంది. 2009లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లోనూ BRS నుంచి జితేందర్ రెడ్డి, 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 4వ సారి కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోన్న BRS.. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

News April 26, 2024

JEE ఫలితాల్లో సత్తా చాటిన పాలమూరు బిడ్డలు

image

JEE మెయిన్స్‌లో పాలమూరు విద్యార్థులు సత్తాచాటారు. వనపర్తికి చెందిన రేహాన్ తొలి ప్రయత్నంలోనే 88వ ర్యాంక్(99.9%) సాధించాడు. MBNRకు చెందిన కార్తిక్‌సాగర్(99.83), గణేశ్(99.40), కౌషిక్(98.87), NGKL-చరణ్(99.98), చరిష్మ(99.85), కునాల్(99.79), జడ్చర-అనిరుథ్‌గౌడ్(98.63), సిద్దార్థ్(99.52), షాసాబ్ గుట్ట-చరణ్‌లాల్(94.38), కోయిలకొండ-శ్రీకాంత్ నాయక్(98.61), భూత్పూర్-సాకేత్ సింగ్(99.60) మంచి ర్యాంక్ సాధించారు.

News April 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు పాలమూరుకు మాజీ సీఎం కేసీఆర్ రాక
✔వనపర్తి:నేడు జడ్పీ సమావేశం
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇంటింటికి ఓటర్ల స్లిప్పులు పంపిణీ
✔కొనసాగుతున్న వాహన తనిఖీలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీ అభ్యర్థులు
✔పోలింగ్ కేంద్రాలపై అధికారుల ఫోకస్
✔బాలానగర్:నేటి నుంచి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు
✔ఉపాధి హామీ పనులపై అధికారుల నజర్

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు: MBNRలో 42.. NGKLలో 34 నామినేషన్లు

image

పాలమూరులోని 2 పార్లమెంట్ స్థానాలకు కలిపి మొత్తం 76 నామినేషన్లు దాఖలయ్యాయి. MBNRలో 42 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. NGKLలో 34 మంది 53 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా రిటర్నింగ్ కార్యాలయాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. నామినేషన్లు రాత్రి వరకు కొనసాగాయి. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.

News April 26, 2024

 NRPT: ఓపెన్ పరీక్షలు.. SSCలో 88, ఇంటర్‌లో 122 గైర్హాజరు

image

సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 593 మంది విద్యార్థులకు 505 మంది హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు 856 మందికి 734 మంది విద్యార్థులు హాజరుకాగా 122 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు వంద శాతం విద్యార్థులు హాజరయ్యారు అని అన్నారు.

News April 26, 2024

BRS, BJP హయాంలో అభివృద్ధి శూన్యం: వంశీచంద్ రెడ్డి

image

పాలమూరు జిల్లాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకుండా ఆగం చేశారని, పాలమూరు జిల్లా ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

News April 26, 2024

పాలమూరుకు కేసీఆర్ ద్రోహం చేశారు: హర్షవర్ధన్ రెడ్డి

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్న కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి గాలి హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాలికి వదిలేసి, ఎన్నికల ముందు బస్సు యాత్ర రోడ్డు షోల పేరుతో పాలమూరు జిల్లాకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని ఆయన మండిపడ్డారు.

News April 25, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ రెండు రోజుల పర్యటన

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. రేపు సా.4.30 నిమిషాలకు MBNR జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్‌లో బస చేస్తారు. 27న నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✏నేటితో ముగిసిన నామినేషన్ల పర్వం
✏BJP 400 సీట్లు సాధించడం ఖాయం: గుజరాత్ సీఎం
✏సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: SPలు
✏NGKL: ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు
✏నేడు CONGRESS,BJP,BRSలో పలువురు చేరికలు
✏ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయండి: కలెక్టర్లు
✏మతోన్మాద BJPని ఓడించాలి:CITU
✏ఉమ్మడి జిల్లాలో మలేరియా నివారణపై ర్యాలీలు
✏KCR కార్నర్ మీటింగ్‌కు తరలి రావాలి:BRS నేతలు