India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల స్నేహిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఎంపీసీ చేసిన స్నేహిత ఫస్టియర్లో 470 మార్కులకు 466 సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 64.75శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64.21%తో MBNR 22వ స్థానంలో నిలిచింది. 7909కి 5078 మంది పాసయ్యారు. 62.82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59.06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 4942కి 2918 మంది పాసయ్యారు. 53.81%తో NRPT 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో MBNR జిల్లా 53.94 శాతంతో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8,962 మందికి గానూ 4834 మంది పాసయ్యారు. NRPT 44.3 శాతంతో 34వ స్థానంలో నిలిచింది. 3781కి గానూ 1675 మంది, WNP 52.78 శాతంతో 23వ స్థానంలో నిలవగా 5458కి గానూ 2881 పాసయ్యారు. NGKL 45.57 శాతంతో 33వ స్థానంలో ఉండగా 5363కి గానూ 2444 మంది, GDL 53.48 శాతంతో 21వ స్థానంలో నిలవగా 3257కి 1742 మంది ఉత్తీర్ణత సాధించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోస్ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా మద్దూరులో, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లూరు రవికి మద్దతుగా బిజినపల్లిలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో విజయంపై ధీమాతో ఉన్నారు.
ఊయలగా కట్టిన చీర గొంతుకు చుట్టుకొని మహిళ చనిపోయింది. పోలీసుల వివరాలు.. మల్దకల్కు చెందిన హేమలత, పరశురాముడు దంపతులు జ్యూస్ వ్యాపారం చేసి జీవిస్తున్నారు. రోజులాగే సోమవారం వ్యాపారం ముగించుకొని హేమలత ఇంటికి వచ్చింది. అప్పటికే చీరతో కట్టిన ఊయలో కుమార్తె ఊగుతుండగా.. ఇంట్లోకి వెళ్తున్న హేమలత గొంతుకు చీర చుట్టుకొని కిందపడింది. గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.
మాజీ CM, BRS అధినేత కేసీఆర్ ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 26న జిల్లా కేంద్రంలో రోడ్లో పాల్గొంటారని, తర్వాత గడియారం కూడలిలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారని వెల్లడించారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో పది, ఇంటర్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై అఘాయిత్యాలకు పాల్పడటం మనసును కలచివేస్తోంది. ఉత్తీర్ణత సాధించలేకపోయినా మళ్లీ పరీక్ష రాసి సత్తాచాటాలి. ఆశించిన మార్కులు రాకపోయినా నిరాశ చెందకుండా ఉన్నత చదువుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని, ఆలోచనలు మార్చుకుంటే అన్ని అద్భుతాలే అని విద్యాశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
దేశభద్రత, భవిష్యత్తుకు బాలికలు తమ వంతు కృషిచేసి దిక్సూచిలా నిలవాలని ఎస్పీ రితిరాజ్ ఆకాంక్షించారు. మంగళవారం ధరూరు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ. బాలికల చదువును మధ్యలో ఆపేసి వారి భవిష్యత్ ను ఆగం చేయవద్దని ఎస్పీ సూచించారు. బాలికలకు అత్యున్నత భారత సైన్యంలో అవకాశం కల్పించారని, దాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
గత ఫిబ్రవరిలో నిర్వహించిన టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిందని MBNR,NGKL DEOలు రవీందర్, గోవిందరాజులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు https://portal.bsetelangana.org/DPSE1STYEARResultsjun/TSTCCresapr.aspx వెబ్ సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.